యథా ఫలితాలు.. తథా ప్రవేశాలు
విద్యార్థినుల కోసం ఏర్పాటు చేసిన హైస్కూల్ ప్లస్(ఇంటర్)లో మొదటి సంవత్సరం ప్రవేశాల్లో అధ్యాపకులకు అవస్థలు తప్పడం లేదు.
ఇంటర్మీడియట్ దరఖాస్తుల కోసం వచ్చిన విద్యార్థులు
న్యూస్టుడే, వెంకట్నగర్: విద్యార్థినుల కోసం ఏర్పాటు చేసిన హైస్కూల్ ప్లస్(ఇంటర్)లో మొదటి సంవత్సరం ప్రవేశాల్లో అధ్యాపకులకు అవస్థలు తప్పడం లేదు. వీటిని ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రారంభించినా కనీసం పాఠ్య పుస్తకాలు అందించలేకపోవడంతో ఆ ప్రభావం ఫలితాలు, ప్రవేశాలపై పడింది. గతేడాది పూర్తిస్థాయి అధ్యాపకులు లేకపోవడంతో జిల్లాలో ఉత్తీర్ణత 7.19 శాతానికే పరిమితమైంది. దీంతో ఇక్కడి ప్రవేశాలపై తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదనే వాదన వినిపిస్తోంది. మొదటి ఏడాది గడిచినా ద్వితీయ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రయోగపరీక్షలు ఎక్కడ చేయిస్తారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
ఇదీ పరిస్థితి..
* కాకినాడ రూరల్ జడ్పీ ఉన్నత పాఠశాలలో 222 మంది పదో తరగతి పరీక్షలు రాశారు. ఇందులో 80 మంది బాలికలే. ఇప్పటి వరకు ఆ పాఠశాలలో కేవలం అయిదుగురు మాత్రమే ఇందులో ప్రవేశాలు పొందారు.
* కరప జడ్పీ ఉన్నత పాఠశాలలో 215 మంది పదో తరగతి పరీక్షలు రాశారు. ఇక్కడ బాలికలు 106 మంది ఉన్నారు. ఎనిమిది మంది మాత్రమే ప్లస్టులో చేరారు.
నిరాసక్తత..
ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని చెబుతున్నా ప్రవేశాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ప్రధానంగా ఉన్నత పాఠశాలలను ఉన్నతీకరించి మండలానికి ఒకటి చొప్పున బాలికల కోసం ఏర్పాటు చేసిన హైస్కూల్ ప్లస్లో మొదటి ఏడాది సగటున పది మంది చేరిన దాఖలాలు లేవు. యాజమాన్యాల వారీగా హైస్కూల్ ప్లస్ 15, ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు 2, సోషల్ వెల్ఫేర్ 7, గురుకులాలు 13, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 14, కేజీబీవీలు 2, మోడల్ పాఠశాలలు 2, ప్రైవేటు కళాశాలలు 61 ఉన్నాయి. ప్రస్తుతం వీటన్నింటిలోనూ ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కార్పొరేట్, ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశాలు పెరగ్గా ప్రభుత్వ కళాశాలల్లో మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. గతనెల 24 నుంచే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల ఒకటి నుంచి తరగుతులు ప్రారంభించారు. ప్రతి గ్రూపులోనూ పరిమితి లేకుండా విద్యార్థులకు అవకాశం కల్పించారు. గతేడాది కాకినాడ జిల్లాలో వివిధ యాజమాన్యాల్లో జనరల్, వృత్తి విద్యాకోర్సులు కలిపి మొదటి సంవత్సరంలో 21,279 మంది ప్రవేశాలు పొందారు.
అధ్యాపకుల నియామకం..
హైస్కూల్ ప్లస్లో బోధించేందుకు పీజీ పూర్తయిన స్కూల్ అసిస్టెంట్లను నియమించారు. వారంతా విధుల్లో చేరడంతో ప్రస్తుతం పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్చేసి ప్రభుత్వ కళాశాలల్లోని వసతుల గురించి వివరిస్తున్నారు. కొంతమంది ఇళ్లకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. నాడు-నేడు కింద కళాశాలల్లో వసతులు మెరుగుపరిచి ఆధునిక సదుపాయాలు కల్పిస్తున్నామని వివరిస్తున్నారు. ప్రవేశాల కోసం కళాశాలల వద్దే దరఖాస్తులు పొంది, పూర్తిచేసి తిరిగి అక్కడే అందజేయాలి. తెలుగు, ఆంగ్లం మాధ్యమాల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. హైస్కూల్ ప్లస్లో సౌకర్యాల మెరుగుకు చర్యలు తీసుకున్నామని డీఈవో అన్నపూర్ణ తెలిపారు. అన్నిచోట్లా అధ్యాపకులను నియమించామని, సప్లిమెంటరీ ఫలితాలు వచ్చిన తర్వాత ప్రవేశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నవరంలో నూతన ధ్వజస్తంభ పనులకు శ్రీకారం
[ 28-03-2024]
అన్నవరం దేవస్థానంలో అనివేటి మండపంలో బంగారు తాపడంతో నూతన ధ్వజస్తంభం ఏర్పాటుకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేసి గురువారం శ్రీకారం చుట్టారు. -
అనపర్తి బరిలో విశ్రాంత సైనికుడు
[ 28-03-2024]
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అనపర్తి నియోజకవర్గం తెదేపా, భాజపా, జనసేన కూటమి అభ్యర్థిగా విశ్రాంత జవాన్ ములగపూడి శివకృష్ణంరాజు పేరును అధిష్ఠానం బుధవారం రాత్రి ప్రకటించింది. -
ఓరి దేవుడా.. వీళ్లు మారరా..?
[ 28-03-2024]
రెండు చేతులు ఎత్తి భక్తితో మొక్కాల్సిన దేవుడిపైనా ఎందుకో కక్ష.. దైవ సన్నిధిలో భక్తితో మెలగాలన్న కనీస విజ్ఞత మరచి భక్తుల ఎదుటే బూతు పురాణం.. అర్చకులపై దాడి.. గడచిన అయిదేళ్లలో వరస సంఘటనలు ప్రభుత్వ వైఫల్యాన్ని, శాంతిభద్రతల పర్యవేక్షణ -
ఎన్నికలొస్తున్నాయి ఆపేయండి.. రూ.కోట్లు పెట్టాం కుదరదు!
[ 28-03-2024]
ఎన్నికలకు ఇంకా 47 రోజులే సమయం ఉంది. అయిదేళ్లుగా చేపట్టిన ఇసుక తవ్వకాల వల్ల ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నాం.. ఇకనైనా తవ్వకాలు నిలిపి.. సహకరించండి.. -
కలెక్టర్ చెప్పినా ఖాతరు లేదు!
[ 28-03-2024]
రూ.వేలకు వేలు పెట్టుబడులు పెట్టాం.. చుక్క నీరు లేదు.. చావే శరణ్యం.. కష్టకాలంలో ఉన్నాం ఆదుకోండి మహా ప్రభో అంటూ కార్యాలయాల చుట్టూ తిరిగాం.. అధికారులకు వేదన వినిపించాం.. -
2,400 ఇళ్ల రద్దు
[ 28-03-2024]
జిల్లాలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో మంజూరు చేసిన గృహాల్లో 2,403 రద్దు చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇప్పటి వరకు పునాదులు పడని ఇళ్లను జాబితా నుంచి తొలగించారు. -
సి-విజిల్ ఫిర్యాదులపై సత్వర చర్యలు
[ 28-03-2024]
సాధారణ ఎన్నికలకు సంబంధించి సీ-విజల్ యాప్కు వచ్చే ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కృతికాశుక్లా తెలిపారు. -
‘జగన్ను ఇంటికి పంపడమే కూటమి లక్ష్యం’
[ 28-03-2024]
అయిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన జగన్ను ఇంటికి పంపడమే తెదేపా, జనసేన, భాజపా కూటమి లక్ష్యమని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు అన్నారు. -
కొంటారా.. కొర్రీలు వేస్తారా..?
[ 28-03-2024]
గత రెండేళ్లుగా రబీలో బొండాలు (ఎంటీయూ 3626) రకం ధాన్యం కొనుగోలుపై అయోమయం నెలకొంటోంది. ఈ రకం సాగు చేయొద్దని.. చేస్తే ధాన్యం కొనుగోలు చేయమని రెండేళ్ల కిందట వ్యవసాయ, పౌరసరఫరా శాఖల అధికారులు రైతులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. -
వాత్సల్యం చూపలేదు..!
[ 28-03-2024]
కె.గంగవరం మండలం కుడుపూరుకు చెందిన వీధి జీవన్బాబు తల్లిదండ్రులను కోల్పోయి తాతయ్య మందపల్లి వెంకట్రావు వద్ద పెరుగుతున్నాడు. ప్రస్తుతం దంగేరు జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు. -
ఎన్నికల ఏర్పాట్లపై నియోజకవర్గాల వారీగా నివేదికలు
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ముందస్తు కార్యాచరణకు సంబంధించి నియోజకవర్గాల వారీగా నివేదికలు పంపించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత ఆదేశించారు. -
జగనన్నకాలనీలో యువకుడిని బలిగొన్న విద్యుత్తు తీగలు
[ 28-03-2024]
జగనన్నకాలనీలో చేతికందే ఎత్తులో ఉన్న అధిక సామర్థ్యపు విద్యుత్తు తీగ తగిలి పెయింటింగ్ పనులు చేసే కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. -
నల్లమిల్లికి టికెట్ కేటాయించలేదని నిరసన
[ 28-03-2024]
అనపర్తి నియోజకవర్గానికి బుధవారం రాత్రి భాజపా అభ్యర్థి పేరు ప్రకటించిన వెంటనే తెదేపా నాయకులు, కార్యకర్తలు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. -
వైకాపా ప్రజాప్రతినిధికి స్మగ్లింగ్ బ్యాచ్తో సంబంధం
[ 28-03-2024]
రాజమహేంద్రవరంలో అధికార వైకాపాకి చెందిన ఓ ప్రజాప్రతినిధికి స్మగ్లింగ్ బ్యాచ్తో కూడా సంబంధాలు ఉన్నాయని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, నగర ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. -
‘వైకాపా పాలనలో పంచాయతీలను పనికిరాకుండా చేశారు’
[ 28-03-2024]
వైకాపా పాలనలో పంచాయతీలను పనికిరాకుండా చేశారని సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైకాపా సీనియర్ నాయకుడు అల్లు విజయ్ కుమార్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!