ఒకటే వంతెన.. ఎక్కాలంటే యాతన
ప్రయాణికుల భద్రతే మా లక్ష్యం.. అంటూ రైల్వే శాఖ అన్ని స్టేషన్లలో భారీగా ప్రచారం చేస్తున్నా ఆచరణలో శూన్యమని చెప్పడానికి నిదర్శనం పలుచోట్ల ప్రయాణికులు ప్రమాదకరంగా పట్టాలు దాటడమే.
న్యూస్టుడే, పెద్దాపురం, సామర్లకోట
రెండు, మూడు ప్లాట్ఫారాల నుంచి మొదటి ప్లాట్ఫారానికి రావడానికి పట్టాలు దాటుతున్న ప్రయాణికులు
ప్రయాణికుల భద్రతే మా లక్ష్యం.. అంటూ రైల్వే శాఖ అన్ని స్టేషన్లలో భారీగా ప్రచారం చేస్తున్నా ఆచరణలో శూన్యమని చెప్పడానికి నిదర్శనం పలుచోట్ల ప్రయాణికులు ప్రమాదకరంగా పట్టాలు దాటడమే. కాకినాడ జిల్లాలోని సామర్లకోట జంక్షన్ రైల్వేపరంగా ప్రధాన జంక్షన్. రోజూ ఇటు విశాఖపట్నం, అటు విజయవాడ నగరాలకు 60 రైళ్లు పరుగులు తీస్తుంటాయి. వాటిలో దాదాపు 20 వేల మంది వరకు ఈ స్టేషన్ నుంచే వివిధ ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తున్నారు. పెద్దాపురం, సామర్లకోట, ప్రత్తిపాడు, జగ్గంపేట, ఏలేశ్వరం, గండేపల్లి, కిర్లంపూడి, కాకినాడ తదితర కేంద్రాల నుంచి ప్రయాణికులు సామర్లకోట నుంచే వివిధ నగరాలు, ముఖ్య ప్రాంతాలకు వెళ్లేందుకు రైళ్లను ఆశ్రయించాల్సి ఉంటుంది. ఇలాంటి కీలకమైన స్టేషన్లో మూడు ప్లాట్ఫారాలు, ఒకటే వంతెన ఉంది. రైళ్లు ఎక్కడానికి, దిగి ఫ్లాట్ఫారాలు మారడానికి ఎంతో అవసరమైన వంతెన ఎక్కడానికి కొంత దూరం నడిస్తేనేగానీ అందుబాటులోకి రాదు. ఈ కారణంగా ఎక్కువ మంది ప్రయాణికులు బ్యాగులు, సామగ్రితో నడవలేక, వృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లలతో వచ్చినవారు, చంటిపిల్లలను ఎత్తుకున్న మహిళలు పట్టాలు దాటేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఆ సమయంలో రైళ్ల రాకపోకలు ఉంటే ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం. రైల్వే శాఖాపరంగా ఇది ప్రధాన జంక్షన్ అయినా స్టేషన్లో ఎస్కలేటరు లేదు. ఒక ఫ్లాట్ఫారంపై వంతెన ఉన్న నేపథ్యంలో మధ్యలో మరో వంతెన లేదా ఎస్కలేటర్ ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు ప్రజాప్రతినిధులు, అధికారులకు వినతిపత్రాలు అందించినా స్పందన లేదు.
రైల్వే జోనల్ సమావేశంలో చర్చిస్తా...
సామర్లకోట రైల్వేస్టేషన్లో ప్రయాణికుల ఇబ్బందులను కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతాను. స్టేషన్లో ఫ్లాట్ఫారాలు మారేందుకు రెండో వంతెన, ఎస్కలేటర్ అవసరమే. చాలామంది ప్రయాణికులు ప్రమాదకర పరిస్థితుల్లో పట్టాలు దాటుతున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని రైల్వే జోనల్ సమావేశంలో చర్చిస్తాను.
రావుల మాధవరావు, జడ్ఆర్యూసీసీ సభ్యుడు, పిఠాపురం
ప్రతిపాదనలు పంపాం..
సామర్లకోట రైల్వేస్టేషన్ ప్రధాన జంక్షన్ అన్నది వాస్తవమే. ప్రస్తుతం ఒకే ప్లాట్ఫారం వంతెన ఉంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుంటే మరొకటి అవసరం. ప్రయాణికుల ఇబ్బందులను అర్థం చేసుకుని ఎస్కలేటర్ ఏర్పాటుచేయడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపాం. వారి నుంచి అనుమతులు వచ్చిన వెంటనే ఏర్పాటుకు కృషి చేస్తాం.
ఎం.రమేష్, రైల్వేస్టేషన్ మాస్టర్, సామర్లకోట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలన అంతమొందిద్దాం
[ 24-04-2024]
జగన్ పరిపాలనను అంతమొందిద్దాం.. పిడికిలి బిగించి మరీ కూటమిని గెలిపించుకుందామని జనసేన అధినేత పిలుపునిచ్చారు. పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో మంగళవారం రాత్రి జరిగిన సభలో ప్రసంగించారు. -
జగన్ మాటిస్తే.. నీటి మూటే!
[ 24-04-2024]
సీఎం చెప్పిన మాట ప్రకారం సంక్రాంతి వెళ్లిపోయింది.. ఉగాది దాటేసింది. ఇవేవీ ప్రభుత్వానికి గుర్తులేకపోయినా ఎన్నికల నగారా మోగుతుందనే విషయం జ్ఞప్తికి వచ్చింది. ఖజానాలో కాసులు లేకున్నా రైతులకు తుపాను పరిహారం అంటూ హడావుడిగా మార్చి 6న బటన్ నొక్కారు. -
తలూపినా తలోదారే!
[ 24-04-2024]
రాజమహేంద్రవరం నగరంలో అధికార పార్టీ నేతల్లో వర్గపోరు కొనసాగుతూనే ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా వీరిమధ్య పొరపొచ్చాలు సమసిపోవడం లేదు. -
రోగుల భద్రత మరిచావా పాలకా!
[ 24-04-2024]
ఒకప్పుడు నిత్యం ప్రయాణికులతో కళకళలాడే గోదావరి రైల్వేస్టేషన్ పలు సమస్యలతో కునారిల్లుతోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పాలు, కూరగాయలు తీసుకొచ్చే చిరు వ్యాపారులు.. చదువుల నిమిత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులు.. ఉద్యోగులు ఇక్కడి నుంచే పాసింజర్లలో రాకపోకలు సాగించేవారు. -
అనపర్తి.. వీడిన అనిశ్చితి
[ 24-04-2024]
అనపర్తి నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి స్థానంపై కొన్నిరోజులుగా నెలకొన్న ఉత్కంఠ వీడింది. కూటమి పెద్దల నిర్ణయంతో సుమారు 27 రోజుల తర్వాత అనిశ్చితికి తెరపడింది. -
మామ బడాయి మాటలు..
[ 24-04-2024]
నాడు-నేడు మొదటి విడత పనుల్లో మండలంలోని వాదాలకుంట మొదటి విడత పనులే ఇంకా..ఉన్నత పాఠø‹లలో ఆరు అదనపు గదులు మంజూరయ్యాయి. నిధులు కొరత కారణంగా వాటిని తగ్గించి నాలుగుకు తగ్గించారు -
బటన్ నొక్కి జగన్ ఎంత డబ్బు వెనకేశారు?
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అయిదేళ్ల పాటు బటన్ నొక్కి పేదలకు డబ్బులు పంపిణీ చేశానని చెబుతున్నారని, అదే బటన్ నొక్కి ఆయన ఇంకెంత వెనకేసుకున్నారని వంగవీటి రాధా ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో మంగళవారం సాయంత్రం ఆయన పర్యటించారు -
రూ.2.58 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం
[ 24-04-2024]
ఎన్నికల తనిఖీల్లో భాగంగా కడియం పోలీసులు రూ.2.58 కోట్లు విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. -
హోంమంత్రి ర్యాలీలో గాయపడిన దళితుడు ఇకలేరు
[ 24-04-2024]
హోంమంత్రి తానేటి వనిత నామినేషన్ ర్యాలీకి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తూ పడిపోయి గాయపడిన దళితుడు తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం కురుకూరు గ్రామానికి చెందిన పల్లపు అబ్బులు (73) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. -
మే 26 వరకు కాకినాడ- విశాఖ రైలు రద్దు
[ 24-04-2024]
కాకినాడ పోర్టు- విశాఖపట్నం(17267), విశాఖపట్నం-కాకినాడ పోర్టు(17267) రైళ్లను ఈ నెల 29 నుంచి మే 26 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. -
వైకాపా గొప్పలు.. రైతుకు తిప్పలు
[ 24-04-2024]
మాది రైతుల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొంటున్న వైకాపా పాలనలో కర్షకులు అనుభవిస్తున్న అవస్థలకు ఈ చిత్రమే నిదర్శనం. కట్టిస్తామన్న గోదాములు నిర్మించక, కనీసం కళ్లాలకూ స్థలాలు చూపకపోవడంతో రైతులు ధాన్యం ఆరబోసుకునేందుకు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. -
జగన్ను కుర్చీ దింపాలి
[ 24-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా అర్బన్ నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే ఆభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ నేతృత్వంలో మంగళవారం సాయంత్రం భారీ ర్యాలీ, రోడ్ షో నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం