టిడ్కో లబ్ధిదారులకు బ్యాంకర్ల కొర్రీ
అమలాపురం పట్టణానికి చెందిన లక్ష్మి అనే గృహిణికి అల్లవరం మండలం బోడసకుర్రు పంచాయతీ పరిధిలో నిర్మించిన టిడ్కో గృహ సముదాయంలో ఇల్ల్లు మంజూరైంది. అధికారులు బ్యాంకు రుణం వస్తే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు.
సిబిల్ స్కోర్, వయస్సు పేరిట రుణాల మంజూరుకు నిరాకరణ
న్యూస్టుడే, అమలాపురం కలెక్టరేట్
బోడసకుర్రు వద్ద నిర్మించిన టిడ్కో గృహ సముదాయం
అమలాపురం పట్టణానికి చెందిన లక్ష్మి అనే గృహిణికి అల్లవరం మండలం బోడసకుర్రు పంచాయతీ పరిధిలో నిర్మించిన టిడ్కో గృహ సముదాయంలో ఇల్ల్లు మంజూరైంది. అధికారులు బ్యాంకు రుణం వస్తే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. దీంతో రుణం కోసం ఆమె బ్యాంకుకు వెళ్లగా సిబ్బంది ఆధార్ నంబరు ద్వారా సిబిల్ స్కోరు పరిశీలించి తక్కువగా ఉన్న కారణంగా రుణం మంజూరు చేయలేమన్నారు. సొమ్ము చెల్లిస్తే తప్ప రిజిస్ట్రేషన్ చేయలేమని అధికారులు చెబుతున్నారు.
రామచంద్రపురం పురపాలిక పరిధిలో 55 ఏళ్ల మహిళకు నాలుగేళ్ల కిందట టిడ్కో ఇల్లు మంజూరైంది. పత్రం చేతికొచ్చే సమయంలో ప్రభుత్వం మారింది. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన నాలుగేళ్ల తరువాత రిజిస్ట్రేషన్లు చేయడం ప్రారంభించారు. లబ్ధిదారుడి వాటా సొమ్ము పోను మిగిలిన మొత్తం రుణంగా తీసుకునేందుకు బ్యాంకుకు వెళితే వయస్సు ఎక్కువగా ఉన్నందున ఇవ్వలేమని చెప్పేశారు.
..వీరే కాదు.. జిల్లా వ్యాప్తంగా సుమారు 316 మంది లబ్ధిదారులకు సిబిల్ స్కోరు లేని కారణంగా రుణం ఇవ్వడానికి బ్యాంకర్లు తిరస్కరించారు.
పట్టణ పేదల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్లకు నాలుగేళ్లవుతున్నా పూర్తిస్థాయిలో మోక్షం కలగడం లేదు. గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వడంలో వైకాపా ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. మరో వైపు లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్ చేయడానికి అవసరమైన రుణాల మంజూరుకు బ్యాంకులు
పలు కొర్రీలు పెడుతున్నాయి. దీంతో కొందరు లబ్ధిదారులు సొంత సొమ్ముతో రిజిస్ట్రేషన్లకు సిద్దమవుతుంటే, మరి కొందరికి చేతిలో సొమ్ము లేక సొంత గూడుకు దూరమవ్వాల్సి వస్తోంది.
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం, రామచంద్రపురం, మండపేట పురపాలికల పరిధిలో ఉన్న పేదలకు ఆయా ప్రాంతాల్లో 4,192 టిడ్కో ఇళ్లు నిర్మించారు. మూడు కేటగిరీలుగా గృహాలు నిర్మించి లబ్ధదారులకు అందించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. వీటిలో 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇళ్లకు బ్యాంకు రుణాలు అవసరం లేదు. 365, 430 చ.అ. కేటగిరీ ఇళ్ల లబ్ధిదారులకు మాత్రం బ్యాంకు రుణం అవసరం. గతేడాది నవంబరు నుంచి అధికారులు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు పెట్టారు. ఆరునెలలు కావస్తున్నా పూర్తి స్థాయిలో లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్లు చేయించలేకపోయారు. బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు సాంకేతిక కారణాలు సాకుగా చూపి తప్పుకుంటున్నాయి. దీంతో చేసేది లేక కొందరితో సొంత డబ్బు కట్టి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. అమలాపురం పురపాలిక పరిధిలో రూ.3 లక్షల రుణం చెల్లించేందుకు మూడు వాయిదాలు ఇచ్చినట్లు సమాచారం. ఇలా సుమారు వంద మందికి పైగా వరకు సొంత సొమ్ము చెల్లించి టిడ్కో ఇళ్లు రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు.
పాత బకాయిలు చెల్లిస్తే ఆలోచిద్దాం..
జగనన్న తోడు, చేదోడు, ముద్ర, స్వనిధి వంటి ప్రభుత్వ పథకాల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా స్వల్ప రుణాలు మంజూరు చేశారు. వాటికి కూడా అధికారులకు లక్ష్యాలు విధించడంతో అవసరం లేని వారికి కూడా వెంటపడి ఇచ్చారు. ఆయా రుణాలను తిరిగి ఏడాదిలోగా బ్యాంకులకు చెల్లించాలి. తక్కువ మొత్తమే అయినా కొంత మంది కొన్ని వాయిదాలు బకాయి పడడం, సకాలంలో చెల్లించక పోవడం వంటివి జరిగాయి. టిడ్కో రుణాలకొచ్చే సరికి ఈ బకాయిల ప్రభావం వల్ల సిబిల్ స్కోర్ తగ్గి రుణాల మంజూరుకు అడ్డంకిగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం పాత బకాయిలు చెల్లించి నాలుగు నెలలు తరువాత రండి అప్పటికి సిబిల్ స్కోరు పెరుగుతుంది. అప్పుడు రుణాల గురించి ఆలోచిద్దామని పంపించేస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు.
బ్యాంకర్లతో మాట్లాడుతున్నాం..
టిడ్కో ఇళ్లరుణ ప్రక్రియ దాదాపుగా పూర్తికావస్తోంది. జిల్లా వ్యాప్తంగా 300 మంది పైగా సిబిల్ స్కోరు లేని కారణంగా రుణాలు నిలిచి పోయాయి. వారిలో ఇప్పటి వరకు సుమారు సగం మంది పైగా సొంత సొమ్ము చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సిబిల్ స్కోరు లేని వారికి, వయస్సు పైబడిన వారికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ఆసక్తి చూపడం లేదు.అవకాశం ఉన్నంత వరకు బ్యాంకు రుణాలు మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. లేని పక్షంలో సొంతంగా సొమ్ము చెల్లించాలని లబ్ధిదారులకు సూచిస్తున్నాం.
ప్రియంవద, మెప్మా పీడీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోసపు దీవెన.. సొమ్మురాక వేదన
[ 25-04-2024]
రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందిస్తామని... దాని కోసం విద్య, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. -
ప్రతి గొంతూ జేజేలు
[ 25-04-2024]
నడినెత్తిన సూరీడు సుర్రుమంటుంటే.. పూల జల్లుల వాన కురిసింది.. గొంతులన్నీ ఒక్కటై జేజేలు కొట్టాయి. జనసేన.. తెదేపా.. భాజపా జెండాలు రెపరెపలాడాయి. -
నియమావళికి సెలవిచ్చి.. మంత్రి హామీకి విలువిచ్చి..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేముందు హడావుడిగా జిల్లావ్యాప్తంగా అనేక పనులకు వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు శంకుస్థాపనలు చేశారు. వీటిలో కొన్ని పనులు నేటికీ ప్రారంభించనేలేదు. -
జగన్.. మాపై ఎందుకింత కక్ష?
[ 25-04-2024]
గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు కాపులకు వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూ.కోట్లలో ఖర్చు చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్ రుణాలకు ఎగనామం పెట్టింది. -
సర్కారు సహకారం కరవై.. నిర్వహణ భారమై..
[ 25-04-2024]
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరం తాడితోట వస్త్రమార్కెట్ గత అయిదేళ్లుగా తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. వ్యాపారాలు పడిపోయి వెలవెలబోతోంది. -
కొవ్వూరు వైకాపాలో రగడ
[ 25-04-2024]
కొవ్వూరు నియోజకవర్గ వైకాపాలో వర్గవిభేదాలు తారస్థాయికి చేరాయి. నియోజకవర్గ పరిశీలకుడి పదవి చిచ్చు రెండు సామాజికవర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది. -
నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ పర్వం గురువారంతో ముగియనుంది. పోటీచేసే అభ్యర్థుల నుంచి చివరిరోజు కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్
[ 25-04-2024]
రాజమహేంద్రవరం ఆంధ్రా పేపరుమిల్లుకు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. ఈ విషయాన్ని బుధవారం నోటీసు బోర్డులో పెట్టడంతో గత 23 రోజులుగా సమ్మెలో ఉన్న కార్మికులు ఆందోళన వ్యక్తంచేశారు. -
ఎన్నికల వేళ కుర్చీల లొల్లి!
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధులను తరలించేందుకు వీల్ఛైర్లు అవసరం.. అయితే గుత్తేదారుల నుంచి కొనుగోలు చేసిన వీటికి పంచాయతీల ఖజానా నుంచి డబ్బులు చెల్లించమనడంపై సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అట్టహాసంగా నామినేషన్లు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం అట్టహాసంగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో బుధవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. -
ఉద్యోగులు, పింఛనుదారులను పట్టించుకోని ప్రభుత్వం
[ 25-04-2024]
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శలు పాలంకి సుబ్బరాయన్, పెద్దన్నగౌడ్ వాపోయారు. -
మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు
[ 25-04-2024]
ఎన్నికల నేపథ్యంలో ఓటు అమ్మొద్దు.. ఓటు కొనద్దు.. అంటూ ఓ పౌరుడు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ స్థానికంగా అందర్నీ ఆలోచింపజేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని గాంధీనగర్లో జై భారత్ -
నన్నయలో ఖేలో ఇండియా ప్రాజెక్ట్ కమిటీ సభ్యుల పర్యటన
[ 25-04-2024]
నన్నయ విశ్వవిద్యాలయంలో ఖేలో ఇండియా పథకానికి సంబంధించిన పనులను కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ప్రతినిధులు బుధవారం పరిశీలించారు. -
భీమేశ్వరుని గర్భాలయం మూసివేత
[ 25-04-2024]
కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ద్రాక్షారామ భీమేశ్వరుని ఆలయంలో స్పటిక లింగానికి మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో గర్భాలయాన్ని బుధవారం నుంచి మూసివేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు