పోలవరం నిర్మాణం తెదేపాకే సాధ్యం
తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని, వైకాపా ప్రభుత్వం వల్లకాదని గత నాలుగేళ్లలో రుజువైందని రాజమహేంద్రవరం గ్రామీణ శాసనసభ్యుడు, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు.
గోరంట్ల బుచ్చయ్యచౌదరి
దేవీచౌక్ (రాజమహేంద్రవరం)
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న గోరంట్ల
తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని, వైకాపా ప్రభుత్వం వల్లకాదని గత నాలుగేళ్లలో రుజువైందని రాజమహేంద్రవరం గ్రామీణ శాసనసభ్యుడు, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. ఈ ప్రాజెక్టును అడ్డుపెట్టుకుని జగన్ ప్రభుత్వం నిధులు దోచుకుంటోందని ఆరోపించారు. రాజమహేంద్రవరంలోని ప్రెస్క్లబ్లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెదేపా హయాంలో నిధులు దుర్వినియోగం అయ్యాయని, రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా చేస్తామని చెప్పిన జగన్ రెట్టింపు నిధులు ఖర్చు చేస్తున్నా, ఈ ప్రభుత్వంలో పనులు 2 శాతమే పూర్తయిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో 72 శాతం పనులు పూర్తయితే, ఈ నాలుగేళ్లలో వారు సాధించిన పురోగతి 2 శాతమేనని ఎద్దేవా చేశారు. నిర్వాసితులకు పునరావాస కల్పనలో పూర్తిగా విఫలమయ్యారని, నాలుగేళ్లలో కనీసం ఒక్క ఇల్లు అయినా నిర్మించారా? అని ప్రశ్నించారు. నీటి నిల్వను 194 టీఎంసీల నుంచి 145కు తగ్గించి జాతీయ ప్రాజెక్టును కాటన్ బ్యారేజీ స్థాయికి దిగజార్చారని ఆక్షేపించారు. రాయలసీమకు నీరు వెళ్లకుండా చేసి సీమాంధ్రులకు ద్రోహం చేశారన్నారు. అధికారులు, కాంట్రాక్టర్లు 2025 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని చెబుతుంటే, ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జగన్ మాత్రం డిసెంబరు నాటికి ప్రారంభిస్తామని అంటున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు మీడియాను రానివ్వకుండా అంత రహస్యంగా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పనికిమాలిన ప్రభుత్వ నిర్వాకం వల్ల 900 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టు అతీగతీ లేకుండా పోయిందన్నారు. ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై చర్చకు రావాలని గోరంట్ల సవాలు విసిరారు. రాష్ట్రంలో ఇసుక, మైనింగ్, మద్యం ఇలా.. అన్నింట్లోనూ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్తు ఛార్జీలను నాలుగు రెట్లు పెంచి ప్రజలపై భారం మోపారన్నారు. రాయలసీమలో లోకేశ్ పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. విలేకరుల సమావేశంలో తెదేపా నాయకులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, మత్సేటి శివప్రసాద్ పాల్గొన్నారు.
మద్యనిషేధం హామీలాంటిదే..
టి.నగర్: ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన కొత్త పింఛన్ పథకం అమలుపై నమ్మకం లేదని రాజమహేంద్రవరం గ్రామీణ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి పేర్కొన్నారు. బుధవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. గత ఎన్నికలకు ముందు మద్యపాన నిషేధం అమలు చేస్తానని ప్రజలకు మాట ఇచ్చి తప్పాడని గుర్తు చేశారు. మద్యనిషేధం లాంటి హామీనే మళ్లీ ఇప్పుడు తెరపైకి తెచ్చాడని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షేమ పథకాలకు బీజం వేసిన ఘనత తెదేపాదే
[ 29-03-2024]
పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత తెదేపాకే దక్కుతుందని తెదేపా మండల అధ్యక్షుడు నామన పరమేశ్వరరావు తెలిపారు. -
నిగ్గదీయొద్దు.. నోరు మెదపొద్దు: వైకాపా నేతను కాపాడేందుకు ఎన్ని ఆపసోపాలో!
[ 29-03-2024]
తిడితే పడాలి... కొడితే భరించాలి.. అధికార పక్ష నాయకుల అరాచకాలపై నోరు మెదిపితే ఇబ్బందే. -
పనిచేయని ఏసీలు, ఫ్యాన్లు.. సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
[ 29-03-2024]
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. -
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
[ 29-03-2024]
అనపర్తి నియోజకవర్గంలో తెదేపా ఉనికి లేకుండా చేయాలనే దురుద్దేశంతో వైకాపా కుట్రకు తెరలేపిందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. -
అనకొండలు.. అధికారం అండదండలు
[ 29-03-2024]
కక్ష కట్టారో.. తప్పు జరగకపోయినా.. ఎలాంటి ఫిర్యాదులు అందకపోయినా కార్యాలయాల మీదకు వచ్చి పడతారు.. బాధితులతో బలవంతంగా ఫిర్యాదులు రాయించి మరీ వెంటాడి వేధిస్తారు.. -
పవన్.. వారాహి విజయభేరి
[ 29-03-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. -
తొలి అడుగు ఉన్నతంగా తీర్చిదిద్దుకుందాం
[ 29-03-2024]
ఇంటర్మీడియట్.. విద్యార్థి భవితకు తొలి అడుగు. కెరియర్ను ఏవిధంగా తీర్చిదిద్దుకోవాలి.. ఏ కోర్సులను ఎంచుకోవాలి.. ఎలా ముందడుగు వేయాలి.. అవకాశాలు ఎలా అందిపుచ్చుకోవాలి.. ఇలా ఎన్నో సందేహాలు విద్యార్థులు.. తల్లిదండ్రులకు తలెత్తుతుంటాయి. -
ఆదుకుంటున్న సీలేరు జలాలు
[ 29-03-2024]
గోదావరిలో కొన్ని రోజులుగా నీటిమట్టం క్రమంగా పడిపోతోంది. -
ప్రదర్శన దర్పం.. ప్రయోజనం దూరం
[ 29-03-2024]
వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు రూపొందించిన సృజనాత్మక పరికరాల ప్రదర్శన వేదికన్నారు.. రెండు వందలకు పైగానే నమూనాలను ప్రదర్శించినట్లు ఆర్భాటంగా ప్రకటించారు. -
సంద్రంలో సమర భేరి
[ 29-03-2024]
కాకినాడ గ్రామీణం సూర్యారావుపేట సముద్రంలో ఇండో-అమెరికన్ సంయుక్త నావికా దళాల రహస్య సైనిక విన్యాసాలు కొనసాగుతున్నాయి. -
ప్రచారం.. కావాలి పర్యావరణ హితం
[ 29-03-2024]
రాష్ట్రంలో ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉన్నా.. అది దస్త్రాలకే పరిమితమవుతోంది. -
త్రివేణి సంగమంలా కూటమి పార్టీలు పనిచేస్తాయి
[ 29-03-2024]
రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు భాజపా అభ్యర్థులను కేంద్ర నాయకత్వం నిర్ణయించిందని, అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవించి కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, భాజపా ఏపీ ఎన్నికల సహబాధ్యుడు సిద్ధార్థ్నాథ్ సింగ్ శ్రేణులను కోరారు. -
పక్కాగా ఎన్నికల నియమావళి అమలు
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా అధికార యంత్రాంగంతో పోలీసు వ్యవస్థ మమేకమై పనిచేస్తుందని ఏలూరు రేంజి ఐజీ జీవీజీ అశోక్కుమార్ అన్నారు. -
ప్రాణం తీసిన సహజీవనం
[ 29-03-2024]
ఓ మహిళతో సహజీవనం కోసం మద్యం మత్తులో ఉన్న స్నేహితుడిపైనే కత్తిదూసి హత్యచేశాడో వ్యక్తి.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్