నాడు ఎక్కడో.. నేడు అక్కడే
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి, సకల సౌకర్యాలు కల్పించి కార్పొరేట్ విద్యాలయాలకు తీసిపోని రీతిలో తీర్చిదిద్దుతామని సర్కారు ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది.
పాఠశాలల్లో అసంపూర్తి పనులు
కొద్దిరోజుల్లో మోగనున్న బడి గంట
ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్టుడే, వెంకట్నగర్, పిఠాపురం
సాలిపేట బాలికోన్నత పాఠశాలలో అసంపూర్తి పనులు
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి, సకల సౌకర్యాలు కల్పించి కార్పొరేట్ విద్యాలయాలకు తీసిపోని రీతిలో తీర్చిదిద్దుతామని సర్కారు ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండో విడత నాడు-నేడు పనులకు సంబంధించిన నిధులు తొలినాళ్లలో సకాలంలో అందలేదు. గతేడాది ఆగస్టులో జమ కావాల్సినవి ఈ ఏడాది మార్చి, ఏప్రిల్లో విడుదలయ్యాయి. పనులు ప్రారంభించేందుకు ప్రధానోపాధ్యాయులు సిద్ధమవగా ప్రభుత్వ గోదాముల్లో సిమెంటు నిల్వలు లేక ఇంజినీరింగ్ అధికారులు చేతులెత్తేశారు. మొదటి విడత నాడు-నేడులో మంజూరై పాఠశాలల్లో మిగిలిన సిమెంటు వినియోగించుకోవాలని ఉచిత సలహాలిచ్చినా.. అది గడ్డ కట్టుకుపోయి నిరుపయోగంగా ఉంది. ఏప్రిల్ చివరి వారంలో సిమెంటు సరఫరా చేయడంతో పనులు ప్రారంభమైనా.. ఇతర నిర్మాణ సామగ్రి మాత్రం సరఫరా కాలేదు.
నమోదు చేసినా రాలేదు
నిర్మాణ సామగ్రి కొనుగోలు చేసే వెసులుబాటు హెచ్ఎంలకు ఇవ్వలేదు. చలువ రాతి పలకలు (టైల్స్), విద్యుత్తు సామగ్రి, గృహోపకరణాలు (బల్బులు, పంకాలు), శానిటరీ సామగ్రికి నాడు-నేడు యాప్లో ఇండెంట్ పంపాలి. ఆన్లైన్లో నమోదు చేసిన 14 రోజుల్లో సామగ్రి అందిస్తామని అధికారులు చెప్పారు. నెలలు గడుస్తున్నా అవి చేరకపోవడంతో పనులు నిలిచిపోయాయని ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు.
సరిపడా గదులు లేక
* కాకినాడ జిల్లాలో తొలుత 1,700 అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని అనుకున్నా తరువాత ఆ సంఖ్య 1,200కు పరిమితం చేశారు.
* కాకినాడ సాలిపేట బాలికోన్నత పాఠశాలలో సుమారు 1,500 మంది విద్యార్థులున్నారు. అవసరమైన మేర గదులు లేక కొన్ని తరగతులు ఉదయం, మరికొందరికి మధ్యాహ్నం నిర్వహించే పరిస్థితి ఉండేది. స్మార్ట్సిటీ నిధులతో గతేడాది నాలుగు గదులు నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న రీత్యా అదనపు తరగతి గదుల నిర్మాణానికి నాడు-నేడు రెండో విడతలో గుర్తించి పనులు చేపట్టగా అవి నత్తనడకన సాగుతున్నాయి.
కొత్తపల్లి మండలం వాకతిప్పలో అసంపూర్తిగా..
కాకినాడ జిల్లాలో..
* పిఠాపురం నియోజకవర్గం పరిధిలో పనులు నత్తనడకన సాగుతున్నాయి. 56 పనులకు రూ.20.12 కోట్లు మంజూరవగా, రూ.10 కోట్ల విలువైనవి జరిగాయి. ఏ పాఠశాలలోనూ పూర్తిస్థాయిలో జరగలేదు.
* గొల్లప్రోలులో రెండో దశ నాడు-నేడు కింద రూ. 4.04 కోట్లు మంజూరైతే రూ.3.22 కోట్ల పనులు జరిగాయి.
* కొత్తపల్లిలో 36 పనులకుగాను రూ.20.55 కోట్లు మంజూరవగా, రూ.4.46 కోట్లు ఖర్చు చేశారంటే పురోగతి ఏ స్థాయిలో ఉందో అంచనా వేయవచ్చు.
* గొల్లప్రోలు జడ్పీ బాలికోన్నత పాఠశాలలో అయిదు అదనపు గదుల నిర్మాణానికి గతయేడాది మార్చి 28న ఎమ్మెల్యే పెండెం దొరబాబు శంకుస్థాపన చేసినా ఇప్పటికీ పిల్లర్ల దశలోనే నిలిచిపోయాయి. ఇక్కడ సుమారు 300 మంది చదువుతుండగా.. ఇరుకు గదుల్లో బోధన సాగుతోంది.
గొల్లప్రోలు జడ్పీ బాలకోన్నత పాఠశాలలో పిల్లర్ల దశలో నిలిచిన నిర్మాణం
విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చర్యలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో చేపడుతున్న నాడు-నేడు పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. పాఠశాలలు తెరిచే సమయానికి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం. తరువాత ప్రాధాన్య క్రమంలో అదనపు తరగతి గదులు, రక్షణ గోడల నిర్మాణం చేపడతాం. ప్రభుత్వం నుంచి రావాల్సిన సామగ్రికి సంబంధించి ఉన్నతాధికారులతో చర్చిస్తాం. స్థానిక సమస్యల వల్ల కొన్నిచోట్ల పనులు ప్రారంభం కాని పరిస్థితిపై డీఈవోలు, ఎంఈవోలతో సమీక్షించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. ఏపీసీలు సైతం నిరంతరం పర్యవేక్షించేలా తగిన ఆదేశాలిస్తాం.
నాగమణి, ఆర్జేడీ, పాఠశాల విద్య
‘విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి నాడు-నేడు రెండో విడత కింద పాఠశాలల్లో ప్రారంభించిన ఆధునికీకరణ పనులు పూర్తి చేస్తాం. కార్పొరేట్కు మించిన వసతులు కల్పిస్తాం’
ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతీ సందర్భంలో చెప్పే మాట.
‘జూన్ 12 కల్లా అన్ని పాఠశాలల పనులు పూర్తిచేయాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలకు వెనుకాడేది లేదు’
ఎంఈవోలు, హెచ్ఎంలకు రాష్ట్ర ఉన్నతాధికారులు, జిల్లా విద్యాశాఖాధికారుల స్పష్టీకరణ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షేమ పథకాలకు బీజం వేసిన ఘనత తెదేపాదే
[ 29-03-2024]
పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత తెదేపాకే దక్కుతుందని తెదేపా మండల అధ్యక్షుడు నామన పరమేశ్వరరావు తెలిపారు. -
నిగ్గదీయొద్దు.. నోరు మెదపొద్దు: వైకాపా నేతను కాపాడేందుకు ఎన్ని ఆపసోపాలో!
[ 29-03-2024]
తిడితే పడాలి... కొడితే భరించాలి.. అధికార పక్ష నాయకుల అరాచకాలపై నోరు మెదిపితే ఇబ్బందే. -
పనిచేయని ఏసీలు, ఫ్యాన్లు.. సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
[ 29-03-2024]
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. -
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
[ 29-03-2024]
అనపర్తి నియోజకవర్గంలో తెదేపా ఉనికి లేకుండా చేయాలనే దురుద్దేశంతో వైకాపా కుట్రకు తెరలేపిందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. -
అనకొండలు.. అధికారం అండదండలు
[ 29-03-2024]
కక్ష కట్టారో.. తప్పు జరగకపోయినా.. ఎలాంటి ఫిర్యాదులు అందకపోయినా కార్యాలయాల మీదకు వచ్చి పడతారు.. బాధితులతో బలవంతంగా ఫిర్యాదులు రాయించి మరీ వెంటాడి వేధిస్తారు.. -
పవన్.. వారాహి విజయభేరి
[ 29-03-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. -
తొలి అడుగు ఉన్నతంగా తీర్చిదిద్దుకుందాం
[ 29-03-2024]
ఇంటర్మీడియట్.. విద్యార్థి భవితకు తొలి అడుగు. కెరియర్ను ఏవిధంగా తీర్చిదిద్దుకోవాలి.. ఏ కోర్సులను ఎంచుకోవాలి.. ఎలా ముందడుగు వేయాలి.. అవకాశాలు ఎలా అందిపుచ్చుకోవాలి.. ఇలా ఎన్నో సందేహాలు విద్యార్థులు.. తల్లిదండ్రులకు తలెత్తుతుంటాయి. -
ఆదుకుంటున్న సీలేరు జలాలు
[ 29-03-2024]
గోదావరిలో కొన్ని రోజులుగా నీటిమట్టం క్రమంగా పడిపోతోంది. -
ప్రదర్శన దర్పం.. ప్రయోజనం దూరం
[ 29-03-2024]
వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు రూపొందించిన సృజనాత్మక పరికరాల ప్రదర్శన వేదికన్నారు.. రెండు వందలకు పైగానే నమూనాలను ప్రదర్శించినట్లు ఆర్భాటంగా ప్రకటించారు. -
సంద్రంలో సమర భేరి
[ 29-03-2024]
కాకినాడ గ్రామీణం సూర్యారావుపేట సముద్రంలో ఇండో-అమెరికన్ సంయుక్త నావికా దళాల రహస్య సైనిక విన్యాసాలు కొనసాగుతున్నాయి. -
ప్రచారం.. కావాలి పర్యావరణ హితం
[ 29-03-2024]
రాష్ట్రంలో ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉన్నా.. అది దస్త్రాలకే పరిమితమవుతోంది. -
త్రివేణి సంగమంలా కూటమి పార్టీలు పనిచేస్తాయి
[ 29-03-2024]
రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు భాజపా అభ్యర్థులను కేంద్ర నాయకత్వం నిర్ణయించిందని, అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవించి కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, భాజపా ఏపీ ఎన్నికల సహబాధ్యుడు సిద్ధార్థ్నాథ్ సింగ్ శ్రేణులను కోరారు. -
పక్కాగా ఎన్నికల నియమావళి అమలు
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా అధికార యంత్రాంగంతో పోలీసు వ్యవస్థ మమేకమై పనిచేస్తుందని ఏలూరు రేంజి ఐజీ జీవీజీ అశోక్కుమార్ అన్నారు. -
ప్రాణం తీసిన సహజీవనం
[ 29-03-2024]
ఓ మహిళతో సహజీవనం కోసం మద్యం మత్తులో ఉన్న స్నేహితుడిపైనే కత్తిదూసి హత్యచేశాడో వ్యక్తి.
తాజా వార్తలు (Latest News)
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM