ఆరుద్ర నిరవధిక దీక్ష భగ్నం
కాకినాడ గ్రామీణ మండలం రాయుడుపాలేనికి చెందిన రాజులపూడి ఆరుద్ర, దివ్యాంగురాలైన ఆమె కుమార్తె సాయిలక్ష్మీచంద్ర నిరవధిక దీక్షను పోలీసులు భగ్నం చేశారు.
అర్ధరాత్రి దాటాక ఆసుపత్రికి తరలింపు
కాకినాడ జీజీహెచ్కు వెళ్లిన దివ్యాంగుల జేఏసీ సంఘం నాయకులను అడ్డుకున్న పోలీసులు
కాకినాడ కలెక్టరేట్, మసీదు సెంటర్, న్యూస్టుడే: కాకినాడ గ్రామీణ మండలం రాయుడుపాలేనికి చెందిన రాజులపూడి ఆరుద్ర, దివ్యాంగురాలైన ఆమె కుమార్తె సాయిలక్ష్మీచంద్ర నిరవధిక దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆస్తి విషయంలో తమను ఇబ్బందులకు గురిచేసిన ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయాలని, కుమార్తెకు వైద్యం అందించాలని కోరుతూ బుధవారం కాకినాడ ధర్నా చౌక్లో దీక్ష ప్రారంభించగా.. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో శిబిరం నుంచి కాకినాడ జీజీహెచ్కు తరలించారు. వారికి మద్దతుగా శిబిరంతో ఉన్న ముగ్గురు దివ్యాంగుల సంఘ ప్రతినిధులను పోలీస్స్టేషన్కు తరలించారు. ఆరుద్ర, ఆమె కుమార్తెను కాకినాడ జీజీహెచ్లో ఉంచగా, దివ్యాంగుల సంఘ ప్రతినిధులను గురువారం ఉదయం వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టారు. బుధవారం రాత్రి 7 గంటల నుంచి ఆరుద్ర, ఆమె కుమార్తెను జీజీహెచ్కు తరలించడానికి పోలీసులు, వైద్యాధికారులు ప్రయత్నించినా, బ్లేడ్లుతో గొంతుకోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించడంతో వెనక్కి తగ్గారు. అర్ధరాత్రి 2.30 గంటలకు పెద్దాపురం డీఎస్పీ కె.లతాకుమారి, కాకినాడ డీఎస్పీ పి.మురళీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అంబులెన్స్లో పోలీసు బందోబస్తు నడుమ జీజీహెచ్కు తరలించారు. ఆరుద్ర, ఆమె కుమార్తెను జీజీహెచ్లోని ప్రత్యేక వార్డులో ఉంచి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మీడియా ప్రతినిధులు, ఆరుద్ర భర్త, బంధువులు, దివ్యాంగ సంఘ నాయకులు వారిని కలిసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
అధికారులు హామీలను నిలబెట్టుకోలేదు..
మసీదుసెంటర్(కాకినాడ): జీజీహెచ్లో ఉన్న ఆరుద్ర, సాయిలక్ష్మీచంద్రలను చూసేందుకు వచ్చిన ఏపీ దివ్యాంగ సంఘాల జేఎసీ రాష్ట్ర అధ్యక్షుడు గుణతం చంద్రశేఖర్, ఇతర నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ విలేకరులతో మాట్లాడారు. కుమార్తె ప్రాణాపాయ స్థితిలో ఉందని ఆరుద్ర సామాజిక మాధ్యమాల్లో ఉంచిన వీడియో చూసి చలించి న్యాయం చేసేందుకు గతనెల 29న కాకినాడ వచ్చి ధర్నాచౌక్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టామన్నారు. అదేరోజు పోలీసు అధికారుల సూచనలతో కలెక్టర్, ఎస్పీని కలవగా సాయిలక్ష్మీచంద్రకు ప్రభుత్వం వైద్యం అందిస్తామని, అన్నవరంలోని ఆరుద్ర ఇంటి విషయంలో అడ్డుపడ్డ పోలీసులపై చర్యలు తీసుకుంటామని, అమలాపురంలోని ఆస్తిని అమ్మేందుకు ఇబ్బందులు లేకుండా కలెక్టర్ చూస్తామని చెప్పారన్నారు. వారం రోజులు గడిచినా ఆ హామీలపై ఏ విధమైన చర్యలు చేపట్టలేదన్నారు. దీంతో ఈ నెల 7 నుంచి ధర్నాచౌక్ వద్ద తిరిగి నిరవధిక దీక్ష చేపట్టామన్నారు. అర్ధరాత్రి 150 మందికిపైగా పోలీసులు టెంట్ వద్ద మోహరించి దీక్షను భగ్నం చేసేందుకు ప్రయత్నించారన్నారు. తెల్లవారుజామున ఆరుద్రకు వైద్యపరీక్షలు చేస్తుండగా వీధి లైట్లు ఆపేసి ఒక్కసారిగా వచ్చి ఆరుద్ర, ఆమె కుమార్తెతో పాటు దివ్యాంగులను చొక్కాలు పట్టుకుని వ్యాన్లో వేసి తీసుకెళ్లారన్నారు. ఆరుద్ర భర్త భువనేశ్వర్ మాట్లాడుతూ.. అర్ధరాత్రి వీధిదీపాలు ఆపి దివ్యాంగులపై దౌర్జన్యం చేయడం దారుణమన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాను గద్దె దించాలి: పురందేశ్వరి
[ 25-04-2024]
దుర్మార్గపు వైకాపాను గద్దే దించాలంటే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడిందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిని దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. -
మోసపు దీవెన.. సొమ్మురాక వేదన
[ 25-04-2024]
రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందిస్తామని... దాని కోసం విద్య, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. -
ప్రతి గొంతూ జేజేలు
[ 25-04-2024]
నడినెత్తిన సూరీడు సుర్రుమంటుంటే.. పూల జల్లుల వాన కురిసింది.. గొంతులన్నీ ఒక్కటై జేజేలు కొట్టాయి. జనసేన.. తెదేపా.. భాజపా జెండాలు రెపరెపలాడాయి. -
నియమావళికి సెలవిచ్చి.. మంత్రి హామీకి విలువిచ్చి..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేముందు హడావుడిగా జిల్లావ్యాప్తంగా అనేక పనులకు వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు శంకుస్థాపనలు చేశారు. వీటిలో కొన్ని పనులు నేటికీ ప్రారంభించనేలేదు. -
జగన్.. మాపై ఎందుకింత కక్ష?
[ 25-04-2024]
గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు కాపులకు వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూ.కోట్లలో ఖర్చు చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్ రుణాలకు ఎగనామం పెట్టింది. -
సర్కారు సహకారం కరవై.. నిర్వహణ భారమై..
[ 25-04-2024]
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరం తాడితోట వస్త్రమార్కెట్ గత అయిదేళ్లుగా తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. వ్యాపారాలు పడిపోయి వెలవెలబోతోంది. -
కొవ్వూరు వైకాపాలో రగడ
[ 25-04-2024]
కొవ్వూరు నియోజకవర్గ వైకాపాలో వర్గవిభేదాలు తారస్థాయికి చేరాయి. నియోజకవర్గ పరిశీలకుడి పదవి చిచ్చు రెండు సామాజికవర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది. -
నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ పర్వం గురువారంతో ముగియనుంది. పోటీచేసే అభ్యర్థుల నుంచి చివరిరోజు కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్
[ 25-04-2024]
రాజమహేంద్రవరం ఆంధ్రా పేపరుమిల్లుకు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. ఈ విషయాన్ని బుధవారం నోటీసు బోర్డులో పెట్టడంతో గత 23 రోజులుగా సమ్మెలో ఉన్న కార్మికులు ఆందోళన వ్యక్తంచేశారు. -
ఎన్నికల వేళ కుర్చీల లొల్లి!
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధులను తరలించేందుకు వీల్ఛైర్లు అవసరం.. అయితే గుత్తేదారుల నుంచి కొనుగోలు చేసిన వీటికి పంచాయతీల ఖజానా నుంచి డబ్బులు చెల్లించమనడంపై సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అట్టహాసంగా నామినేషన్లు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం అట్టహాసంగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో బుధవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. -
ఉద్యోగులు, పింఛనుదారులను పట్టించుకోని ప్రభుత్వం
[ 25-04-2024]
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శలు పాలంకి సుబ్బరాయన్, పెద్దన్నగౌడ్ వాపోయారు. -
మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు
[ 25-04-2024]
ఎన్నికల నేపథ్యంలో ఓటు అమ్మొద్దు.. ఓటు కొనద్దు.. అంటూ ఓ పౌరుడు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ స్థానికంగా అందర్నీ ఆలోచింపజేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని గాంధీనగర్లో జై భారత్ -
నన్నయలో ఖేలో ఇండియా ప్రాజెక్ట్ కమిటీ సభ్యుల పర్యటన
[ 25-04-2024]
నన్నయ విశ్వవిద్యాలయంలో ఖేలో ఇండియా పథకానికి సంబంధించిన పనులను కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ప్రతినిధులు బుధవారం పరిశీలించారు. -
భీమేశ్వరుని గర్భాలయం మూసివేత
[ 25-04-2024]
కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ద్రాక్షారామ భీమేశ్వరుని ఆలయంలో స్పటిక లింగానికి మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో గర్భాలయాన్ని బుధవారం నుంచి మూసివేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?