కనుపాపను కాపాడుకోవాలని..
చదువులో సరస్వతీ పుత్రిక.. మరో ఏడాదిలో చేతికి వచ్చే ఇంజినీరింగ్ పట్టా... క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఒకటి.. రెండు కాదు... నాలుగు సంస్థలకు ఎంపిక.. అమ్మాయి ప్రతిభ చూసి ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు.. అంతా సరదాగా సాగిపోతున్న వేళ ఒక్కసారిగా తేరుకోలేని కుదుపు.
ఈనాడు, రాజమహేంద్రవరం
ఆసుపత్రిలో తల్లితో...
చదువులో సరస్వతీ పుత్రిక.. మరో ఏడాదిలో చేతికి వచ్చే ఇంజినీరింగ్ పట్టా... క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఒకటి.. రెండు కాదు... నాలుగు సంస్థలకు ఎంపిక.. అమ్మాయి ప్రతిభ చూసి ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు.. అంతా సరదాగా సాగిపోతున్న వేళ ఒక్కసారిగా తేరుకోలేని కుదుపు. ఆమె మోముపై చిరునవ్వును దూరం చేసింది. ఉన్నత ఉద్యోగంలో అమ్మాయిని చూసి మురిసిపోదామని భావించిన ఆ తల్లిదండ్రులు... ఆమె పూర్తిగా కోలుకుని ఇంటికొస్తే అదే పదివేలని మొక్కని దేవుడు లేడు. ఆమెను కాపాడుకోవాలని ఉపాధినిస్తున్న లారీలు, నీడనిచ్చిన ఇల్లు, ఇతర ఆస్తులను విక్రయించినా ఇంకా చాలని పరిస్థితి. వైద్యం కోసం సుమారు రూ.20 లక్షలు అవసరమని చెబుతున్న ఆ దంపతులు దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని మున్సిపల్ కాలనీకి చెందిన పుట్టా వీరవెంకట లక్ష్మీనారాయణ, కుమారి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె సాయిదీపిక(22) భీమవరంలోని విష్ణు కళాశాలలో బీటెక్ చదువుతుండగా మూడో ఏడాదిలో నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో నాలుగు సంస్థలకు ఉత్తమ ప్యాకేజీలతో ఎంపికైంది. నాలుగో ఏడాది చివరిలో అనారోగ్య సమస్య తీవ్రమైంది. 2019లో ఇంజినీరింగ్ రెండో ఏడాది చదువుతున్న సమయంలోనే క్యూరో డెర్మ వ్యాధి ఉన్నట్టు గుర్తించి చికిత్స అందించామని తండ్రి పి.వి.వి.లక్ష్మీనారాయణ చెబుతున్నారు. 2021లో పొడి దగ్గు, తీవ్ర ఆయాసంతో బాధపడిన యువతిని ఆసుపత్రికి తీసుకెళ్తే ఊపిరితిత్తులు 20 శాతం గట్టిపడి, ర్యాషెస్ వచ్చినట్లు వైద్యులు చెప్పారు. హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో రుమటాలజిస్ట్, పల్మనాలజిస్టులను సంప్రదించి చికిత్స అందించారు. 2021 నుంచి ఈ ఏడాది మార్చి వరకు ప్రతి నెలా ఆసుపత్రికి తీసుకెళ్లి తెచ్చేవారు. ఈ క్రమంలో వైరల్ ఫీవర్, ఇన్ఫెక్షన్లు అయిదు సార్లు రాగా.. ఒక్కో దఫా సుమారు రూ.2 లక్షల వరకు ఖర్చయ్యేది. ఈ ఏడాది ఏప్రిల్లో సమస్య తీవ్రమవడంతో రాజమహేంద్రవరంలోని ఆసుపత్రిలో చూపించారు. పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి మే 6న తరలించారు.
దెబ్బతిన్న ఊపిరితిత్తులు
యువతిని పరీక్షించిన వైద్యులు 65 శాతం మేర ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఇందుకు రూ.55 లక్షల మేర అవుతుందని, రూ.20 లక్షల వరకు ఆసుపత్రి భరిస్తుందని, రూ.15 లక్షలు ఆరోగ్యశ్రీ ద్వారా అందాయని, మిగతా మొత్తం సిద్ధం చేసుకోవాలని ఆసుపత్రి వర్గాలు సూచించినట్లు తండ్రి తెలిపారు.
సాయిదీపిక
దాతల సాయమే ఆధారం..
కుమార్తెను ఆరోగ్యంగా ఇంటికి తీసుకెళ్లాలనే ఒకే లక్ష్యంతో ఎంత ఖర్చు పెట్టేందుకైనా సిద్ధపడ్డా. ఈ క్రమంలో ఉపాధి నిచ్చే నాలుగు లారీలు, ఇంటిని, ఓ నివాస స్థలాన్ని విక్రయించా. ఇంకా ఖర్చు చేసేందుకు నా ఆర్థిక స్థోమత సరిపోదు. నా కుమార్తెను రక్షించేందుకు దాతలు సాయం చేయాలని వేడుకుంటున్నా.
పుట్టా వీరవెంకట లక్ష్మీనారాయణ, రాజమహేంద్రవరం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ యాత్రన.. జనం యాతన
[ 19-04-2024]
విద్యుత్తు కట్.. అంతర్జాలం బంద్.. దుకాణాల మూత.. సామాన్యుల వాహనాలకు తోడు అంబులెన్సులు సైతం నిలిపివేత.. గంటలపాటు డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు.. -
ఎన్నికల వేళ యువతా.. అప్రమత్తం
[ 19-04-2024]
ఎన్నికల వేళ యవత మరిన్ని జాగ్రత్తలు వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు పిలిచారని బైక్ ర్యాలీల్లో పాల్గొనడం, ప్రత్యర్థులతో ఘర్షణకు దిగడం వంటివి ఎంతమాత్రం సరికాదని హెచ్చరిస్తున్నారు. -
అసలేం జరుగుతోంది..?
[ 19-04-2024]
ప్రజాధనం వృథా అయినా ఫర్వాలేదు. రోగులు పాట్లు పడినా పట్టించుకోరు.. కావాల్సిన మందులు ఉండవు.. అవసరం లేనివి మాత్రం పదేసి రెట్లు అధికంగా ఇండెంట్ పెట్టి తెప్పించేస్తారు. -
జిల్లాకు రానున్న ఎన్నికల పరిశీలకులు
[ 19-04-2024]
కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు జిల్లాకు రానున్నారు. వీరికి అనుసంధానంగా లైజనింగ్, ఇతర సిబ్బందిని నియమించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత తెలిపారు. -
తొలిరోజు ఏడు నామినేషన్ల దాఖలు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభంకాగా తొలిరోజు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. -
పాదయాత్ర అబద్ధాలతో దండయాత్ర
[ 19-04-2024]
పాదయాత్రలో ప్రతి ఒక్కరి గుండె చప్పుడు విన్నా. ప్రజలతో మమేకమై ప్రతి కష్టాన్ని చూశా. పంటలకు సక్రమంగా సాగునీరు అందించడంతోపాటు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాను. -
తొలిరోజు నామినేషన్ల సందడి
[ 19-04-2024]
ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో తొలిరోజే ఆ సందడి కనిపించింది. దశమి గురువారం కావడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు, స్వతంత్రులు కూడా నామపత్రం సమర్పించారు. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం నాయకులు మండిపడ్డారు. -
పేపరుమిల్లు కార్మికుల ఆందోళన
[ 19-04-2024]
సీఎం పర్యటనలో భాగంగా కాన్వాయ్ గురువారం రాత్రి రాజమహేంద్రవరంలోని ఆంధ్ర పేపర్మిల్లుకు చేరుకున్న సమయంలో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 15 రోజులుగా వేతన ఒప్పందం కోరుతూ సమ్మె చేస్తున్నా పేపర్మిల్లు యాజమాన్యం స్పందించడం లేదని నినాదాలు చేశారు. -
సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్నికలు అనగానే అందరికీ గుర్తొచ్చేది సమస్యాత్మక కేంద్రాలే. పోలింగ్ ముగిసే వరకు అధికారుల దృష్టంతా వాటిపైనే ఉంటుంది. -
అద్దె చెల్లించక అగచాట్లు
[ 19-04-2024]
వైకాపా పాలనలోని గత అయిదేళ్లలో అంగన్వాడీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీకావు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలు కేవలం నోటి మాటలకే పరిమితమవుతున్నాయని, కార్యాచరణకు నోచుకోవడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పుట్టగొడుగుల్లా అక్రమ లేఔట్లు
[ 19-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన నుంచి గండేపల్లి మండలంలో అక్రమ లేఔట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఆ పార్టీ నాయకుల అండదండలతో కొన్ని లే ఔట్లను ఏర్పాటు చేసి అక్రమంగా మెరక చేశారు. -
‘ఆత్మ’సాక్షి లేదా.. అన్నదాతంటే పడదా..!
[ 19-04-2024]
సమీకృత వ్యవసాయం దిశగా ప్రోత్సహించడానికి, సాంకేతికత అందిపుచ్చుకొని ఆధునిక పద్ధతుల్లో అధిక ఉత్పత్తులు సాధించడానికి వీలుగా రైతులకు అవగాహన కల్పించి, వారిని ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు క్షేత్ర స్థాయి పర్యటనలకు తీసుకువెళ్లి, అక్కడి వ్యవసాయ విధానాలు తెలుసుకునేందుకు ఆత్మ పథకాన్ని తీసుకువచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి