రూ.29,486 కోట్లతో జిల్లా వార్షిక రుణ ప్రణాళిక
జిల్లాలో వ్యవసాయ, వ్యవసాయేతర పరిశ్రమలు, ఇతర ప్రాధాన్యత రంగాలకు సంబంధించి 2023-24 వార్షిక రుణ ప్రణాళిక రూ.29,486 కోట్లుగా నిర్ణయించారు.
రుణ ప్రణాళికను విడుదల చేస్తున్న కలెక్టర్, బ్యాంకర్లు, ఇతర అధికారులు
వి.ఎల్.పురం (రాజమహేంద్రవరం): జిల్లాలో వ్యవసాయ, వ్యవసాయేతర పరిశ్రమలు, ఇతర ప్రాధాన్యత రంగాలకు సంబంధించి 2023-24 వార్షిక రుణ ప్రణాళిక రూ.29,486 కోట్లుగా నిర్ణయించారు. కలెక్టరేట్లో బ్యాంకర్ల జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లాస్థాయి సమీక్ష సమావేశం శుక్రవారం జరిగింది. కౌలు రైతులకు సకాలంలో రుణాల మంజూరు, ఇతర పథకాల అమలుపై చర్చించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 4,48,234 మంది రైతులకు రూ.10,178 కోట్లు, సూక్ష్మ చిన్న, మధ్య తరగతి సంస్థలు (ఎంఎస్ఎం) యూనిట్లు 30,570 ఏర్పాటుకు రూ.2,887 కోట్లు, వ్యవసాయేతర ప్రాధాన్యత రంగంలో 5,30,565 మంది ఖాతాలకు రూ.13,782 కోట్లు, ఇతర ప్రాధాన్యేతర రంగాలకు రూ.2,639 కోట్లుగా ప్రతిపాదిస్తూ వార్షిక రుణ ప్రణాళికకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ వార్షిక రుణ ప్రణాళికలో ప్రతిపాదించిన లక్ష్యాలను సాధించడానికి బ్యాంకర్లు చొరవ చూపాలన్నారు. జిల్లాస్థాయిలో జరిగే బ్యాంకర్ల సమావేశానికి ఆయా బ్యాంకుల కంట్రోలర్స్ తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. ఏపీ టిడ్కో గృహాలు 3,840 లక్ష్యంకాగా 2,649 పంపిణీ చేయడం, కొన్ని బ్యాంకులు దరఖాస్తులు తిరస్కరించడంపై వివరణ ఇవ్వాలని సమావేశం కోరింది.
ఎవరేమన్నారంటే..
జిల్లాలో పీఎంఈజీపీ కింద 265 యూనిట్స్ గ్రౌండింగ్ చేసినట్లు యూనియన్ బ్యాంక్ ప్రాంతీయ అధికారి హరిబాబు తెలిపారు. నాబార్డు ద్వారా జీడిపప్పు, కూరగాయలు, కోకో అక్టివిటీ కింద నాబార్డ్, ఎస్ఎఫ్ఏసీ కింద నిధులు సమకూరుస్తున్నట్లు నాబార్డ్ అధికారి స్వామినాయుడు తెలిపారు. జగనన్న తోడు ఫేజ్-6 కింద 17,484 యూనిట్లకు రూ.17.49 కోట్లు ఇచ్చినట్లు డీఆర్డీఏ పీడీ ఎస్.సుభాషిణి తెలిపారు. మహిళా పారిశ్రామిక అభివృద్ధి కోసం 500 యూనిట్లు మంజూరు చేసేందుకు నిర్ణయించినట్లు సూక్ష్మ తరహా పరిశ్రమల అధికారి కె.శ్రీనివాసరావు తెలిపారు. ఆర్బీఐ ప్రాంతీయ అధికారి నాగప్రవీణ్, ఎల్డీఎం డి.బి.ప్రసాద్, డీఐవోబీ వెంకటేశ్వరావు, తదితరులు హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ యాత్రన.. జనం యాతన
[ 19-04-2024]
విద్యుత్తు కట్.. అంతర్జాలం బంద్.. దుకాణాల మూత.. సామాన్యుల వాహనాలకు తోడు అంబులెన్సులు సైతం నిలిపివేత.. గంటలపాటు డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు.. -
ఎన్నికల వేళ యువతా.. అప్రమత్తం
[ 19-04-2024]
ఎన్నికల వేళ యవత మరిన్ని జాగ్రత్తలు వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు పిలిచారని బైక్ ర్యాలీల్లో పాల్గొనడం, ప్రత్యర్థులతో ఘర్షణకు దిగడం వంటివి ఎంతమాత్రం సరికాదని హెచ్చరిస్తున్నారు. -
అసలేం జరుగుతోంది..?
[ 19-04-2024]
ప్రజాధనం వృథా అయినా ఫర్వాలేదు. రోగులు పాట్లు పడినా పట్టించుకోరు.. కావాల్సిన మందులు ఉండవు.. అవసరం లేనివి మాత్రం పదేసి రెట్లు అధికంగా ఇండెంట్ పెట్టి తెప్పించేస్తారు. -
జిల్లాకు రానున్న ఎన్నికల పరిశీలకులు
[ 19-04-2024]
కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు జిల్లాకు రానున్నారు. వీరికి అనుసంధానంగా లైజనింగ్, ఇతర సిబ్బందిని నియమించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత తెలిపారు. -
తొలిరోజు ఏడు నామినేషన్ల దాఖలు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభంకాగా తొలిరోజు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. -
పాదయాత్ర అబద్ధాలతో దండయాత్ర
[ 19-04-2024]
పాదయాత్రలో ప్రతి ఒక్కరి గుండె చప్పుడు విన్నా. ప్రజలతో మమేకమై ప్రతి కష్టాన్ని చూశా. పంటలకు సక్రమంగా సాగునీరు అందించడంతోపాటు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాను. -
తొలిరోజు నామినేషన్ల సందడి
[ 19-04-2024]
ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో తొలిరోజే ఆ సందడి కనిపించింది. దశమి గురువారం కావడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు, స్వతంత్రులు కూడా నామపత్రం సమర్పించారు. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం నాయకులు మండిపడ్డారు. -
పేపరుమిల్లు కార్మికుల ఆందోళన
[ 19-04-2024]
సీఎం పర్యటనలో భాగంగా కాన్వాయ్ గురువారం రాత్రి రాజమహేంద్రవరంలోని ఆంధ్ర పేపర్మిల్లుకు చేరుకున్న సమయంలో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 15 రోజులుగా వేతన ఒప్పందం కోరుతూ సమ్మె చేస్తున్నా పేపర్మిల్లు యాజమాన్యం స్పందించడం లేదని నినాదాలు చేశారు. -
సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్నికలు అనగానే అందరికీ గుర్తొచ్చేది సమస్యాత్మక కేంద్రాలే. పోలింగ్ ముగిసే వరకు అధికారుల దృష్టంతా వాటిపైనే ఉంటుంది. -
అద్దె చెల్లించక అగచాట్లు
[ 19-04-2024]
వైకాపా పాలనలోని గత అయిదేళ్లలో అంగన్వాడీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీకావు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలు కేవలం నోటి మాటలకే పరిమితమవుతున్నాయని, కార్యాచరణకు నోచుకోవడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పుట్టగొడుగుల్లా అక్రమ లేఔట్లు
[ 19-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన నుంచి గండేపల్లి మండలంలో అక్రమ లేఔట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఆ పార్టీ నాయకుల అండదండలతో కొన్ని లే ఔట్లను ఏర్పాటు చేసి అక్రమంగా మెరక చేశారు. -
‘ఆత్మ’సాక్షి లేదా.. అన్నదాతంటే పడదా..!
[ 19-04-2024]
సమీకృత వ్యవసాయం దిశగా ప్రోత్సహించడానికి, సాంకేతికత అందిపుచ్చుకొని ఆధునిక పద్ధతుల్లో అధిక ఉత్పత్తులు సాధించడానికి వీలుగా రైతులకు అవగాహన కల్పించి, వారిని ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు క్షేత్ర స్థాయి పర్యటనలకు తీసుకువెళ్లి, అక్కడి వ్యవసాయ విధానాలు తెలుసుకునేందుకు ఆత్మ పథకాన్ని తీసుకువచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు