ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు
జిల్లాలోని శంఖవరం, హంసవరం ఆదర్శ పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశాలకు ఈనెల 11న నిర్వహించే పరీక్షకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని డీఆర్వో కె.శ్రీధర్రెడ్డి అధికారులను ఆదేశించారు.
అధికారులతో సమీక్షిస్తున్న డీఆర్వో శ్రీధర్రెడ్డి
కాకినాడ కలెక్టరేట్, న్యూస్టుడే: జిల్లాలోని శంఖవరం, హంసవరం ఆదర్శ పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశాలకు ఈనెల 11న నిర్వహించే పరీక్షకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని డీఆర్వో కె.శ్రీధర్రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆయన సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శంఖవరం, హంసవరం ఆదర్శ పాఠశాలల్లోనే ప్రవేశపరీక్ష జరుగుతుందన్నారు. ఆయా కేంద్రాల వద్ద పటిష్ఠ ఏర్పాట్లు చేయాలన్నారు. అభ్యర్థులకు రవాణా సదుపాయం కల్పించాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. పోలీసు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తమ శాఖల పరంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్ష ప్రశాంత వాతవరణంలో జరిగేలా పోలీసులు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో డీఈవో కె.అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హోంమంత్రి ర్యాలీలో గాయపడిన దళితుడు ఇకలేరు
[ 24-04-2024]
హోంమంత్రి తానేటి వనిత నామినేషన్ ర్యాలీకి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తూ పడిపోయి గాయపడిన దళితుడు తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం కురుకూరు గ్రామానికి చెందిన పల్లపు అబ్బులు (73) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. -
మే 26 వరకు కాకినాడ- విశాఖ రైలు రద్దు
[ 24-04-2024]
కాకినాడ పోర్టు- విశాఖపట్నం(17267), విశాఖపట్నం-కాకినాడ పోర్టు(17267) రైళ్లను ఈ నెల 29 నుంచి మే 26 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. -
వైకాపా గొప్పలు.. రైతుకు తిప్పలు
[ 24-04-2024]
మాది రైతుల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొంటున్న వైకాపా పాలనలో కర్షకులు అనుభవిస్తున్న అవస్థలకు ఈ చిత్రమే నిదర్శనం. కట్టిస్తామన్న గోదాములు నిర్మించక, కనీసం కళ్లాలకూ స్థలాలు చూపకపోవడంతో రైతులు ధాన్యం ఆరబోసుకునేందుకు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. -
జగన్ను కుర్చీ దింపాలి
[ 24-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా అర్బన్ నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే ఆభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ నేతృత్వంలో మంగళవారం సాయంత్రం భారీ ర్యాలీ, రోడ్ షో నిర్వహించారు.