సత్యవతికి కన్నీటి వీడ్కోలు..!
తెదేపా అధినేత చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టును నిరసిస్తూ కాకినాడలో నిర్వహిస్తున్న రిలే దీక్షల్లో బుధవారం ఉద్వేగంగా ప్రసంగించి ఆకస్మికంగా మృతిచెందిన కాకినాడ నగర తెదేపా మహిళా విభాగం అధ్యక్షురాలు చిక్కాల సత్యవతి అంత్యక్రియలు గురువారం అశ్రునయనాల మధ్య నిర్వహించారు.
అంతిమయాత్రలో తెదేపా శ్రేణులు
కాకినాడ నగరం, న్యూస్టుడే: తెదేపా అధినేత చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టును నిరసిస్తూ కాకినాడలో నిర్వహిస్తున్న రిలే దీక్షల్లో బుధవారం ఉద్వేగంగా ప్రసంగించి ఆకస్మికంగా మృతిచెందిన కాకినాడ నగర తెదేపా మహిళా విభాగం అధ్యక్షురాలు చిక్కాల సత్యవతి అంత్యక్రియలు గురువారం అశ్రునయనాల మధ్య నిర్వహించారు. తూరంగిలోని కైలాసభూమిలో హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ముందుగా జగన్నాథపురం నాగరాజుపేటలోని ఆమె స్వగృహం వద్ద మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, నగర తెదేపా అధ్యక్షుడు మల్లిపూడి వీరు తదితరులు పార్టీ పతాకాన్ని మృతదేహంపై కప్పి నివాళులు అర్పించారు. తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాసబాబా, తెదేపా వైద్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం ఊరేగింపుగా భౌతికకాయాన్ని తరలించారు. అందరితోనూ సఖ్యంగా మెలిగే సత్యవతిని కడసారి చూసేందుకు బంధువులు, తెదేపా కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. తూరంగిలోని కైలాసభూమి వరకు అంతిమయాత్ర సాగింది. మాజీ ఎమ్మెల్యే కొండబాబుతో పాటు నగర తెదేపా అధ్యక్షుడు వీరు కొద్దిసేపు పాడె మోసారు. అదే సమయంలో భారీ వర్షం కురవడంతో తడుస్తూనే అంతిమయాత్రలో పాల్గొన్నారు. మృతురాలి భర్త రామచంద్రరావు, కుమారుడు మనోజ్కుమార్, కుమార్తె సాయిని ఓదార్చారు. తెదేపా నాయకులు కొల్లాబత్తుల అప్పారావు, సీకోటి అప్పలకొండ, పలివెల రవి, బంగారు సత్యనారాయణ, పసుపులేటి వెంకటేశ్వరరావు, జొన్నాడ వెంకటరమణ, చొక్కా గిరి, కోడూరి పెద్ద, పంతాడి రాజు, గదుల సాయిబాబు, ఎంఏసయ్యద్, అన్సర్, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నోటికి గుడ్డకట్టుకుని సర్పంచి నిరసన
[ 02-12-2023]
గ్రామ పంచాయతీల్లో నిధులన్నీ వెనక్కి తీసుకుని పాలకవర్గాలకు ఎటువంటి విధులు లేకుండా ఎందుకొచ్చిన సమావేశాలంటూ సీతానగరం మండలం సింగవరం సర్పంచి సంగన చినపోశయ్య నిరసనకు దిగారు. ఎంపీపీ గుర్రాల జ్యోత్స్న అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన మండల పరిషత్ సమావేశంలో నోటికి నల్లగుడ్డ కట్టుకుని వచ్చి మూడు గంటలపాటు మౌనంగా నిరసన తెలిపారు. -
తెదేపా సానుభూతిపరుడిపై కత్తితో దాడి
[ 02-12-2023]
కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో పాత వివాదం నేపథ్యంలో జరిగిన ఘర్షణలో వైకాపా ఎంపీటీసీ అన్న కుమారుడు.. తెదేపా సానుభూతిపరుడిపై కత్తితో దాడికి దిగాడు. తీవ్ర గాయాలతో బాధితుడు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
వరి కోతల వేళ తుపాను కలవరం
[ 02-12-2023]
పంట చేతికొచ్చే సమయంలో తుపాను హెచ్చరికలు అన్నదాతలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఒకపక్క ముమ్మరంగా ఖరీఫ్ వరికోతలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 60 శాతం మాత్రమే జరిగాయి. కొన్నిచోట్ల ధాన్యం ఇంకా కల్లాల్లోనే ఉంది. -
మత్స్యకారులెవరూ సముద్రంలోకి వేటకు వెళ్లొద్దు
[ 02-12-2023]
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని తీర ప్రాంతాల వెంట ఉన్న మత్స్యకారులు అప్రమత్తం కావాలని కలెక్టర్ హిమాన్షుశుక్లా పేర్కొన్నారు. -
లోకేశ్ పాదయాత్రకు ఏర్పాట్లు
[ 02-12-2023]
తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్ చేపట్టిన పాదయాత్రకు పిఠాపురంలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తెలిపారు. శనివారం చిత్రాడ నుంచి పిఠాపురం వరకూ జరిగే పాదయాత్రకు తెదేపా, జనసేన నేతలు హాజరుకానున్నారు.


తాజా వార్తలు (Latest News)
-
టీచర్ అవుదామనుకొని..
-
రెండిళ్ల గొడవ.. రోడ్డెక్కింది గోడై!
-
IPL: ఐపీఎల్ వేలం.. 1166 మంది క్రికెటర్ల ఆసక్తి
-
Israel-Hamas Conflict: ఆగిన కాల్పులు విరమణ.. ఇజ్రాయెల్ దాడిలో 178 మంది మృతి
-
తుపాకులతో చొరబడి బ్యాంకులో రూ.18 కోట్ల దోపిడీ
-
Gujarat: గుండెపోటుతో 6 నెలల్లో 1052 మంది మృతి.. 80శాతం 25ఏళ్ల లోపువారే!