71 వేల ఓట్ల తొలగింపునకు ఆమోదం
కాకినాడ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 71,078 మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు ఆమోద ముద్రపడింది.
జాబితాలో కొత్తగా 40,512 మందికి చోటు
న్యూస్టుడే, కాకినాడ కలెక్టరేట్
కాకినాడ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 71,078 మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు ఆమోద ముద్రపడింది. ఈ ఏడాది జనవరి 6 నుంచి ఆగస్టు 19 వరకు కొత్త ఓటు నమోదు, తొలగింపు, చేర్పులు, మార్పులు, బదిలీకి దాఖలైన ఫారం-6, 7, 8 దరఖాస్తులపై విచారణ పూర్తిచేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో దరఖాస్తులపై బూత్స్థాయి అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. వీరి నివేదిక ఆధారంగా ఆయా నియోజకవర్గాల ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వోలు) తుది నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం మరణించిన, నకిలీ, శాశ్వతంగా వలసవెళ్లిన 71,078 మంది పేర్ల తొలగింపునకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారికి నివేదిక సమర్పించారు. అలాగే కొత్తగా ఓటు హక్కు కల్పించాలని 40,512 మంది సమర్పించిన దరఖాస్తులను ఆమోదించారు. చేర్పులు, మార్పులు, బదిలీలకు దాఖలైన 1,09,749 దరఖాస్తులను పరిష్కరించారు. ఈ ఏడాది జనవరి 5న జిల్లాలో తుది ఓటర్ల జాబితా ప్రచురించారు. అప్పటికి ఏడు నియోజకవర్గాల పరిధిలో 15,98,684 మంది ఓటర్లు ఉన్నారు. జాబితాపై పునర్విచారణ తరువాత జిల్లాలో 15,91,534 మంది ఓటర్లు ఉన్నారు. అప్పటికి, ఇప్పటికి 7,150 ఓట్లు తగ్గాయి. జిల్లాలో అక్టోబరు 17న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. ఆ రోజున కలెక్టరేట్, ఆర్డీవో, తహసీల్దారు, నగరపాలిక, పురపాలక, నగర పంచాయతీల కార్యాలయాల్లో జాబితాలను ప్రచురిస్తారు. అక్టోబర్ 17 నుంచి మరోమారు నెల రోజుల పాటు ఓటు నమోదు, తొలగింపు, చేర్పులు, మార్పులు, బదిలీలకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హత ఉండి, ముసాయిదా జాబితాలో పేర్లు లేనివారు మళ్లీ ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తారు. అలాగే 1 జనవరి 2024 నాటికి 18 ఏళ్లు నిండే ప్రతీ ఒక్కరూ కొత్తగా ఓటు హక్కు పొందేందుకు అవకాశం కల్పిసారు.
పోలింగ్ కేంద్రాల మార్పునకు ప్రతిపాదనలు..
జిల్లాలో మొత్తం 1,634 పోలింగ్ కేంద్రాలున్నాయి. వీటిలో 115 పోలింగ్ కేంద్రాల స్థల మార్పునకు ప్రతిపాదించారు. 320 పోలింగ్ కేంద్రాల పేరు మార్పు, ఏడు కొత్త కేంద్రాల ఏర్పాటు, రెండు కేంద్రాల విలీనానికి ప్రతిపాదించారు. 47 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉండటంతో మరో పోలింగ్ కేంద్రానికి కొంతమంది ఓటర్లు మార్పునకు ప్రతిపాదించారు. మొత్తం మీద 491 పోలింగ్ కేంద్రాల్లో మార్పులు, చేర్పులు చేపట్టనున్నారు.
ఇంటింటా సర్వేలో గుర్తించిన అంశాలు..
జిల్లాలో శాసనసభా నియోజకవర్గాల పరిధిలో జులై 21 నుంచి ఆగస్టు 21 వరకు ఇంటింటా ఓటర్ల జాబితా సర్వే నిర్వహించారు. ఇందులో 21,927 మంది అర్హత ఉన్నా ఓటు నమోదు చేసుకోనట్లు గుర్తించారు. వారి నుంచి ఫారం-6 దరఖాస్తులు స్వీకరించారు. రెండు, మూడు చోట్ల ఓటున్న 9006 మందిని గుర్తించి వారితో ఒక చోటే ఓటు ఉండేలా దరఖాస్తు చేయించారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారిన 14,697 మందిని గుర్తించి వారిలో 9,295 మంది నుంచి దరఖాస్తులు తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేమొస్తాం.. కష్టాలు తీరుస్తాం
[ 01-12-2023]
ఆత్మీయ పలకరింపులు.. అఖండ స్వాగతాలు.. మంగళ హారతులు.. తీన్మార్ డప్పులు.. తెదేపా-జనసేన జెండాల రెపరెపలు.. బాణసంచా కాల్పుల హోరు నడుమ గురువారం తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సాగింది. -
స్వామీ.. దర్యాప్తు భారం నీదే!
[ 01-12-2023]
2020 సెప్టెంబర్ 5న అర్ధరాత్రి.. అప్పటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆవరణలోని దివ్యరథం దగ్ధమైంది. 56 ఏళ్లపాటు స్వామికి వాహన సేవ అందించిన రథం ఇలా కావడం భక్తులకు ఆగ్రహం తెప్పించింది. -
ఇసుక ఇష్టానుసారంగా..
[ 01-12-2023]
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, ధవళేశ్వరం, కడియం, న్యూస్టుడే: గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇసుకను అడ్డంగా దోచేస్తున్నారు. ఒకపక్క కోర్టులు హెచ్చరిస్తున్నా అదేమీ పట్టనట్టు ఇష్టానుసారంగా ఇసుకను అక్రమ మార్గాన తవ్వుకుపోతున్నారు. -
రమణీయం.. గోవిందుడి కల్యాణం
[ 01-12-2023]
కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరుని కల్యాణోత్సవం గురువారం ఆత్రేయపురంలో వైభవంగా నిర్వహించారు.. ధర్మపథం పేరిట వేలాదిగా హాజరైన భక్తుల నడుమ తితిదే కల్యాణ మండపంలో నిర్వహించిన ఈ ఘట్టం కనులపండువగా సాగింది.. -
దుకాణ సముదాయంలో దందా
[ 01-12-2023]
కాకినాడ నగరంలో జ్యోతుల మార్కెట్ అధికార పార్టీ నేతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.నగరపాలక సంస్థ నిధులతో చేపట్టిన ఈ దుకాణ సముదాయం వైకాపా నాయకుల జేబులు నింపుతోంది. -
చేపలబోటు బోల్తా.. మత్స్యకారులు క్షేమం
[ 01-12-2023]
సఖినేటిపల్లి మండలం అంతర్వేది సాగర సంగమం వద్ద అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం రేవుపోలవరం గ్రామానికి చెందిన యజ్జల లోవరాజు చేపల బోటు బోల్తా కొట్టింది. -
రాయితీ కందిపప్పు కొందరికే..
[ 01-12-2023]
రేషన్ కార్డుదారులకు గత ఆరు నెలలుగా నిలిపివేసిన రాయితీ కందిపప్పు ఎట్టకేలకు ఈ నెల నుంచి మళ్లీ పంపిణీ చేయనున్నప్పటికీ అదికూడా కొందరికి మాత్రమే అందనుంది. అవసరమైన మేరకు సరఫరా కాలేదు. -
కలిసి విజయపతాకం ఎగరేస్తాం
[ 01-12-2023]
అనపర్తి నియోజకవర్గంలోని రంగంపేట మండలం ఈలకొలను గ్రామంలో తెదేపా, జనసేన పార్టీల స్తూపాలను పక్కపక్కనే ఏర్పాటు చేసి గురువారం ఒకేసారి పతాకాలను ఆవిష్కరించారు. -
షరా మామూలే..
[ 01-12-2023]
తాళ్లపూడి మండలం బల్లిపాడు ఇసుక ఓపెన్ ర్యాంపులో అక్రమ ఇసుక దందా మళ్లీ మొదలైంది. గత నెల 28న ర్యాంపులోకి వెళ్లే రోడ్డును నీటితో తడుపుతూ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ కె.దుర్గారావు గోదావరిలో పడి మృతిచెందారు. -
కళ తెస్తూ.. శుభమస్తు
[ 01-12-2023]
మొన్నమొన్నటి వరకు మూఢాలు, అధిక మాసాలతో కల్యాణ వేదికలన్నీ బోసిపోయాయి. వివాహ ముహూర్తాల సమయం ఆసన్నమవ్వడం, అందులోనూ అధిక సంఖ్యలో ఉండటంతో ఎక్కడ చూసినా మేళతాళాలు, మంగళవాయిద్యాలు వినిపిస్తున్నాయి. -
మొక్కుబడిగా స్థాయీ సంఘాల సమావేశం
[ 01-12-2023]
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశం గురువారం మొక్కుబడిగా సాగింది. ముఖ్య ప్రజాప్రతినిధులు హాజరు కాలేదు. కొన్ని శాఖలకు సంబంధించి కీలక అధికారులూ గైర్హాజరయ్యారు. -
తాడిపర్రులో వివాదానికి ఎట్టకేలకు తెర
[ 01-12-2023]
మండలంలోని తాడిపర్రులో పాపన్నగౌడ్ విగ్రహం ఏర్పాటుపై రెండు సామాజిక వర్గాల మధ్య ఏర్పడిన వివాదానికి తెరపడింది. కొవ్వూరు ఆర్డీవో రేవంత్ కృష్ణనాయక్, డీఎస్పీ వర్మ ఆధ్వర్యంలో ఇరువర్గాలతో స్థానిక తహసీల్దారు కార్యాలయంలో గురువారం సుదీర్ఘ చర్చలు నిర్వహించారు. -
రైతులు ప్రకృతి సాగువైపు మళ్లాలి
[ 01-12-2023]
ఆరోగ్యకర ఉత్పత్తులకోసం రైతులు ప్రకృతి సాగు చేయాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. రాచపల్లి అడ్డరోడ్డు సమీపంలో ఆయన కౌలుకు తీసుకున్న వ్యవసాయ క్షేత్రంలో గురువారం పంట కోశారు. -
నేర వార్తలు
[ 01-12-2023]
రాయవరం మండలం పసలపూడిలో పాత కక్షల నేపథ్యంలో రెండు వర్గాలు గురువారం రాత్రి పరస్పర దాడులకు దిగాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని ఎస్సీ కాలనీలో సంఘీయుల పాత, కొత్త పాలక వర్గాల మధ్య కొన్నాళ్లుగా వివాదం సాగుతోంది. -
కొత్తకొత్తగా.. ఓటు పత్రం వచ్చెగా..
[ 01-12-2023]
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా ఉన్న ఓటర్లకు కొన్నాళ్లుగా కొత్త ఓటు గుర్తింపుకార్డులు జారీ చేస్తున్నారు. -
ఆశయం నీరుగారి.. వ్యయం వృథాగా మారి..
[ 01-12-2023]
సామాజిక బాధ్యతలో భాగంగా అయిదేళ్ల క్రితం ఓఎన్జీసీ సంస్థ సీఎస్సార్ నిధులతో తీర గ్రామాల్లో స్వచ్ఛ జలధార వాటర్ ఏటీఎంలు సమకూర్చింది. -
వెంటాడిన మృత్యువు
[ 01-12-2023]
కత్తిపూడి జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అన్నవరం అదనపు ఎస్సై మూర్తి తెలిపిన వివరాల ప్రకారం. -
నేడు యువగళం పాదయాత్ర ఇలా..
[ 01-12-2023]
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర గురువారం రాత్రి తాళ్లరేవు మండలం చొల్లంగిపేటలోని క్యాంప్సైట్ వద్ద ముగిసింది. -
ఫొటోలు తీస్తూ.. ఇంటింటికీ తిరుగుతూ..
[ 01-12-2023]
ప్రభుత్వ కార్యక్రమంలో గర్భిణి అయిన వాలంటీరు(దళిత) ఇంటింటికీ తిరిగే క్రమంలో ఇబ్బందిపడిన ఘటన చర్చనీయాంశమైంది. వివరాల ప్రకారం.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం నల్లమిల్లిలో గురువారం ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు.


తాజా వార్తలు (Latest News)
-
పన్నూ హత్యకు కుట్ర.. భారతీయుడిపై అభియోగాలను తీవ్రంగా పరిగణించిన అమెరికా
-
Atharva Movie Review: రివ్యూ: ‘అథర్వ’ ప్రయోగంతో ఆకట్టుకున్నాడా!
-
Stock Market: లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. రికార్డు గరిష్ఠానికి నిఫ్టీ
-
Nagarjuna Sagar: నాగార్జున సాగర్ వద్ద కొనసాగుతున్న పోలీసు పహారా
-
Purandeswari: ఓట్ల కోసమే ‘నాగార్జునసాగర్’ వివాదం: పురందేశ్వరి
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు