మందగమనంలో ‘ఈ పంట’...
రైతులకు ప్రభుత్వ పథకాలు అందాలంటే పంట నమోదు(ఈ-క్రాప్) తప్పనిసరి. విపత్తుల సమయంలో పెట్టుబడి రాయితీ నుంచి పంటల బీమా, రైతుభరోసా వరకు, పండించిన ధాన్యం అమ్ముకోవడానికి ఈ-క్రాప్ పోర్టల్లో నమోదు కావాల్సిందే.
న్యూస్టుడే, ముమ్మిడివరం
రైతులకు ప్రభుత్వ పథకాలు అందాలంటే పంట నమోదు(ఈ-క్రాప్) తప్పనిసరి. విపత్తుల సమయంలో పెట్టుబడి రాయితీ నుంచి పంటల బీమా, రైతుభరోసా వరకు, పండించిన ధాన్యం అమ్ముకోవడానికి ఈ-క్రాప్ పోర్టల్లో నమోదు కావాల్సిందే. మూడేళ్లుగా ప్రతి సీజన్లోనూ ఈ-క్రాప్ నమోదు ప్రక్రియ సాగుతోంది. ప్రస్తుత ఖరీఫ్-2023 సీజన్కు సంబంధించి నమోదు నత్తనడకన సాగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. యాప్లో సాంకేతిక ఇక్కట్లు, ఇతరత్రా కారణాలతో మొదట ఈ నెల 15వరకు గడువు సమయానికి నిర్దేశిత లక్ష్యం పూర్తికాలేదు. దాంతో గడువు పొడిగించి రైతులకు అవకాశం కల్పించారు. రైతులు తమ పంటలను పోర్టల్లో నమోదు చేయించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 1,74,271 ఎకరాల్లో ఖరీఫ్ సాగవుతోంది. ఆగస్టు 15 నుంచి ప్రారంభమైన ఈ-క్రాప్ నమోదు ఈ నెల 15వ తేదీలోగా పూర్తిచేయాలని సిబ్బందికి లక్ష్యం విధించారు. అప్పటికి 60 శాతం కూడా పూర్తికాకపోవడంతో ఈ నెలాఖరు వరకు ఈ క్రాప్ నమోదుకు అవకాశం కల్పించారు. జిల్లాలో ఇప్పటివరకు 1.30 లక్షల ఎకరాల్లో ఈ-క్రాప్ నమోదు చేశారు. అంటే 75 శాతం పూర్తయింది. పంట నమోదుకు మరో తొమ్మిది రోజులు మాత్రమే గడువు ఉండడంతో ప్రక్రియ వేగవంతం చేయాల్సిన ఆవశ్యకత ఉంది.
నమోదు చేయకపోతే రైతులకు నష్టమే..!
ప్రస్తుత పరిస్థితుల్లో ఈ-క్రాప్ నమోదు విధిగా చేయించాల్సిఉంది. ప్రధానంగా ఖరీఫ్ సీజన్కు భారీ వర్షాలు, తుపానుల బెడద ఎక్కువగా ఉంటుంది. ఏదైనా అనుకోని విపత్తు సంభవిస్తే.. రైతులకు పరిహారం పంపిణీలో ఈ-క్రాప్ వివరాలనే ప్రాతిపదికగా తీసుకుంటారు. పెట్టుబడి రాయితీ, పంటల బీమా, ధాన్యం విక్రయాలకు ఈ-క్రాప్ నమోదు తప్పనిసరి కావడంతో రైతులు తమ పంటల వివరాల నమోదుకు ముందుకు రావాల్సిఉంది. ఈ ఏడాది నుంచి డిజిటల్ ఈ-క్రాప్ బుకింగ్ చేస్తున్న క్రమంలో యాప్లో పలు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. సర్వే నంబర్ల ఆధారంగా ఈ-క్రాప్ నమోదు జరుగుతున్న క్రమంలో క్షేత్రస్థాయిలో సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటిని పరిష్కరించేందుకు 10-200 మీటర్ల దూరంలో ఫొటోలు తీసి యాప్లో నమోదు చేయడానికి అవకాశం కల్పించడంతో కొంతవరకు వెసులుబాటు కలిగింది. ఈ క్రమంలో ఖరీఫ్లో ప్రతి రైతు సాగుచేసిన పంటను నమోదు చేయడానికి సిబ్బంది చర్యలు చేపట్టాల్సిఉంది.
ఉద్యాన పంటలకూ అవకాశం..
వరి సాగుకే కాకుండా ఉద్యాన పంటలకు కూడా ఈ-క్రాప్ నమోదు చేయాల్సిఉంది. వాతావరణ, దిగుబడి ఆధారిత బీమా సౌకర్యం కల్పిస్తున్న నేపథ్యంలో ఈ-క్రాప్ నమోదు ఆధారంగానే బీమా పరిహారం పొందడానికి అవకాశం ఉంటుంది. జిల్లాలో ఉద్యాన పంటలకు సంబంధించి పంట నమోదు పూర్తిస్థాయిలో జరగడం లేదు. కొబ్బరి, కోకో, పసుపు, తమలపాకులు, అరటి, బొప్పాయి, కూరగాయల పంటలను ఈ-క్రాప్లో నమోదు చేశారు. దీనికి ఈ నెల 15తో గడువు ముగియడంతో.. తొలుత గడువు పెంచలేదు. మళ్లీ ఇటీవల ఉద్యానపంటలకూ ఈ నెలాఖరు వరకు ఈ-క్రాప్ నమోదుకు అవకాశం కల్పించారు.
ఈ నెలాఖరుకు పూర్తి చేయించుకోండి
- వి.బోసుబాబు, జిల్లా వ్యవసాయాధికారి
వరి సాగు ఈ-క్రాప్ నమోదుకు ఈ నెలాఖరు వరకు అవకాశం ఉంది. ఈ నెల 15వ తేదీనాటికే గడువు పూర్తయినా.. సాంకేతిక లోపాలు, వివిధ కారణాలతో పంట నమోదు పూర్తిస్థాయిలో జరగలేదు. ప్రస్తుతం 75 శాతం అయ్యింది. రైతుభరోసా కేంద్రాల పరిధిలోని వరి విస్తీర్ణం ఆధారంగా అక్కడ పనిచేసే వ్యవసాయ సహాయకులు ప్రణాళిక ప్రకారం.. ప్రతి రైతు సాగుచేసిన పంటను పోర్టల్లో నమోదు చేయాలని ఆదేశాలిచ్చాం. ఒక్క రైతుకు కూడా నష్టం కలగకుండా 100శాతం ఈ-క్రాప్ నమోదు చేయించుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమాత్యుని శాఖ మారినా..అవస్థ తొలగక వేదన..
[ 08-12-2023]
అమలాపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రి విశ్వరూప్ శాఖ మారినప్పటికీ.. మూడేళ్లుగా అభివృద్ధి పనులు చాలాచోట్ల మొదలుకాని పరిస్థితి నెలకొంది. మండలంలోని ఇందుపల్లిలో మూడేళ్ల క్రితం మంత్రి విశ్వరూప్ శంకుస్థాపన చేసిన శిలాఫలకం పనులెన్నడని ప్రశ్నిస్తోంది. -
డిజిటల్ బోధన.. కొందరికేనా..!
[ 08-12-2023]
మానసిక, శారీరక లోపాలతో పుట్టిన పిల్లలకు ప్రత్యేకంగా విద్య అందించేందుకు భవిత కేంద్రాలు నిర్వహిస్తున్నారు. వైకల్య శాతం తక్కువగా ఉన్నవారు సమీపంలోని పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. -
నిర్లక్ష్యం ముంచేసింది..
[ 08-12-2023]
కాకినాడ నగరానికి చేరుకోవడానికి ముఖ్యమైన రహదారుల్లో ఒకటైన కాకినాడ- సామర్లకోట రోడ్డును వరద ముంచెత్తుతోంది. ఈ రహదారికి సమాంతరంగా గోదావరి పంట కాల్వ ఉంది. -
వేటకు వెళ్లి తిరిగిరాని మత్స్యకారులు
[ 08-12-2023]
వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులను కాపాడాలని బాధిత కుటుంబాలు గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ కృతికాశుక్లాకు మొరపెట్టుకున్నాయి. మత్స్యకార నాయకుడు, తెదేపా నగర ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేశ్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలు కలెక్టర్కు వినతి పత్రం అందజేశాయి. -
క్రీడాకారుల భవిష్యత్తుతో ఆటలు
[ 08-12-2023]
క్రీడల గురించి ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో కనీస సౌకర్యాలు కొరవడి క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు. కాకినాడలోని జిల్లా క్రీడామైదానం 19 ఎకరాల్లో విస్తరించి ఉంది. -
వీడిన సోదర బంధం..
[ 08-12-2023]
గుర్తు తెలియని వాహనం ఢీకొని అన్న మృతిచెందగా, తమ్ముడు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని అనంతపల్లికి చెందిన అన్నదమ్ములు అవిర్ని శ్రీనివాస్, శ్రీధర్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. -
దెబ్బతిన్న విద్యుత్తు ఉపకేంద్రాల పునరుద్ధరణ
[ 08-12-2023]
మిగ్జాం తుపాను కారణంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దెబ్బతిన్న విద్యుత్తు ఉప కేంద్రాలు, ఇతర పరికరాలను పునరుద్ధరించినట్లు ఈపీడీసీఎల్ రాజమహేంద్రవరం సర్కిల్ ఎస్ఈ టీవీఎస్ఎన్ మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. -
మూడు నెలలుగా వేతనాలు అందక వెతలు
[ 08-12-2023]
మూడు నెలలుగా జీతాలు అందక సమగ్ర శిక్షా ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. వీరంతా ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందే. సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలలు జీతాలు రాకపోవడంతో అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. -
నమూనాలయ నిర్మాణం భద్రమేనా..!
[ 08-12-2023]
అన్నవరం జాతీయ రహదారిపై డిగ్రీ కళాశాల పక్కన (విశాఖపట్నం - రాజమహేంద్రవరం) మార్గంలో స్వామివారి నమూనాలయం నిర్మిస్తున్నారు. ప్రసాద విక్రయకేంద్రం, ఫుడ్ప్లాజా, దుకాణ సముదాయం, మరుగుదొడ్లు తదితర పనులు చేపడుతున్నారు. -
బండి దాటించాలా.. రూ. 50 ఇవ్వండి
[ 08-12-2023]
బిక్కవోలు-రామేశ్వరంపేట ఆర్అండ్బీ రోడ్డులో రంగంపేట మండలం సింగంపల్లి వద్ద భారీగా వర్షంనీరు పారుతోంది. -
వారణాసిలో కుటుంబం ఆత్మహత్య
[ 08-12-2023]
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నలుగురు సభ్యుల కుటుంబమొకటి గురువారం వారణాసిలోని ఓ ధర్మశాలలో ఆత్మహత్యకు పాల్పడింది. -
జలంలో జగనన్న కాలనీలు
[ 08-12-2023]
చిన్నపాటి వర్షానికే జగనన్న కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనపై శ్రద్ధ చూపకపోవడం, పంట, మురుగు కాలువల్లో నీరు సాగక కాలనీలు దుర్భరంగా ఉన్నాయి. -
అభ్యంతరాలు తెలిపే మిల్లర్లపై చర్యలు
[ 08-12-2023]
తేమశాతం ఎక్కువగా ఉన్న ధాన్యాన్ని డ్రైయర్స్(ఆరబెట్టే మర) అందుబాటులో ఉన్న మిల్లులకు తక్షణం తరలించాలని కలెక్టర్ మాధవీలత సంబంధిత అధికారులను ఆదేశించారు. -
దగ్గు.. జలుబు.. శ్వాసకోశ సమస్యలు
[ 08-12-2023]
దగ్గు.. జలుబు.. జ్వరం.. శ్వాసకోశ సమస్యలు.. ప్రస్తుతం ఎవరిని కదిపినా ఇదే అవస్థ. పది రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరడంతో చలికి చిన్నారులు, వృద్ధులతోపాటు మధ్య వయస్సు వారు సైతం రోగాల బారిన పడుతున్నారు. -
92 హత్యలు.. 160 సైబర్ నేరాలు
[ 08-12-2023]
హత్యలు.. వేధింపులు.. అపహరణలు.. దొంగతనాలు.. కొట్లాటలు.. సైబర్ నేరాలు.. ఇలా నేరాల చిట్టాకు అడ్డూఆపూ లేకుండా పోతోంది. -
ఊడ్చుకుపోయేదాకా కొర్రీలే!
[ 08-12-2023]
ఉమ్మడి జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మిగ్జాం తుపాను మిగిల్చిన నష్టం అంతా ఇంతాకాదు. భారీ వర్షాలకు పది నుంచి వారం రోజుల ముందుగానే కోతలు పూర్తి చేసిన రైతులు నిండా మునిగిపోయారు.


తాజా వార్తలు (Latest News)
-
RBI: ఐదోసారీ వడ్డీరేట్లు యథాతథం.. వృద్ధిరేటు అంచనాల పెంపు
-
SA vs IND : దక్షిణాఫ్రికా పర్యటన.. ఇప్పుడీ సిరీస్లతో భారత్కు కలిగే ప్రయోజనాలివే..
-
Kavitha: అందరి ప్రార్థనలతో కేసీఆర్ త్వరలోనే కోలుకుంటారు: ఎమ్మెల్సీ కవిత
-
Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
ISRO: మిత్రో.. చూసొద్దామా ఇస్రో.. విద్యార్థులకు అరుదైన అవకాశం
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు