ఇంటింటికీ వెళ్తాం.. అక్రమాన్ని వివరిస్తాం
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాటిస్తున్న రాజారెడ్డి రాజ్యాంగాన్ని త్వరలోనే రాష్ట్రం నుంచి తరిమికొట్టి దళితుల తడాఖా చూపిస్తామని తెదేపా ఎస్సీ, ఎస్టీ సెల్ నాయకులు హెచ్చరించారు.
చంద్రబాబు అరెస్టుపై భగ్గుమన్న ఎస్సీ, ఎస్టీ నాయకులు
అమలాపురం పట్టణం, న్యూస్టుడే: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాటిస్తున్న రాజారెడ్డి రాజ్యాంగాన్ని త్వరలోనే రాష్ట్రం నుంచి తరిమికొట్టి దళితుల తడాఖా చూపిస్తామని తెదేపా ఎస్సీ, ఎస్టీ సెల్ నాయకులు హెచ్చరించారు. అమలాపురôలో మాజీ ఎమ్మెల్యే ఆనందరావు అధ్యక్షతన తెదేపా శ్రేణులు తొమ్మిదోరోజు రిలే దీక్షలను గురువారం కొనసాగించారు. నాయకులు నల్ల, నీలం కండువాలు ధరించి నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఇంటింటికీ వెళ్తాం.. చంద్రబాబు అక్రమ అరెస్టును వివరిస్తాం.. అంటూ తెదేపా శ్రేణులు పేర్కొన్నారు. ర్యాలీ చేశారు. సీఎం డౌన్ డౌన్, చంద్రబాబు నాయకత్వం వర్థిల్లాలంటూ నినాదాలు చేశారు. ఆనందరావు మాట్లాడుతూ సైకో జగన్ పాలనలో ఎన్నడూ లేనివిధంగా దళితులపై దాడులు పెరిగాయన్నారు. దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన దుర్మార్గ ప్రభుత్వమిదని, నేరస్థులను జగన్ ప్రభుత్వం రక్షిస్తోందని ఆరోపించారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై కేసులు నమోదుచేసి జైలులో పెట్టారని ఆరోపించారు. అనంతరం బోర్డుపై సంతకాలు చేశారు. జగదీశ్వరి, సుభాష్చంద్రబోస్, శ్యామ్, నాగేశ్వరరావు, సత్యనారాయణ, శ్రీను, తారక్ తదితరులు పాల్గొన్నారు. ముమ్మిడివరంలో తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షలకు ఎస్సీ, మైనారిటీ సెల్ నాయకులు తరలివచ్చారు. మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు మద్దతు తెలిపి మాట్లాడారు. స్కిల్ డెవలప్మెంట్లో ఏవిధమైన అవినీతి జరక్కపోయినా అధికార బలంతో సీఐడీని అడ్డంపెట్టుకుని చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారన్నారు.
వైకాపా ప్రభుత్వాన్ని గద్దెదింపుదాం..
ముమ్మిడివరం: జనసేనాని నిర్ణయాలను నాయకులు, కార్యకర్తలం తప్పక పాటిద్దామని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు పితాని బాలకృష్ణ అన్నారు. ముమ్మిడివరంలో గురువారం నిర్వహించిన పార్టీ నియోజకవర్గస్థాయి సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పరిణామాలు.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు వంటి పరిస్థితుల నేపథ్యంలో అరాచక వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించడానికి తెదేపా, జనసేన కలిసి సాగాలని పవన్కల్యాణ్ పిలుపునిచ్చారన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి తెదేపా దీక్ష లకు మద్దతు తెలిపారు. జక్కంశెట్టి పండు, ముత్యాల జయలక్ష్మి, గొలకోటి వెంకటేశ్వరరావు, మోకా బాలప్రసాద్, మద్దింశెట్టి పురుషోత్తం, అత్తిలి బాబూరావు, కడలి వెంకటేశ్వరరావు, జమ్మి, పుండరీష్, రమేష్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Kakinada: బోటులో అగ్నిప్రమాదం.. కోస్టుగార్డు రెస్క్యూ ఆపరేషన్
[ 01-12-2023]
కాకినాడ తీరంలో వేటకు వెళ్తున్న బోటులో అగ్నిప్రమాదం జరిగింది. -
మేమొస్తాం.. కష్టాలు తీరుస్తాం
[ 01-12-2023]
ఆత్మీయ పలకరింపులు.. అఖండ స్వాగతాలు.. మంగళ హారతులు.. తీన్మార్ డప్పులు.. తెదేపా-జనసేన జెండాల రెపరెపలు.. బాణసంచా కాల్పుల హోరు నడుమ గురువారం తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సాగింది. -
స్వామీ.. దర్యాప్తు భారం నీదే!
[ 01-12-2023]
2020 సెప్టెంబర్ 5న అర్ధరాత్రి.. అప్పటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆవరణలోని దివ్యరథం దగ్ధమైంది. 56 ఏళ్లపాటు స్వామికి వాహన సేవ అందించిన రథం ఇలా కావడం భక్తులకు ఆగ్రహం తెప్పించింది. -
ఇసుక ఇష్టానుసారంగా..
[ 01-12-2023]
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, ధవళేశ్వరం, కడియం, న్యూస్టుడే: గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇసుకను అడ్డంగా దోచేస్తున్నారు. ఒకపక్క కోర్టులు హెచ్చరిస్తున్నా అదేమీ పట్టనట్టు ఇష్టానుసారంగా ఇసుకను అక్రమ మార్గాన తవ్వుకుపోతున్నారు. -
రమణీయం.. గోవిందుడి కల్యాణం
[ 01-12-2023]
కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరుని కల్యాణోత్సవం గురువారం ఆత్రేయపురంలో వైభవంగా నిర్వహించారు.. ధర్మపథం పేరిట వేలాదిగా హాజరైన భక్తుల నడుమ తితిదే కల్యాణ మండపంలో నిర్వహించిన ఈ ఘట్టం కనులపండువగా సాగింది.. -
దుకాణ సముదాయంలో దందా
[ 01-12-2023]
కాకినాడ నగరంలో జ్యోతుల మార్కెట్ అధికార పార్టీ నేతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.నగరపాలక సంస్థ నిధులతో చేపట్టిన ఈ దుకాణ సముదాయం వైకాపా నాయకుల జేబులు నింపుతోంది. -
చేపలబోటు బోల్తా.. మత్స్యకారులు క్షేమం
[ 01-12-2023]
సఖినేటిపల్లి మండలం అంతర్వేది సాగర సంగమం వద్ద అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం రేవుపోలవరం గ్రామానికి చెందిన యజ్జల లోవరాజు చేపల బోటు బోల్తా కొట్టింది. -
రాయితీ కందిపప్పు కొందరికే..
[ 01-12-2023]
రేషన్ కార్డుదారులకు గత ఆరు నెలలుగా నిలిపివేసిన రాయితీ కందిపప్పు ఎట్టకేలకు ఈ నెల నుంచి మళ్లీ పంపిణీ చేయనున్నప్పటికీ అదికూడా కొందరికి మాత్రమే అందనుంది. అవసరమైన మేరకు సరఫరా కాలేదు. -
కలిసి విజయపతాకం ఎగరేస్తాం
[ 01-12-2023]
అనపర్తి నియోజకవర్గంలోని రంగంపేట మండలం ఈలకొలను గ్రామంలో తెదేపా, జనసేన పార్టీల స్తూపాలను పక్కపక్కనే ఏర్పాటు చేసి గురువారం ఒకేసారి పతాకాలను ఆవిష్కరించారు. -
షరా మామూలే..
[ 01-12-2023]
తాళ్లపూడి మండలం బల్లిపాడు ఇసుక ఓపెన్ ర్యాంపులో అక్రమ ఇసుక దందా మళ్లీ మొదలైంది. గత నెల 28న ర్యాంపులోకి వెళ్లే రోడ్డును నీటితో తడుపుతూ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ కె.దుర్గారావు గోదావరిలో పడి మృతిచెందారు. -
కళ తెస్తూ.. శుభమస్తు
[ 01-12-2023]
మొన్నమొన్నటి వరకు మూఢాలు, అధిక మాసాలతో కల్యాణ వేదికలన్నీ బోసిపోయాయి. వివాహ ముహూర్తాల సమయం ఆసన్నమవ్వడం, అందులోనూ అధిక సంఖ్యలో ఉండటంతో ఎక్కడ చూసినా మేళతాళాలు, మంగళవాయిద్యాలు వినిపిస్తున్నాయి. -
మొక్కుబడిగా స్థాయీ సంఘాల సమావేశం
[ 01-12-2023]
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశం గురువారం మొక్కుబడిగా సాగింది. ముఖ్య ప్రజాప్రతినిధులు హాజరు కాలేదు. కొన్ని శాఖలకు సంబంధించి కీలక అధికారులూ గైర్హాజరయ్యారు. -
తాడిపర్రులో వివాదానికి ఎట్టకేలకు తెర
[ 01-12-2023]
మండలంలోని తాడిపర్రులో పాపన్నగౌడ్ విగ్రహం ఏర్పాటుపై రెండు సామాజిక వర్గాల మధ్య ఏర్పడిన వివాదానికి తెరపడింది. కొవ్వూరు ఆర్డీవో రేవంత్ కృష్ణనాయక్, డీఎస్పీ వర్మ ఆధ్వర్యంలో ఇరువర్గాలతో స్థానిక తహసీల్దారు కార్యాలయంలో గురువారం సుదీర్ఘ చర్చలు నిర్వహించారు. -
రైతులు ప్రకృతి సాగువైపు మళ్లాలి
[ 01-12-2023]
ఆరోగ్యకర ఉత్పత్తులకోసం రైతులు ప్రకృతి సాగు చేయాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. రాచపల్లి అడ్డరోడ్డు సమీపంలో ఆయన కౌలుకు తీసుకున్న వ్యవసాయ క్షేత్రంలో గురువారం పంట కోశారు. -
నేర వార్తలు
[ 01-12-2023]
రాయవరం మండలం పసలపూడిలో పాత కక్షల నేపథ్యంలో రెండు వర్గాలు గురువారం రాత్రి పరస్పర దాడులకు దిగాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని ఎస్సీ కాలనీలో సంఘీయుల పాత, కొత్త పాలక వర్గాల మధ్య కొన్నాళ్లుగా వివాదం సాగుతోంది. -
కొత్తకొత్తగా.. ఓటు పత్రం వచ్చెగా..
[ 01-12-2023]
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా ఉన్న ఓటర్లకు కొన్నాళ్లుగా కొత్త ఓటు గుర్తింపుకార్డులు జారీ చేస్తున్నారు. -
ఆశయం నీరుగారి.. వ్యయం వృథాగా మారి..
[ 01-12-2023]
సామాజిక బాధ్యతలో భాగంగా అయిదేళ్ల క్రితం ఓఎన్జీసీ సంస్థ సీఎస్సార్ నిధులతో తీర గ్రామాల్లో స్వచ్ఛ జలధార వాటర్ ఏటీఎంలు సమకూర్చింది. -
వెంటాడిన మృత్యువు
[ 01-12-2023]
కత్తిపూడి జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అన్నవరం అదనపు ఎస్సై మూర్తి తెలిపిన వివరాల ప్రకారం. -
నేడు యువగళం పాదయాత్ర ఇలా..
[ 01-12-2023]
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర గురువారం రాత్రి తాళ్లరేవు మండలం చొల్లంగిపేటలోని క్యాంప్సైట్ వద్ద ముగిసింది. -
ఫొటోలు తీస్తూ.. ఇంటింటికీ తిరుగుతూ..
[ 01-12-2023]
ప్రభుత్వ కార్యక్రమంలో గర్భిణి అయిన వాలంటీరు(దళిత) ఇంటింటికీ తిరిగే క్రమంలో ఇబ్బందిపడిన ఘటన చర్చనీయాంశమైంది. వివరాల ప్రకారం.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం నల్లమిల్లిలో గురువారం ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు.


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Mizoram Elections: మిజోరం ఓట్ల లెక్కింపు తేదీ మార్పు
-
Revanth reddy: అన్ని ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టాలి: రేవంత్రెడ్డి
-
IND vs SA: అతడికి ఓ లాలీపాప్ ఇచ్చారు.. చాహల్ను వన్డేలకు ఎంపిక చేయడంపై హర్భజన్
-
Telsa: టెస్లాకు ప్రత్యేక మినహాయింపులు ఉండవ్!
-
Social Look: చీరలో మెరిసిన త్రిష.. పూజ క్విక్ పిక్..!