ప్రైవేటు బస్సు ఢీకొని యువకుడు దుర్మరణం
అతి వేగంగా, నిర్లక్ష్యంగా వస్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని, ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఆ రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి.
ముగ్గురికి గాయాలు
దేవరపల్లి, న్యూస్టుడే: అతి వేగంగా, నిర్లక్ష్యంగా వస్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని, ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఆ రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దేవరపల్లి మండలంలోని జాతీయ రహదారి నుంచి యర్నగూడెం గ్రామంలోకి వెళ్తుంది.
అదే సమయంలో యర్నగూడెం నుంచి నల్లజర్ల వెళ్తున్న కోళ్లను సరఫరా చేసే బొలెరోను, దాని వెనుక ద్విచక్రవాహనాన్ని.. ట్రావెల్ బస్సు బలంగా ఢీకొనడంతో బొలెరో డ్రైవర్ కనక పెద్దిరాజు(33), క్లీనర్ కె.యశ్వంత్కు తీవ్రగాయాలు కాగా కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కనక పెద్దిరాజు మృతిచెందారు. ద్విచక్ర వాహనంపై ఉన్న బొడ్డు చంటి, జెర్రి నాగేంద్రకు గాయాలవ్వడంతో గోపాలపురం సీహెచ్సీకి మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు అతివేగం, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని క్షతగాత్రులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాద సమయంలో బస్సులో ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్నారు.
అందరూ యర్నగూడెం గ్రామస్థులే..
బాధితులు అందరూ యర్నగూడెం గ్రామానికి చెందిన వారే. మృతుడు కనక పెద్దిరాజు చికెన్ దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కోళ్ల లోడు కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. నాన్న ఎక్కడని.. పిల్లలు అడిగితే ఏం చెప్పాలని మృతుడి భార్య కన్నీరుమున్నీరుగా విలపించారు. చంటి, నాగేంద్ర పెయింటింగ్ పనులు చేస్తుంటారు. నల్లజర్ల వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బతుకుతాం అనుకోలేదు..
[ 02-12-2023]
కాకినాడ తీరానికి 130 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంలో బోటు ఒకటి శుక్రవారం కాలిపోయింది. బోటులో ఉన్న 11 మంది సురక్షితంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. కాకినాడలోని జగన్నాథపురం, ఏటిమొగ ప్రాంతానికి చెందిన బొమ్మిడి వీరబాబు, -
చైతన్యంతో ఓటు.. చేజార్చుకుంటే చేటు
[ 02-12-2023]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుతో పాలకులను ఎన్నుకునే ‘అధికారం’ పౌరులందరికీ ఉంటుంది. ఆ అస్త్రాన్ని ఉపయోగించి నచ్చినవారిని గద్దెనెక్కించే అవకాశాన్ని పౌరులకు రాజ్యాంగం కల్పించింది. దీనికోసం 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవచ్చు. -
వేతనాలు నై.. సమ్మెకు సై..
[ 02-12-2023]
సార్ మా ఖాతాల్లో జీతాలేశారా.. అని ఫోన్ చేసి అడగడం, ఇంకాలేదు. ఎప్పుడు పడతాయో తెలీదని ఉన్నతాధికారులు చెప్పడం.. ఆ వెంటనే నిరాశతో ఫోన్ పెట్టేయడం.. సమగ్ర శిక్షలో ఒప్పంద ఉద్యోగులకు సంప్రదాయంగా మారిందని వాపోతున్నారు. -
భయపెడుతున్న వాయుగుండం
[ 02-12-2023]
పి.గన్నవరం: రానున్న రెండురోజుల్లో వాయుగుండం వస్తుందనే ఆందోళనతో రైతులు హైరానాపడుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం ఖరీఫ్ వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. జిల్లాలో 1.52లక్షల ఎకరాల విస్తీర్ణంలో రైతులు ఖరీఫ్ వరి సాగు చేశారు. ఇంతవరకు 88 వేల ఎకరాల్లో కోతలు పూర్తయినట్లు వ్యవసాయశాఖాధికారులు చెబుతున్నారు. -
కష్టాలు వింటూ... నేనున్నానంటూ..
[ 02-12-2023]
విరులజల్లులు.. గజమాలలు.. పచ్చతోరణాల రెపరెపల స్వాగతాలు.. మహిళల మంగళ హారతులు.. పెద్దల ఆశీర్వచనాలు.. జై లోకేశ్.. జై చంద్రబాబు.. జైజై తెలుగుదేశం.. సైకిల్ రావాలి.. సైకో పోవాలి.. అంటూ హోరెత్తిన నినాదాలు.. తీన్మార్ వాయిద్యాలు.. కోలాటాలు, బాణసంచా కాల్పులు.. యువత కేరింతలు.. -
ఓటరూ మేలుకో.. జాబితా చూసుకో
[ 02-12-2023]
రాబోయేవి రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే కీలకమైన ఎన్నికలు. మంచి పాలకులను ఎన్నుకునేందుకు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటే వజ్రాయుధమని గుర్తించాలి. ఏమాత్రం అలక్ష్యంగా ఉన్నా ఆ అవకాశం కోల్పోవచ్చు. -
అడ్డంకులు తొలగేనా.. నీళ్లు అందేనా..!
[ 02-12-2023]
రానున్న రబీలో పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని నవంబరు 14, 15, 16 తేదీల్లో కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల వారీగా నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశాల్లో అధికారికంగా వెల్లడించారు. -
నోటికి గుడ్డకట్టుకుని సర్పంచి నిరసన
[ 02-12-2023]
గ్రామ పంచాయతీల్లో నిధులన్నీ వెనక్కి తీసుకుని పాలకవర్గాలకు ఎటువంటి విధులు లేకుండా ఎందుకొచ్చిన సమావేశాలంటూ సీతానగరం మండలం సింగవరం సర్పంచి సంగన చినపోశయ్య నిరసనకు దిగారు. ఎంపీపీ గుర్రాల జ్యోత్స్న అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన మండల పరిషత్ సమావేశంలో నోటికి నల్లగుడ్డ కట్టుకుని వచ్చి మూడు గంటలపాటు మౌనంగా నిరసన తెలిపారు. -
తెదేపా సానుభూతిపరుడిపై కత్తితో దాడి
[ 02-12-2023]
కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో పాత వివాదం నేపథ్యంలో జరిగిన ఘర్షణలో వైకాపా ఎంపీటీసీ అన్న కుమారుడు.. తెదేపా సానుభూతిపరుడిపై కత్తితో దాడికి దిగాడు. తీవ్ర గాయాలతో బాధితుడు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
వరి కోతల వేళ తుపాను కలవరం
[ 02-12-2023]
పంట చేతికొచ్చే సమయంలో తుపాను హెచ్చరికలు అన్నదాతలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఒకపక్క ముమ్మరంగా ఖరీఫ్ వరికోతలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 60 శాతం మాత్రమే జరిగాయి. కొన్నిచోట్ల ధాన్యం ఇంకా కల్లాల్లోనే ఉంది. -
మత్స్యకారులెవరూ సముద్రంలోకి వేటకు వెళ్లొద్దు
[ 02-12-2023]
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని తీర ప్రాంతాల వెంట ఉన్న మత్స్యకారులు అప్రమత్తం కావాలని కలెక్టర్ హిమాన్షుశుక్లా పేర్కొన్నారు. -
లోకేశ్ పాదయాత్రకు ఏర్పాట్లు
[ 02-12-2023]
తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్ చేపట్టిన పాదయాత్రకు పిఠాపురంలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తెలిపారు. శనివారం చిత్రాడ నుంచి పిఠాపురం వరకూ జరిగే పాదయాత్రకు తెదేపా, జనసేన నేతలు హాజరుకానున్నారు.