జీవజలాలు.. సంద్రంపాలు
దేశంలోని ప్రముఖ నదుల్లో గోదావరి ఒకటి. మహారాష్ట్రలోని నాసిక్ వద్ద పుట్టి 1500 కిలోమీటర్ల మేర ప్రయాణించి పోలవరం వద్ద డెల్టా ప్రాంతంలోకి ప్రవేశించింది
గోదావరి పరిరక్షణకు చిత్తశుద్ధి కరవు
నేడు నదుల దినోత్సవం
ఈ ఏడాది జులైలో వరదలకు పి.గన్నవరం వైనతేయ గోదావరి నుంచి సముద్రం వైపు ప్రవాహం
న్యూస్టుడే, పి.గన్నవరం, ముమ్మిడివరం: దేశంలోని ప్రముఖ నదుల్లో గోదావరి ఒకటి. మహారాష్ట్రలోని నాసిక్ వద్ద పుట్టి 1500 కిలోమీటర్ల మేర ప్రయాణించి పోలవరం వద్ద డెల్టా ప్రాంతంలోకి ప్రవేశించింది. అక్కడి నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకు 41.80 కిలోమీటర్ల మేర అఖండ గోదావరిగా ఏర్పడింది. బ్యారేజీ దిగువకు వచ్చేసరికి గౌతమి, వృద్ధగౌతమి, కోరింగ, వశిష్ఠ, వైనతేయ పాయలుగా చీలి కోనసీమ ప్రాంతంలో సాగరంలో కలుస్తున్నాయి. బ్యారేజీ దిగువన ఆయా నదీ పాయలు సుమారు 220 కిలోమీటర్ల మేర విస్తరించిఉన్నాయి. ఈ పాయల్లో జూన్ నుంచి డిసెంబరు వరకు వరద జలాలు ఉప్పొంగి ప్రవహిస్తుంటాయి. జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వరదల సీజన్గా భావిస్తారు. ఈ మూడు నెలల్లో వరద నీరు ఎక్కువగా సముద్రం పాలవుతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో 9.50లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగవుతుంది. దీనికి గోదావరి జలాలే ఆధారం. లక్షలాది మందికి, వేలాది పశువులకు తాగునీటి అవసరాలు తీరుస్తున్నాయి. పరిశ్రమలకుసైతం ఇవే కీలకం. ఇంతటి ప్రాధాన్యం గల గోదావరిని కలుషితం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యతను అందరూ విస్మరిస్తున్నారు. ఒక టీఎంసీ అంటే 11,500 క్యూసెక్కుల నీరు. ఈ నీటితో సుమారు 11 వేల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేయొచ్చు. ఏటా గోదావరి వరదల సమయంలో వేలాది టీఎంసీల గోదావరి జీవ జలాలు ఉప్పునీటి పాలవుతున్నాయి. వాటన్నింటినీ నిల్వ చేసుకోగలిగితే మొదటి పంటైన ఖరీఫ్కు నీటి ఎద్దడి ఉండదు. ఇక రబీ సాగుకు నీరందక యాతనపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గోదావరిలో స్వయం జలవృద్ధి పడిపోతున్న పరిస్థితుల్లో రబీ సాగుకు ఎక్కువగా సీలేరు జలాలపై ఆధారపడాల్సివస్తోంది. సముద్రంలో కలిసిపోతున్న జీవజలాలను ఒడిసిపట్టుకునేలా ప్రాజెక్టులు అందుబాటులో లేకపోవటంతో ఏటా రెండో పంటకు సాగునీటి ఎద్దడి ఏర్పడుతోంది. పోలవరం లాంటి ప్రాజెక్టులు పూర్తిచేస్తే జలాలను రాష్ట్రమంతా సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుంది.
పాయలవెంట అక్రమ ఆక్వా సాగు
నదీ జలాలను కలుషితం చేస్తున్నవాటిలో అక్రమ ఆక్వా సాగు ఒకటి. ధవళేశ్వరం బ్యారేజీకి దిగువన ఉన్న కోనసీమలోని వశిష్ఠ, వైనతేయ, గౌతమి, వృద్ధగౌతమి గోదావరి నదీపాయల చెంతన ఈ సాగు యథేచ్ఛగా సాగిపోతోంది. ఆక్వా చెరువుల నుంచి వ్యర్థ జలాలను నేరుగా నదిలోకి మళ్లించకుండా అధికార యంత్రాంగం అరికట్టాల్సిఉంది. కోనసీమ ప్రాంతంలో 35 వేల ఎకరాల్లో ఆక్వా సాగుంటే. దీంట్లో నదీ పాయలను ఆనుకుని సుమారు అయిదు వేల ఎకరాల్లో సాగవుతోంది. లంకా ఆఫ్ గేదెల్లంక, అన్నంపల్లి, మురమళ్ల, పల్లంకుర్రు, కేశనకుర్రు, సఖినేటిపల్లి, అంతర్వేది, ఎదుర్లంక, జి.మూలపొలం, బోడసకుర్రు తదితర ప్రాంతాల్లో గోదావరి పాయల వెంట అక్రమ ఆక్వా సాగు జలాలను కలుషితం చేస్తోంది. దానికి తోడు నదిని ఆనుకునే చెత్త వేయడమూ కాలుష్యానికి కారణమవుతోంది.
భారీగా తరలుతున్న ఇసుకతో..
లంక భూములు, తీర ప్రాంతాల్లో ఇసుక, లంకమట్టి తవ్వకాలు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తుండడం నదిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. పాయల్లో ఏకంగా రహదారులు ఏర్పాటుచేసి మరీ భారీ లారీలతో తరలిస్తున్నారు. యంత్రాలతో తోడకంతో ఆ ప్రభావం భూగర్భ జలాలపై పడుతోంది. నది స్వరూపం మారుతోందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్రాస్ రివర్స్ కన్జర్వెన్సీ యాక్ట్ ప్రకారం గోదావరి జలాలను కలుషితం చేయకూడదు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఇసుక తవ్వకాలు చేపట్టకూడదు. కానీ చాలా సంవత్సరాలుగా ఈ యాక్ట్ను పక్కాగా అమలు చేస్తున్న పరిస్థితులు లేకపోవడం దయనీయం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధవళేశ్వరం యువతికి ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు
[ 07-12-2023]
ధవళేశ్వరం కొత్తవీధికి చెందిన అంబటి కీర్తినాయుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నోటిఫికేషన్లలో ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించుకున్నారు. -
ఇక ఏముందని.. కన్నీరే మిగిలిందని!
[ 07-12-2023]
తుపాను ధాటికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అతలాకుతలమైంది. ఈదురుగాలులు, వర్షాలకు తోడు మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి అపార నష్టం వాటిల్లింది. వరి పొలాలు చెరువులను తలపించాయి. -
చేతులు కాలాక.. ఆకులు పట్టుకుంటే ఎలా..!
[ 07-12-2023]
చేతులు కాలాక ఆకులుపట్టుకుంటే ప్రయోజనం ఏమిటి...? అధికార యంత్రాంగం పరిస్థితి అలాగే ఉంది. తుపాను కారణంగా కురిసిన కుండపోత వర్షానికి జిల్లాలో వేలాది ఎకరాల విస్తీర్ణంలో వరిపంట ముంపుబారినపడింది. -
తుపాను నష్టాలపై నివేదికలకు ఆదేశాలు
[ 07-12-2023]
తుపాను కారణంగా సంభవించిన నష్టాలను నమోదు చేసి నివేదికలు అందజేయాలని జిల్లా ప్రత్యేక అధికారి, సీఆర్డీఏ కమిషనర్ వివేక్యాదవ్, కలెక్టర్ మాధవీలత ఆదేశించారు. -
రైతుల ఆశలపై నీళ్లు
[ 07-12-2023]
మిగ్జాం తుపాను రైతులను నిండా ముంచేసింది. పంట చేతికొచ్చిన వేళ వారి ఆశలపై నీళ్లు చల్లింది. కళ్లెదుటే పంట వర్షార్పణమైంది. జిల్లాలో 12,053 హెక్టార్లలోని వ్యవసాయ, ఉద్యాన పంటలు తుపాను బారిన పడ్డాయి. -
పొంగిన కొవ్వాడ కాలువ
[ 07-12-2023]
తాళ్లపూడి మండలంలో మంగళవారం సాయంత్రం ప్రశాంతంగా ఉన్న కొవ్వాడ కాలువ బుధవారం తెల్లవారే సరికి పొంగింది. మంగళవారం అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కుండపోత వర్షం కురవడంతో కొండ, ఎగువ ప్రాంతాల నుంచి నీరు వచ్చి చేరింది. -
‘నియంత పాలనకు స్వస్తి పలకాలి’
[ 07-12-2023]
పల్లెలను నిలువు దోపిడీ చేస్తున్న నియంత పాలనకు స్వస్తి పలకాలని, వైకాపా ప్రభుత్వంలో సర్పంచులు ఉత్సవ విగ్రహాల్లా మారారని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు పాలడుగుల లక్ష్మణరావు అన్నారు. -
రాజకీయ పార్టీలు చురుకైన పాత్ర పోషించాలి
[ 07-12-2023]
జిల్లాలో 18-19 ఏళ్ల యువతను కొత్త ఓటర్లుగా నమోదు చేయించే విషయంలో రాజకీయ పార్టీలు చురుకైన పాత్ర పోషించాలని కలెక్టర్ మాధవీలత, జేసీ తేజ్భరత్, డీఆర్వో నరసింహులు సూచించారు. -
మొక్కుబడిగా ముగించేశారు..!
[ 07-12-2023]
కాకినాడ జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకుడిగా నియమితులైన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ ప్రధాన కార్యదర్శి ఎన్.యువరాజ్ జిల్లా పర్యటన తూతూమంత్రంగా సాగింది. -
లక్ష్యం నీరు గారుతోంది..!
[ 07-12-2023]
గాంధీనగర్ బాలభవన్ వద్ద రూ.50 లక్షల స్మార్ట్సిటీ నిధులతో నిర్మించిన షటిల్ ఇండోర్ స్టేడియంలోకి వర్షపు నీరు చేరుతోంది. మూడు రోజులుగా కురిసిన వర్షాలకు స్టేడియంలోని షటిల్ సింథటిక్ కోర్టుల్లోకి నీరు చేరి, క్రీడాకారులు అవస్థలు పడుతున్నారు. -
పంట నష్టంపై సమగ్ర సర్వే
[ 07-12-2023]
తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వాటిల్లిన పంట నష్టంపై సమగ్ర సర్వే నిర్వహించి బాధిత రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ జిల్లా అధికారి ఎన్.విజయ్కుమార్ చెప్పారు. -
కుప్పకూలేదాకా.. వేచి చూడాల్సిందేనా!
[ 07-12-2023]
వాడబోది మీడియం డ్రెయిన్ వైనతేయ నదిలో కలిసే చోట కుడి కరకట్ట మధ్యలో మామిడికుదురు మండలం ఆదుర్రు వద్ద ఉన్న అవుట్ఫాల్ స్లూయిస్ దశాబ్దమున్నర కాలంగా దుర్భరంగా మారింది. -
ఓటరు జాబితా పరిశీలనకు ప్రత్యేక అధికారి
[ 07-12-2023]
ఓటరు జాబితా సవరణకు సంబంధించి పరిశీలకులుగా జిల్లాకు పరిశ్రమల శాఖ కమిషనర్ యువరాజు రానున్నట్లు డీఆర్వో సత్తిబాబు తెలిపారు. -
రైల్వే మెము కార్షెడ్కు పురస్కారం
[ 07-12-2023]
రాజమహేంద్రవరంలోని దక్షిణ మధ్య రైల్వే మెము (మెయిన్ లైన్ ఎలక్ట్రికల్ మల్టీపుల్ యూనిట్) కార్షెడ్ ఉత్తమ నిర్వహణ విభాగంలో విశిష్ట రైల్ సేవా పురస్కార్-2023కి ఎంపికయ్యింది. -
రాజీ మార్గంలో కేసులు పరిష్కరించాలి
[ 07-12-2023]
రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగపరుచుకోవాలని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Chicken Price: చికెన్ అగ్గువ.. గుడ్డు పిరం
-
Hyderabad: రేవంత్ ప్రమాణస్వీకారం.. నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
-
రైల్వేజోన్కు ఏపీ ప్రభుత్వం భూమి ఇవ్వలేదు: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
-
దారి దాటేలోగా... దారుణమే జరిగింది!
-
Hyderabad: మాజీ మంత్రి కార్యాలయంలోని ఫర్నిచర్ తరలింపు!
-
Revanth Reddy: నేనింకా ప్రమాణస్వీకారం చేయలేదు.. అధికారిక కాన్వాయ్కు నో చెప్పిన రేవంత్