ఉక్కు సంకల్పం
రాజమహేంద్రవరం నగరం.. క్వారీసెంటర్ వద్ద జరిగిన దీక్షలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ పాల్గొని మాట్లాడారు. 30వ డివిజన్లో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు
చంద్రబాబుకు మద్దతుగా దీక్షలు ఉద్ధృతం
టి.నగర్, ఏవీఏ రోడ్, దానవాయిపేట, న్యూస్టుడే: రాజమహేంద్రవరం నగరం.. క్వారీసెంటర్ వద్ద జరిగిన దీక్షలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ పాల్గొని మాట్లాడారు. 30వ డివిజన్లో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ్ల్వ) రాజమహేంద్రవరం గ్రామీణం బొమ్మూరులో చేపట్టిన తెదేపా దీక్షలో ఉమ్మడి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్ పాల్గొని మాట్లాడారు. ్ల్వ) అనపర్తి నియోజకవర్గంలో తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. ్ల్వ) నిడదవోలు మండలం డి.ముప్పవరంలో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు నేతృత్వంలో రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. సమిశ్రగూడంలో కుందుల వీరవెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని అర్ధనగ్నంగా మౌనదీక్ష చేపట్టారు.్ల్వ) చాగల్లు మండల నాయకులు కొవ్వూరు పట్టణంలో దీక్ష చేపట్టారు. నియోజకవర్గ తెదేపా ద్విసభ్య కమిటీ సభ్యుడు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, జనసేన నియజకవర్గ ఇన్ఛార్జి టీవీ రామారావు పాల్గొని మాట్లాడారు. రెండు పార్టీల పొత్తుతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు. తాళ్లపూడి మండలంలోని అన్నదేవరపేటలో తెదేపా శ్రేణులు ఇంటింటికీ వెళ్లి బిక్షాటన చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. తొలుత పోలీసులు వచ్చి వారిని ఆపేయడంతో కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. నాయకులను పోలీసుస్టేషన్కు తరలించారు. కొద్దిసేపటికే విడిచిపెట్టగా వారు కార్యక్రమం కొనసాగించారు. ్ల్వ) గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల బేతేల్ చర్చిలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ మాజీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ్ల్వ) సీతానగరం మండలం మునికూడలిలోని సోమేశ్వరస్వామి ఆలయంలో నియోజకవర్గం తెదేపా ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో 108 కొబ్బరికాయలు కొట్టారు.
చేనేత పరిశ్రమ నిర్వీర్యం..
సీతానగరం: సీతానగరం మండలం వెలంపేట నుంచి కస్తూర్బాగాంధీ ఆశ్రమం వరకు తెదేపా, జనసేన ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం తలపెట్టిన కాగడాల ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. కొత్తపేట రామాలయం వద్ద రాజానగరం తెదేపా ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో మహిళలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కాగడాల ప్రదర్శనకు అనుమతులు లేవని పోలీసులు స్పష్టంచేశారు. దీంతో శిబిరం వద్దనే నిరసనలు వ్యక్తం చేశారు.
నేడు అనపర్తి నుంచి ‘చలో రాజమహేంద్రవరం’
అనపర్తి: చంద్రబాబు అక్రమ అరెస్టు నిరసిస్తూ నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలకు సంఘీభావం తెలిపేందుకు అనపర్తి నియోజకవర్గం నుంచి ఈనెల 24న (ఆదివారం) చలో రాజమహేంద్రవరం నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బైక్ ర్యాలీగా వెళ్లడం జరుగుతుందని.. అనపర్తి దేవీచౌక్ సెంటర్ నుంచి ప్రారంభమవుతుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధవళేశ్వరం యువతికి ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు
[ 07-12-2023]
ధవళేశ్వరం కొత్తవీధికి చెందిన అంబటి కీర్తినాయుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నోటిఫికేషన్లలో ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించుకున్నారు. -
ఇక ఏముందని.. కన్నీరే మిగిలిందని!
[ 07-12-2023]
తుపాను ధాటికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అతలాకుతలమైంది. ఈదురుగాలులు, వర్షాలకు తోడు మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి అపార నష్టం వాటిల్లింది. వరి పొలాలు చెరువులను తలపించాయి. -
చేతులు కాలాక.. ఆకులు పట్టుకుంటే ఎలా..!
[ 07-12-2023]
చేతులు కాలాక ఆకులుపట్టుకుంటే ప్రయోజనం ఏమిటి...? అధికార యంత్రాంగం పరిస్థితి అలాగే ఉంది. తుపాను కారణంగా కురిసిన కుండపోత వర్షానికి జిల్లాలో వేలాది ఎకరాల విస్తీర్ణంలో వరిపంట ముంపుబారినపడింది. -
తుపాను నష్టాలపై నివేదికలకు ఆదేశాలు
[ 07-12-2023]
తుపాను కారణంగా సంభవించిన నష్టాలను నమోదు చేసి నివేదికలు అందజేయాలని జిల్లా ప్రత్యేక అధికారి, సీఆర్డీఏ కమిషనర్ వివేక్యాదవ్, కలెక్టర్ మాధవీలత ఆదేశించారు. -
రైతుల ఆశలపై నీళ్లు
[ 07-12-2023]
మిగ్జాం తుపాను రైతులను నిండా ముంచేసింది. పంట చేతికొచ్చిన వేళ వారి ఆశలపై నీళ్లు చల్లింది. కళ్లెదుటే పంట వర్షార్పణమైంది. జిల్లాలో 12,053 హెక్టార్లలోని వ్యవసాయ, ఉద్యాన పంటలు తుపాను బారిన పడ్డాయి. -
పొంగిన కొవ్వాడ కాలువ
[ 07-12-2023]
తాళ్లపూడి మండలంలో మంగళవారం సాయంత్రం ప్రశాంతంగా ఉన్న కొవ్వాడ కాలువ బుధవారం తెల్లవారే సరికి పొంగింది. మంగళవారం అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కుండపోత వర్షం కురవడంతో కొండ, ఎగువ ప్రాంతాల నుంచి నీరు వచ్చి చేరింది. -
‘నియంత పాలనకు స్వస్తి పలకాలి’
[ 07-12-2023]
పల్లెలను నిలువు దోపిడీ చేస్తున్న నియంత పాలనకు స్వస్తి పలకాలని, వైకాపా ప్రభుత్వంలో సర్పంచులు ఉత్సవ విగ్రహాల్లా మారారని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు పాలడుగుల లక్ష్మణరావు అన్నారు. -
రాజకీయ పార్టీలు చురుకైన పాత్ర పోషించాలి
[ 07-12-2023]
జిల్లాలో 18-19 ఏళ్ల యువతను కొత్త ఓటర్లుగా నమోదు చేయించే విషయంలో రాజకీయ పార్టీలు చురుకైన పాత్ర పోషించాలని కలెక్టర్ మాధవీలత, జేసీ తేజ్భరత్, డీఆర్వో నరసింహులు సూచించారు. -
మొక్కుబడిగా ముగించేశారు..!
[ 07-12-2023]
కాకినాడ జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకుడిగా నియమితులైన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ ప్రధాన కార్యదర్శి ఎన్.యువరాజ్ జిల్లా పర్యటన తూతూమంత్రంగా సాగింది. -
లక్ష్యం నీరు గారుతోంది..!
[ 07-12-2023]
గాంధీనగర్ బాలభవన్ వద్ద రూ.50 లక్షల స్మార్ట్సిటీ నిధులతో నిర్మించిన షటిల్ ఇండోర్ స్టేడియంలోకి వర్షపు నీరు చేరుతోంది. మూడు రోజులుగా కురిసిన వర్షాలకు స్టేడియంలోని షటిల్ సింథటిక్ కోర్టుల్లోకి నీరు చేరి, క్రీడాకారులు అవస్థలు పడుతున్నారు. -
పంట నష్టంపై సమగ్ర సర్వే
[ 07-12-2023]
తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వాటిల్లిన పంట నష్టంపై సమగ్ర సర్వే నిర్వహించి బాధిత రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ జిల్లా అధికారి ఎన్.విజయ్కుమార్ చెప్పారు. -
కుప్పకూలేదాకా.. వేచి చూడాల్సిందేనా!
[ 07-12-2023]
వాడబోది మీడియం డ్రెయిన్ వైనతేయ నదిలో కలిసే చోట కుడి కరకట్ట మధ్యలో మామిడికుదురు మండలం ఆదుర్రు వద్ద ఉన్న అవుట్ఫాల్ స్లూయిస్ దశాబ్దమున్నర కాలంగా దుర్భరంగా మారింది. -
ఓటరు జాబితా పరిశీలనకు ప్రత్యేక అధికారి
[ 07-12-2023]
ఓటరు జాబితా సవరణకు సంబంధించి పరిశీలకులుగా జిల్లాకు పరిశ్రమల శాఖ కమిషనర్ యువరాజు రానున్నట్లు డీఆర్వో సత్తిబాబు తెలిపారు. -
రైల్వే మెము కార్షెడ్కు పురస్కారం
[ 07-12-2023]
రాజమహేంద్రవరంలోని దక్షిణ మధ్య రైల్వే మెము (మెయిన్ లైన్ ఎలక్ట్రికల్ మల్టీపుల్ యూనిట్) కార్షెడ్ ఉత్తమ నిర్వహణ విభాగంలో విశిష్ట రైల్ సేవా పురస్కార్-2023కి ఎంపికయ్యింది. -
రాజీ మార్గంలో కేసులు పరిష్కరించాలి
[ 07-12-2023]
రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగపరుచుకోవాలని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Bhimavaram: భీమవరంలో రేవంత్ వియ్యంకుడి ఇంట సందడి
-
ధవళేశ్వరం యువతికి ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు
-
నిజామాబాద్ బబ్లూను.. నిన్ను లేపేస్తా: డ్రంక్ అండ్ డ్రైవ్లో చిక్కిన మందుబాబు వీరంగం
-
Chicken Price: చికెన్ అగ్గువ.. గుడ్డు పిరం
-
Hyderabad: రేవంత్ ప్రమాణస్వీకారం.. నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
-
రైల్వేజోన్కు ఏపీ ప్రభుత్వం భూమి ఇవ్వలేదు: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్