స్థాయీ సంఘ సమావేశాల్లో సమస్యల ఏకరువు
జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలను ప్రజాప్రతినిధులు, అధికారులు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు కోరారు
మాట్లాడుతున్న ఛైర్మన్ వేణుగోపాలరావు, చిత్రంలో వైస్ఛైర్మన్లు, సీఈవో
కాకినాడ నగరం, న్యూస్టుడే: జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలను ప్రజాప్రతినిధులు, అధికారులు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు కోరారు. జడ్పీ సమావేశ మందిరంలో శనివారం ఏడు స్థాయీ సంఘాల సమావేశాలకు జడ్పీ ఛైర్మన్ వేణుగోపాలరావు, వైస్ఛైర్మన్లు బుర్రా అనుబాబు, మేరుగు పద్మలత, జడ్పీటీసీ సభ్యురాలు రొంగలి పద్మావతి అధ్యక్షత వహించారు. సమావేశంలో ఉపాధి హామీ, విద్య, వైద్యం, వ్యవసాయం, రోడ్లు, భవనాలు తదితర శాఖలపై సభ్యులు చర్చించారు. ఉపాధి హామీ, నాడు-నేడు పనుల్లో మండల అధికారులు ప్రొటోకాల్ పాటించడంలేదని రావుపాలెం, ఉప్పలగుప్తం సభ్యులు కుడిపూడి శ్రీనివాస్, గెడ్డం సంపదరావు సభ దృష్టికి తీసుకువచ్చారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాలలో డెంగీ, మలేరియా జ్వరాలు ప్రబలకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలని అయినవిల్లి సభ్యుడు గన్నవరపు శ్రీనివాసరావు తదితరులు అధికారులను కోరారు. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ నాడు-నేడు పనులు నత్తనడకన సాగుతున్నాయని రాజోలు సభ్యురాలు మట్టా శైలజ చెప్పారు. జగ్గంపేట సీహెచ్సీలో స్కానింగ్ మిషన్ పనిచేయకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారని సభ్యురాలు ఒమ్మి బింధుమాధవి ప్రస్తావించారు. ఆర్బీకే కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు సమయాల్లో తేమ పేరుతో రైతులను ఇబ్బందిపెడుతున్నారని పలువురు సభ్యులు ఫిర్యాదు చేశారు. ఎలుకల మందు సకాలంలో పంపిణీ చేసి పంట నష్టాన్ని నివారించాలని కోరారు. రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ పనులను పూర్తిచేయాలని విన్నవించారు. సభ్యులు లేవనెత్తిన ఆయా అంశాలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జడ్పీ ఛైర్మన్ వేణుగోపాలరావు సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.
మహిళా బిల్లుపై అభినందన తీర్మానం..
పార్లమెంట్ ఉభయ సభల్లో మహిళా బిల్లు ఆమోదంపై జడ్పీ తరఫున అభినందన తీర్మానాన్ని ఆమోదించారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేన్లు కల్పించేలా బిల్లు ఆమోదానికి కృషిచేసిన ప్రధాని మోదీ, సీఎం జగన్లకు ధన్యవాదాలు తెలిపారు. తీర్మానాన్ని జడ్పీ ఛైర్మన్ వేణుగోపాలరావు ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశంలో జడ్పీ సీఈవో ఎ.రమణారెడ్డి, డీఈవో జి.నాగమణి, బీసీ కార్పొరేషన్ ఈడీ సుబ్బలక్ష్మి, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ రమణమూర్తి, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి ఎస్.సూర్యప్రకాశరావు, ఐసీడీఎస్ పీడీ కె.ప్రవీణ, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధవళేశ్వరం యువతికి ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు
[ 07-12-2023]
ధవళేశ్వరం కొత్తవీధికి చెందిన అంబటి కీర్తినాయుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నోటిఫికేషన్లలో ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించుకున్నారు. -
ఇక ఏముందని.. కన్నీరే మిగిలిందని!
[ 07-12-2023]
తుపాను ధాటికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అతలాకుతలమైంది. ఈదురుగాలులు, వర్షాలకు తోడు మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి అపార నష్టం వాటిల్లింది. వరి పొలాలు చెరువులను తలపించాయి. -
చేతులు కాలాక.. ఆకులు పట్టుకుంటే ఎలా..!
[ 07-12-2023]
చేతులు కాలాక ఆకులుపట్టుకుంటే ప్రయోజనం ఏమిటి...? అధికార యంత్రాంగం పరిస్థితి అలాగే ఉంది. తుపాను కారణంగా కురిసిన కుండపోత వర్షానికి జిల్లాలో వేలాది ఎకరాల విస్తీర్ణంలో వరిపంట ముంపుబారినపడింది. -
తుపాను నష్టాలపై నివేదికలకు ఆదేశాలు
[ 07-12-2023]
తుపాను కారణంగా సంభవించిన నష్టాలను నమోదు చేసి నివేదికలు అందజేయాలని జిల్లా ప్రత్యేక అధికారి, సీఆర్డీఏ కమిషనర్ వివేక్యాదవ్, కలెక్టర్ మాధవీలత ఆదేశించారు. -
రైతుల ఆశలపై నీళ్లు
[ 07-12-2023]
మిగ్జాం తుపాను రైతులను నిండా ముంచేసింది. పంట చేతికొచ్చిన వేళ వారి ఆశలపై నీళ్లు చల్లింది. కళ్లెదుటే పంట వర్షార్పణమైంది. జిల్లాలో 12,053 హెక్టార్లలోని వ్యవసాయ, ఉద్యాన పంటలు తుపాను బారిన పడ్డాయి. -
పొంగిన కొవ్వాడ కాలువ
[ 07-12-2023]
తాళ్లపూడి మండలంలో మంగళవారం సాయంత్రం ప్రశాంతంగా ఉన్న కొవ్వాడ కాలువ బుధవారం తెల్లవారే సరికి పొంగింది. మంగళవారం అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కుండపోత వర్షం కురవడంతో కొండ, ఎగువ ప్రాంతాల నుంచి నీరు వచ్చి చేరింది. -
‘నియంత పాలనకు స్వస్తి పలకాలి’
[ 07-12-2023]
పల్లెలను నిలువు దోపిడీ చేస్తున్న నియంత పాలనకు స్వస్తి పలకాలని, వైకాపా ప్రభుత్వంలో సర్పంచులు ఉత్సవ విగ్రహాల్లా మారారని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు పాలడుగుల లక్ష్మణరావు అన్నారు. -
రాజకీయ పార్టీలు చురుకైన పాత్ర పోషించాలి
[ 07-12-2023]
జిల్లాలో 18-19 ఏళ్ల యువతను కొత్త ఓటర్లుగా నమోదు చేయించే విషయంలో రాజకీయ పార్టీలు చురుకైన పాత్ర పోషించాలని కలెక్టర్ మాధవీలత, జేసీ తేజ్భరత్, డీఆర్వో నరసింహులు సూచించారు. -
మొక్కుబడిగా ముగించేశారు..!
[ 07-12-2023]
కాకినాడ జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకుడిగా నియమితులైన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ ప్రధాన కార్యదర్శి ఎన్.యువరాజ్ జిల్లా పర్యటన తూతూమంత్రంగా సాగింది. -
లక్ష్యం నీరు గారుతోంది..!
[ 07-12-2023]
గాంధీనగర్ బాలభవన్ వద్ద రూ.50 లక్షల స్మార్ట్సిటీ నిధులతో నిర్మించిన షటిల్ ఇండోర్ స్టేడియంలోకి వర్షపు నీరు చేరుతోంది. మూడు రోజులుగా కురిసిన వర్షాలకు స్టేడియంలోని షటిల్ సింథటిక్ కోర్టుల్లోకి నీరు చేరి, క్రీడాకారులు అవస్థలు పడుతున్నారు. -
పంట నష్టంపై సమగ్ర సర్వే
[ 07-12-2023]
తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వాటిల్లిన పంట నష్టంపై సమగ్ర సర్వే నిర్వహించి బాధిత రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ జిల్లా అధికారి ఎన్.విజయ్కుమార్ చెప్పారు. -
కుప్పకూలేదాకా.. వేచి చూడాల్సిందేనా!
[ 07-12-2023]
వాడబోది మీడియం డ్రెయిన్ వైనతేయ నదిలో కలిసే చోట కుడి కరకట్ట మధ్యలో మామిడికుదురు మండలం ఆదుర్రు వద్ద ఉన్న అవుట్ఫాల్ స్లూయిస్ దశాబ్దమున్నర కాలంగా దుర్భరంగా మారింది. -
ఓటరు జాబితా పరిశీలనకు ప్రత్యేక అధికారి
[ 07-12-2023]
ఓటరు జాబితా సవరణకు సంబంధించి పరిశీలకులుగా జిల్లాకు పరిశ్రమల శాఖ కమిషనర్ యువరాజు రానున్నట్లు డీఆర్వో సత్తిబాబు తెలిపారు. -
రైల్వే మెము కార్షెడ్కు పురస్కారం
[ 07-12-2023]
రాజమహేంద్రవరంలోని దక్షిణ మధ్య రైల్వే మెము (మెయిన్ లైన్ ఎలక్ట్రికల్ మల్టీపుల్ యూనిట్) కార్షెడ్ ఉత్తమ నిర్వహణ విభాగంలో విశిష్ట రైల్ సేవా పురస్కార్-2023కి ఎంపికయ్యింది. -
రాజీ మార్గంలో కేసులు పరిష్కరించాలి
[ 07-12-2023]
రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగపరుచుకోవాలని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారం.. నగరానికి చేరుకున్న సోనియా, రాహుల్
-
Telangana New Ministers: తెలంగాణ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనుంది వీళ్లే..
-
Bapatla: ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఒక సిగ్గుమాలిన చర్య: చంద్రబాబు
-
Stock Market: నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 20,900 దిగువకు నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని.. దివ్యాంగురాలు రజినికి రేవంత్ ప్రత్యేక ఆహ్వానం