Andhra News: కైకలూరులో సైకో హల్చల్
ఆదివారం కైకలూరు పట్టణంలో ఓ సైకో హల్చల్ చేశాడు. రహదారిపై వెళ్తున్న పలువురిపై దాడి చేసేందుకు యత్నించి వారిని భయభ్రాంతులకు గురిచేశాడు.స్థానిక బస్టాండు సమీపంలో ఆటో ఎక్కేందుకు వెళ్తున్న ప్రయాణికులపై దాడికి ప్రయత్నించి, అక్కడ
సైకోను తాళ్లతో కట్టి పోలీస్స్టేషన్కు తరలిస్తున్న దృశ్యం
కైకలూరు, న్యూస్టుడే: ఆదివారం కైకలూరు పట్టణంలో ఓ సైకో హల్చల్ చేశాడు. రహదారిపై వెళ్తున్న పలువురిపై దాడి చేసేందుకు యత్నించి వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. స్థానిక బస్టాండు సమీపంలో ఆటో ఎక్కేందుకు వెళ్తున్న ప్రయాణికులపై దాడికి ప్రయత్నించి, అక్కడ ఆగి ఉన్న కారులోకి ప్రవేశించి దాన్ని తీసుకేళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. స్ధానికులు ధైర్యం చేసి అతనిని తాళ్లతో కట్టి ఆటోలో పోలీస్ స్టేషన్కు తరలించారు.అతన్ని కట్టడి చేసేందుకు పోలీసులు సైతం శ్రమించారు. పట్టణ పోలీసులు అతని వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో...సైకో ఒడిశా ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించి, అతనితో ఒరియాలో మాట్లాడి తల్లిదండ్రుల వివరాలను సేకరించి ఫోన్ ద్వారా వారికి సమాచారం అందజేశారు. ప్రథమ చికిత్స అనంతరం అతన్ని తల్లిదండ్రులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
వైకాపాకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ