మెట్ల మార్గం నిర్మాణానికి అనుమతివ్వండి
కోటప్పకొండపై అభివృద్ధికి అటవీశాఖ తరఫున సహకరించాలని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోరారు. నరసరావుపేటకు శనివారం వచ్చిన రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ చిరంజీవ్ చౌదరిని ఎమ్మెల్యే కలిసి మాట్లాడారు. కోటప్పకొండపై పాతకోటయ్య
అటవీశాఖ ఉన్నతాధికారితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి
నరసరావుపేట అర్బన్, న్యూస్టుడే: కోటప్పకొండపై అభివృద్ధికి అటవీశాఖ తరఫున సహకరించాలని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోరారు. నరసరావుపేటకు శనివారం వచ్చిన రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ చిరంజీవ్ చౌదరిని ఎమ్మెల్యే కలిసి మాట్లాడారు. కోటప్పకొండపై పాతకోటయ్య స్వామిని దర్శించుకునేందుకు మెట్ల మార్గం నిర్మించేందుకు అనుమతించాలని కోరినట్లు చెప్పారు. కాలిబాటకు మాత్రమే అవకాశం ఉందని భక్తుల కోరిక మేరకు మెట్ల మార్గాన్ని తొమ్మిది అడుగుల వెడల్పుగా నిర్మాణం చేయాలని సంకల్పించినట్లు పేర్కొన్నారు. ఇందుకు తితిదే రూ.3.5కోట్ల నిధులు మంజూరు చేసేందుకు అంగీకరించినట్లు తెలిపారు. దీనిపై అధికారి స్పందిస్తూ పరిశీలించి అనుమతులు ఇస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం