logo

ప్రధానోపాధ్యాయినిపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు

పాఠశాల నిర్వహణలో లోపాలను ఎత్తి చూపినందుకు ప్రధానోపాధ్యాయిని నాగలక్ష్మి, తమపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈమేరకు శనివారం ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును

Published : 05 Dec 2021 01:21 IST


బొల్లా బ్రహ్మనాయుడుకు వినతి పత్రం అందజేస్తున్న ఉపాధ్యాయులు

వినుకొండ, న్యూస్‌టుడే: పాఠశాల నిర్వహణలో లోపాలను ఎత్తి చూపినందుకు ప్రధానోపాధ్యాయిని నాగలక్ష్మి, తమపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈమేరకు శనివారం ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. లోపాలపై ఆమెను ప్రశ్నించినందుకు తమపై కక్ష కట్టి వేతనాలు ఆపడం, సర్వీసు రిజిస్టర్‌లో ఎంట్రీలు నమోదు చేయకుండా ఆపడం, సెలవులు మంజూరు చేయకుండా తమను మానసికంగా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే పాఠశాలను సందర్శించి వసతులపై ఆరా తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని