logo

తాగడానికి డబ్బివ్వలేదని తల్లినే పొట్టనపెట్టుకున్నాడు..!

మద్యానికి బానిసైన ఆ కుమారుడు తాగడానికి డబ్బులివ్వలేదని కన్న తల్లినే హత్యచేశాడని బాపట్ల డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు చెప్పారు. శనివారం పొన్నూరు గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కాకుమాను

Published : 05 Dec 2021 01:21 IST


వివరాలు వెల్లడిస్తున్న బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు

పొన్నూరు, న్యూస్‌టుడే: మద్యానికి బానిసైన ఆ కుమారుడు తాగడానికి డబ్బులివ్వలేదని కన్న తల్లినే హత్యచేశాడని బాపట్ల డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు చెప్పారు. శనివారం పొన్నూరు గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కాకుమాను మండలం, వల్లూరుకు చెందిన ఈమని ప్రభాకరరెడ్డి మద్యం తాగేందుకు డబ్బివ్వాలంటూ తరచూ తల్లి సీతామహాలక్ష్మిని వేధించేవాడు. ఈనెల 2న కూడా ఆమెను పైకమివ్వాలని ఒత్తిడితెచ్చి, ఆమె ఇవ్వక పోవడంతో కోపంతో రగిలిపోయాడు. నిద్రిస్తున్న ఆమె తలపై రోకలిబండతో కొట్టి హత్య చేశాడు. పొన్నూరు గ్రామీణ సీఐ అలహరి శ్రీనివాస్‌, కాకుమాను ఎస్‌ఐ రవీంద్రబాబులు నిందితుడ్ని అదుపులోకి తీసుకొని, నిందితుడిని కోర్టుకు హాజరు పర్చినట్టు డీఎస్పీ వెల్లడించారు. కేసును త్వరితగతిన ఛేదించిన సీఐ, ఎస్‌ఐ, సిబ్బందిని ఆయన అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని