ముందే మేల్కొందాం
దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ అత్యంత ప్రమాదకారిగా మారే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఇప్పటికే బెంగళూరులో రెండు, హైదరాబాదులో ఒకటి చొప్పున పాజిటివ్ కేసులు నమోదు కావటంతోపాటు
రైల్వే స్టేషన్లో మాస్క్ లేకుండా ప్రయాణికులు
రేపల్లె అర్బన్, బాపట్ల, న్యూస్టుడే ప్రస్తుతం కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో ప్రజలు మాత్రం కరోనాను దాదాపు మర్చిపోయి కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. రహదారులపై విచ్చలవిడిగా తిరుగుతున్నారు. రైతు బజార్లు, కూరగాయలు, మాసం, చేపల మార్కెట్లు, షాపింగ్ మాల్స్, థియేటర్లు, నిత్యావసర వస్తువుల దుకాణాల వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడుతున్నారు. శానిటైజర్ వినియోగమే మర్చిపోయారు. సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శుభకార్యాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.
పరిమితికి మించి ప్రయాణం
కరోనా ప్రభావం పూర్తిగా తగ్గకపోయినా వాహనాల్లో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. ఆటోలు.. ఆర్టీసీ బస్సుల్లోనూ నిబంధనలు అమలు కావటం లేదు. వాహనాల లోపల శానిటైజ్ చేయడం క్రమంగా మరిచారు. వైరస్ వ్యాప్తి తగ్గిందని ఎవరికి వారు ఖర్చేందుకులే అని నిర్లక్ష్యం వహిస్తున్నారు. రైళ్లలో ప్రయాణించే వారు సైతం మాస్క్లు పెట్టడం లేదు. రహదారులపై తిరిగే వాహన చోదకులు మాస్క్ ధరించకుంటే అపరాధ రుసుం విధించే అధికారులు కార్యాలయాలకు పరిమితమయ్యారు.
స్వీయ మార్పుతోనే నివారణ
చాపకింద నీరుగా కొత్త వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో ప్రజలే చైతన్యవంతులు కావాలి. ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించి భౌతికదూరం పాటించాలి. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు అవసరం మేరకు శానిటైజర్లు వినియోగించాలి. కిక్కిరిసిన వాహనాల్లో పయనించకుండా కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రాణం కంటే విలువైంది ఏదీ లేదని గ్రహించి ఆరోగ్యం కాపాడుకోవాలి. రెండో దశ తీవ్రత.. జరిగిన నష్టాన్ని గుర్తుంచుకుని వ్యవహరించాలి. తమతోనే మార్పు ప్రారంభం కావాలని ఎవరికి వారు అనుకుంటే కరోనా దరిచేరదని నిపుణులు పేర్కొంటున్నారు.
వ్యాధి నిర్ధారణ పరీక్షలు పెంచితేనే..
ఒమిక్రాన్ ముప్పు నేపథ్యంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు గణనీయంగా పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. యాంటీజెన్, ర్యాపిడ్ కిట్ల కొరతతో జిల్లాలో నామమాత్రంగా పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్, తెనాలి, నరసరావుపేట ఏరియా ఆసుపత్రుల్లో మాత్రమే నిత్యం పరీక్షలు చేస్తున్నారు. గతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సరఫరా చేసిన కిట్లు ఉంటే అనుమానితులకు పరీక్షలు చేస్తున్నారు. కొత్త వైరస్ దృష్ట్యా గతంలో మాదిరిగా అన్ని ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు చేసేలా ఉన్నతాధికారులు తక్షణం చర్యలు తీసుకోవాల్సి ఉంది.
జిల్లాలో తాజా ఇదీ పరిస్థితి
నెల పరీక్షలు పాజిటివ్ కేసులు
సెప్టెంబరు 1.72 లక్షలు 3,472
అక్టోబరు 1.02 లక్షలు 2,093
నవంబరు 75,000 797
అన్ని పీహెచ్సీలకు కిట్లు
కరోనా కొత్త వేరియంట్ దృష్ట్యా జిల్లాలోని అన్ని సామాజిక, ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేలా సన్నాహాలు చేస్తున్నాం. అవసరమైన ర్యాపిడ్, యాంటీజెన్ కిట్లు ఒకట్రెండు రోజుల్లో ఆయా కేంద్రాలకు అందజేస్తాం. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి తప్పనిసరిగా పరీక్షలు చేయించేలా చర్యలు తీసుకున్నాం. వైరస్ దరిచేరకుండా ప్రజలు బాధ్యతగా భౌతికదూరం పాటించి మాస్క్ ధరించాలి. కరోనా టీకా వేయించుకోవాలి.
- యాస్మిన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళలను ఆదుకునేందుకే సూపర్ -6 పథకాలు: నారా బ్రాహ్మణి
[ 20-04-2024]
రాష్ట్ర ప్రజల కోసం తెదేపా అధినేత చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని, ఈ విషయంలో ఆయనకు ఎవరూ సాటిరారని నారా బ్రాహ్మణి అన్నారు. -
వంతెనలు కూలుతున్నా.. ప్రాణాలు పోతున్నా.. కళ్లకు గంతలేనా..
[ 20-04-2024]
బీటలు వారిన పిల్లర్లు.. పడిపోయిన రెయిలింగ్లు.. కూలిన పిట్టగోడలు.. తుప్పుపట్టి బయటకు కనిపిస్తున్న ఇనుప చువ్వలు, వంతెనలపైనే గోతులు.. ఇలా శిథిలావస్థకు చేరిన వారధులు జిల్లాలో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కీలకమైన వంతెనల జీవితకాలం ముగిసినా నిధుల కొరతతో కొత్తవి నిర్మించడం లేదు. -
అ‘తీగ’తిలేని ‘మార్గం’
[ 20-04-2024]
ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఏదైనా తెదేపా ప్రభుత్వం ప్రారంభించినది అయితే పూర్తి చేయం. అవసరమైతే పనికిరాకుండా చేస్తాం ఇది జగన్ సర్కారు ఐదేళ్లుగా అవలంభిస్తున్న తీరు. -
కూలేదాకా.. కళ్లప్పగిస్తారా!
[ 20-04-2024]
బీటలు వారిన స్తంభాలు.. పడిపోయిన రెయిలింగ్లు.. కూలిన పిట్టగోడలు.. తుప్పుపట్టి బయటకు కనిపిస్తున్న ఇనుప చువ్వలు, వంతెనలపైనే గోతులు.. ఇలా శిథిలావస్థకు చేరిన వారథులు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రమాదాలకు కారణమవుతున్నాయి -
ఉడకని జీడిపప్పు
[ 20-04-2024]
వేటపాలెం అంటేనే జీడిపప్పు పరిశ్రమకు పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో వ్యాపారులు ఒకప్పుడు స్థానికంగా దొరికే జీడిపిక్కలను కొనుగోలు చేసి వాటిని కాల్చి పప్పుగా తయారు చేసి విక్రయించేవారు. -
నేరచరిత్ర లేని సచ్ఛీలుడు తెన్నేటి
[ 20-04-2024]
బాపట్ల లోక్సభ స్థానం తెదేపా ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ తనకు రూ.15.93 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు శుక్రవారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో ప్రకటించారు -
మందులో ముంచేసి.. పీల్చి పిప్పి చేసి..
[ 20-04-2024]
రాష్ట్రంలో దశల వారీగా మద్యపాన నిషేధం విధిస్తాం. మూడు విడతల్లో మద్యం దుకాణాలు తగ్గించుకుంటూ వెళ్లి పూర్తిగా ఎత్తేస్తాం. మందు ముట్టుకోవాలంటేనే షాక్ కొట్టేలా ధరలు పెంచుతాం. మద్యపాన నిషేధం చేశాకే 2024లో ఓట్లు అడగడానికి వస్తాను. -
ఎంపీ 1, ఎమ్మెల్యేకు 19 నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. రెండో రోజున గుంటూరు పార్లమెంట్ స్థానానికి కిలారి వెంకటరోశయ్య వైకాపా తరఫున నామినేషన్ను దాఖలు చేశారు -
కొనసాగుతున్న ఒత్తిళ్లతో వాలంటీర్ల రాజీనామా
[ 20-04-2024]
ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమానులో 20 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు పంచాయతీ కార్యదర్శి పూర్ణచంద్రరావు తెలిపారు. -
అట్టహాసంగా శ్రావణ్కుమార్ నామినేషన్
[ 20-04-2024]
తాడికొండ నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ శుక్రవారం తాడికొండ ఆర్వో గంగరాజుకు నామినేషన్ పత్రాలు అందజేశారు -
ఎన్నికల వేళా.. ఆగని దోపిడీ
[ 20-04-2024]
అధికారం అండగా ఉందని ఏం చేసినా అడ్డుకునేవారు లేరని వైకాపా నేతలు బరితెగించారు. కృష్ణానదిలో రాత్రివేళ అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేస్తూ తరలించి జేబులు నింపుకొంటున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా వారికి అడ్డంకి లేకుండా పోయింది. -
ఏళ్లుగా ఉద్యోగులకు శిక్షే
[ 20-04-2024]
అనేక సంస్కరణలు తీసుకొచ్చామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే సీఎం జగన్ మాటలు ఎండమావులుగానే మిగిలిపోతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు సమగ్ర శిక్షాలో పని చేస్తున్న ఉద్యోగులకు ఎంటీఎస్, హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తామని.. పలు హామీలు ఇచ్చి వాటిని గాలికొదిలేశారు. -
తాగునీరివ్వకపోతే బతికేదెలా..?
[ 20-04-2024]
తమకు తాగునీటిని కుళాయిల ద్వారా సరఫరా చేయడం లేదని ప్రత్తిపాడులోని మహబూబ్ నగర్ కాలనీ వాసులు శుక్రవారం గుంటూరు- పర్చూరు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. -
విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంతో జేఎల్ఎం మృతి
[ 20-04-2024]
విద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా జేఎల్ఎం (జూనియర్ లైన్మెన్) మృతి చెందిన ఘటన ఇది. విద్యుత్తు శాఖ ఉద్యోగులు, బాధితుల కథనం ప్రకారం... పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురానికి చెందిన అడుసుమల్లి సుబ్రహ్మణ్యం, చిలకమ్మ దంపతుల పెద్దకుమారుడు రాజేశ్ (27) ఇదే గ్రామంలో జేఎల్ఎంగా పనిచేస్తున్నారు. -
కలగా మినీ రైతుబజార్లు
[ 20-04-2024]
నాడు అలా...గత ప్రభుత్వంలో వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన కూరగాయలు అందించేందుకు 2018లో పొన్నూరు పట్టణం నిడుబ్రోలు రైల్వేస్టేషన్కు వెళ్లే మార్గంలో రైతుబజార్ను అందుబాటులోకి తెచ్చారు. ఆ రైతుబజార్లో 22 దుకాణాలను ఏర్పాటు చేశారు. -
ఓటు హక్కు వినియోగానికి కార్మికులకు సెలవు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో మే 13న జరగనున్న పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి కార్మికులకు సెలవు ప్రకటించినట్లు మూడో జోన్ కార్మిక శాఖ ఇన్ఛార్జి సంయుక్త కమిషనర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు -
మద్యం మత్తు.. కుటుంబాలు చిత్తు
[ 20-04-2024]
గత నెల 18వ తేదీన తెనాలి మున్సిపల్ కార్యాలయం చెంతనే నిర్మాణంలో ఉన్న మార్కెట్ భవంతిలో రవికిరణ్ (37) అనే వ్యక్తి సజీవ దహనమయ్యాడు. కారణం మద్యం మత్తు. మద్యం తాగి చెంతనే దోమల కాయిల్ వెలిగించుకుని నిద్రపోయిన అభాగ్యుడు కాయిల్ దుప్పటికి తగిలి మంటలు చెలరేగినా మత్తు వల్ల లేవలేక కాలిపోయాడు
తాజా వార్తలు (Latest News)
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
ప్రజలు బెంజ్ కారు అడగట్లేదు కదా!.. ఎన్నికలపై విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్రెడ్డి
-
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?