అన్నదాతకు అండగా నాబార్డు
రైతులు తమ పంట ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు అవసరమైన గిడ్డంగులు, శీతల గిడ్డంగుల నిర్మాణానికి కేంద్రం బ్యాంకు రుణాలపై మూడు శాతం రాయితీ ఇస్తుందని ఏపీ నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ సుధీర్కుమార్ జన్నావర్ అన్నారు.
వట్టిచెరుకూరు, న్యూస్టుడే: రైతులు తమ పంట ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు అవసరమైన గిడ్డంగులు, శీతల గిడ్డంగుల నిర్మాణానికి కేంద్రం బ్యాంకు రుణాలపై మూడు శాతం రాయితీ ఇస్తుందని ఏపీ నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ సుధీర్కుమార్ జన్నావర్ అన్నారు. ఆయన సోమవారం రైతునేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావుతో కలిసి కొర్నెపాడులోని రైతు శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా విరివిగా రుణాలు ఇవ్వడం జరుగుతోందన్నారు. విజయవాడలో 31 నుంచి వచ్చే ఏడాది జనవరి 9 వరకు అమరావతి మేళా పేరుతో వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన ఉంటుందన్నారు. మేళాలో కర్షకులు స్టాల్స్ ఏర్పాటు చేసుకొని తమ పంటలు, ఉప ఉత్పత్తులను ప్రదర్శించుకోవచ్చన్నారు. ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంతో పండించిన కారం, పసుపులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుందన్నారు. అంతకుముందు వెంకటేశ్వరరావు ఆయనకు శిక్షణ కేంద్రంలో పెంచుతున్న 28 రకాల గోవులను చూపించి వాటి ప్రాముఖ్యతను వివరించారు. సుధీర్కుమార్ వెంట గుంటూరు ఏజీఎం కేఆర్డీ కార్తిక్, జీఎంలు నగేష్కుమార్, రమేష్బాబు, కృష్ణా జిల్లా ఏజీఎం విజయ్ తురిమెళ్ల తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని