ర్యాంకుల పంట పండిస్తున్నారు
వ్యవసాయ విద్యలోనూ తామేమి తక్కువ కాదని అమ్మాయిలు నిరూపిస్తున్నారు. కష్టపడి చదివి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించి భళా అనిపిస్తున్నారు. ఏజీ ఎమ్మెస్సీలో ప్రవేశం కోసం భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) నిర్వహించిన ఏఐఈఈఏపీజీ పరీక్షలో ఫిజికల్ సైన్సెస్ విభాగంలో
జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ
వ్యవసాయ విద్యలో రాణిస్తున్న విద్యార్థినులు
బాపట్ల, న్యూస్టుడే వ్యవసాయ విద్యలోనూ తామేమి తక్కువ కాదని అమ్మాయిలు నిరూపిస్తున్నారు. కష్టపడి చదివి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించి భళా అనిపిస్తున్నారు. ఏజీ ఎమ్మెస్సీలో ప్రవేశం కోసం భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) నిర్వహించిన ఏఐఈఈఏపీజీ పరీక్షలో ఫిజికల్ సైన్సెస్ విభాగంలో బాపట్లకు చెందిన విద్యార్థిని ఆలపాటి నైమిషా జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు కైవసం చేసుకుని సత్తా చాటింది. మరో విద్యార్థిని ఈరే విద్యామాధురి పదో ర్యాంకు సాధించి మెరిసింది. వ్యవసాయ ఇంజినీరింగ్ పీహెచ్డీ ప్రవేశ పరీక్షలో విద్యార్థిని నాగవరపు అనూష అఖిల భారత స్థాయిలో 26వ ర్యాంకు కైవసం చేసుకుని తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచింది. వీరు కొత్త దిల్లీలోని ప్రతిష్ఠాత్మక అఖిల భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ(ఐఏఆర్ఐ)లో ఎమ్మెస్సీ సీటు సంపాదించారు. భవిష్యత్తులో శాస్త్రవేత్తగా ఎదిగి.. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కార మార్గాలు చూపి.. అన్నదాతల ఆదాయం పెంచి సాగును లాభసాటిగా తీర్చిదిద్దుతామని విద్యార్థినులు చెబుతున్నారు.
యాంత్రీకరణ కొత్త పుంతలు తొక్కించాలని..
బాపట్లకు చెందిన నాగవరపు అనూష తండ్రి నాగవరపు కృష్ణమూర్తి వ్యాపారి. బాపట్ల వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాలలో ఏజీ బీటెక్ను 90 శాతం మార్కులతో పూర్తి చేసింది. ప్రస్తుతం ఎంటెక్ చదవుతోంది. ఏజీ ఎంటెక్లోనూ 9 జీపీఏ సాధించింది. ఏజీ ఇంజినీరింగ్ పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ప్రతిభ చాటి జాతీయ స్థాయిలో 26వ ర్యాంకు సాధించింది. కోర్సు పూర్తి చేసి శాస్త్రవేత్తగా ఎదిగి చిన్న, సన్నకారు రైతులు అన్ని పంటల సాగుకు ఉపయోగించేలా ఆధునిక యంత్ర పరికరాలు రూపొందించి.. వ్యవసాయ యాంత్రీకరణనను కొత్త పుంతలు తొక్కిస్తానని అనూష తెలిపింది.
సాగులో సవాళ్లను స్వయంగా చూసి..
విశాఖ జిల్లా తాళ్లపాళేనికి చెందిన ఈరే విద్యామాధురి తండ్రి నూకరాజు రైతు. తల్లి గంగాయమ్మ గృహిణి. రైతు బిడ్డగా పంటల సాగులో ఎదుర్కొంటున్న సమస్యలు స్వయంగా చూసింది. బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఏజీ బీఎస్సీ నాలుగేళ్ల కోర్సులో కష్టపడి చదివింది. క్షేత్రస్థాయికి వెళ్లి పంట భూముల్లో రైతులతో కలిసి పనిచేసింది. ఏజీ బీఎస్సీలో 8.22 జీపీఏ సాధించింది. పీజీ పరీక్షలో ఎంటమాలజీ, నెమటాలజీ విభాగంలో జాతీయ స్థాయిలో పదో ర్యాంకు కైవసం చేసుకుని సత్తా చాటింది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కు ఎంపికైంది. పీజీ అనంతరం శాస్త్రవేత్తగా ఎదిగి తెగుళ్లు, పురుగులను సమర్థంగా తట్టుకునేలా కొత్త వంగడాలు అభివృద్ద్ధి చేస్తానని విద్యామాధురి తెలిపింది.
పాఠశాల స్థాయి నుంచి ప్రతిభ
బాపట్లకు చెందిన ఆలపాటి నైమిషా పాఠశాల దశ నుంచే ప్రతిభావంతురాలైన విద్యార్థినిగా పేరు తెచ్చుకుంది. తల్లి సురేఖ తెలుగు ఉపాధ్యాయిని, తండ్రి వెంకటేశ్వర్లు వాణిజ్య శాస్త్ర అధ్యాపకుడు. నైమిషా ఇంటర్ బైపీసీలో 991 మార్కులు సాధించి రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. వ్యవసాయ విద్యపై మక్కువతో బాపట్ల ఏజీ కళాశాలలో బీఎస్సీ కోర్సులో చేరింది. రైతులతో కలిసి పొలాల్లో పనిచేసి వరి, వేరుశనగ, కూరగాయల పంటల్లో సమగ్ర పోషక యాజమాన్య, సస్యరక్షణ పద్ధతులు అవలంబించడం ద్వారా అధిక దిగుబడులు సాధించేలా ప్రోత్సహించింది. ఏజీ బీఎస్సీలో జీపీఏ 9.41 సాధించి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉత్తమ విద్యార్థినిగా పురస్కారం అందుకుంది. పీజీ ప్రవేశ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించి ఫిజికల్ సైన్సెస్ విభాగంలో ప్రథమ ర్యాంకు కైవసం చేసుకుంది. ఐసీఏఆర్ నుంచి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కు ఎంపికైంది. ప్రతినెలా రూ.12,640 ప్రతిభా ఉపకార వేతనం అందుకోనుంది. దేశంలో అగ్రగామి సంస్థ ఐఏఆర్ఐలో ఏజీ ఎమ్మెస్సీ కోర్సులో సీటు సంపాదించింది. పీజీ, పీహెచ్డీ పూర్తి చేసి మృత్తికా శాస్త్రం, వ్యవసాయ ఇంజినీరింగ్లో శాస్త్రవేత్తగా ఎదిగి వ్యవసాయ రంగాభివృద్ధికి కృషి చేస్తానని నైమిషా పేర్కొంది.
అన్నదాతకు అండగా నాబార్డు
వట్టిచెరుకూరు, న్యూస్టుడే: రైతులు తమ పంట ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు అవసరమైన గిడ్డంగులు, శీతల గిడ్డంగుల నిర్మాణానికి కేంద్రం బ్యాంకు రుణాలపై మూడు శాతం రాయితీ ఇస్తుందని ఏపీ నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ సుధీర్కుమార్ జన్నావర్ అన్నారు. ఆయన సోమవారం రైతునేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావుతో కలిసి కొర్నెపాడులోని రైతు శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా విరివిగా రుణాలు ఇవ్వడం జరుగుతోందన్నారు. విజయవాడలో 31 నుంచి వచ్చే ఏడాది జనవరి 9 వరకు అమరావతి మేళా పేరుతో వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన ఉంటుందన్నారు. మేళాలో కర్షకులు స్టాల్స్ ఏర్పాటు చేసుకొని తమ పంటలు, ఉప ఉత్పత్తులను ప్రదర్శించుకోవచ్చన్నారు. ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంతో పండించిన కారం, పసుపులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుందన్నారు. అంతకుముందు వెంకటేశ్వరరావు ఆయనకు శిక్షణ కేంద్రంలో పెంచుతున్న 28 రకాల గోవులను చూపించి వాటి ప్రాముఖ్యతను వివరించారు. సుధీర్కుమార్ వెంట గుంటూరు ఏజీఎం కేఆర్డీ కార్తిక్, జీఎంలు నగేష్కుమార్, రమేష్బాబు, కృష్ణా జిల్లా ఏజీఎం విజయ్ తురిమెళ్ల తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ రాజీనామా
[ 23-04-2024]
వైకాపాకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ చిరంజీవి రెడ్డి రాజీనామా చేశారు. -
జగనన్న సమర్పించు.. గోతుల రాజ్యం!
[ 23-04-2024]
జగనన్న పాపాలు ఎన్నని చెప్పేది.. ఎందెందు వెతికినా.. అన్నింటా లోపాలే.. అన్నిచోట్లా అసమర్థ పాలనే! రోడ్లను చూడండి... రాళ్లు తేలి.. గుంతలు పడి... బీటలువారి.. కనీసం ద్విచక్ర వాహనమైనా ముందుకు కదల్లేని దుస్థితి. -
పదిలో పైచేయి అమ్మాయిలదే
[ 23-04-2024]
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా విద్యార్థులు 88.19 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో బాలికల హవా స్పష్టంగా కనిపించింది. బాలికలు 90.1 శాతం ఉత్తీర్ణులు కాగా, బాలురు 86.32 శాతం ఉత్తీర్ణులయ్యారు. -
అమ్మఒడి సాయంలో మామ కోతలు
[ 23-04-2024]
ప్రజాధనాన్ని పేదలకు పంచుతుంటే విపక్షాలకు ఎందుకంత కడుపుమంట? వారి సంక్షేమానికి ప్రజాధనం వెచ్చించటం తప్పేనా అంటూ బహిరంగసభల్లో బీరాలు పలికే జగన్ ఆ పంపిణీ మాటునే తిరిగి దోచుకుంటున్నారు. -
మురుగున పడ్డ డబ్బులెక్కడ.. మామ?
[ 23-04-2024]
భట్టిప్రోలు మండలం ఐలవరం ఉన్నతపాఠశాలలో 400 మంది విద్యార్థులు విద్యా బుద్ధులు నేర్చుకుంటున్నారు. వీరికి పాఠశాలలో రెండు మరుగుదొడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. -
సమర్థ్ యాప్తో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమయంలో పోలీసుశాఖ సమర్థంగా విధులు నిర్వర్తించేలా వేగవంతమైన పోలీసు సేవల కోసం కొత్తగా సమర్థ్ మొబైల్ యాప్ను రూపొందించినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. -
ఉప్పొంగిన ప్రజాభిమానం
[ 23-04-2024]
ప్రజాభిమానం ఉప్పొంగింది. వైకాపా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో జనం కసితో కదిలి కదం తొక్కారు. తెలుగుదేశం, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ముందుకు సాగారు. ఆ ప్రాంతమంతా పసుపు, తెలుపు, కాషాయ వర్ణాలమయమైంది. ఎమ్మార్పీస్ దండు సైతం వారి జెండాలతో కదిలారు. -
అలా..చతికిలపది!
[ 23-04-2024]
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా ర్యాంకు గతేడాది కంటే 10 స్థానాలు దిగజారి వెనుకబడింది. 2022- 23 సంవత్సరంలో జిల్లా ఆరో స్థానంలో నిలవగా ఈ ఏడాది 16వ స్థానానికి దిగజారింది. -
జోరుగా నామినేషన్లు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. గుంటూరు పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. -
పని భారం పెంచేశారు.. పోస్టులు భర్తీ చేయరు..
[ 23-04-2024]
జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయం: ఇక్కడ ఐదు పోస్టులే ఉన్నాయి. అందులో ఒక సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సబార్డినేట్, డేటా ఎంట్రీ ఆపరేటర్. -
రూ.46 కోట్లు నష్టపోయాం
[ 23-04-2024]
గుంటూరు సర్వజనాసుపత్రిలో ఆరోగ్యశ్రీ కేసుల నమోదు ప్రక్రియలో సరైన కోణంలో పని చేయనందున ఆసుపత్రికి రావాల్సిన సుమారు రూ.46 కోట్లు ఆర్థికంగా నష్టపోయామని సూపరిôటెండెంట్ కిరణ్కుమార్ తెలిపారు. -
వసతి గృహ విద్యార్థుల ఉత్తీర్ణత మెరుగు
[ 23-04-2024]
జిల్లాలోని సంక్షేమ శాఖల వసతి గృహాల్లో ఉండి పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఎక్కువ మంది ఉత్తీర్ణులయ్యారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల నుంచి 93 మంది పరీక్షలకు హాజరు కాగా 76 మంది ఉత్తీర్ణులయ్యారు. -
స్పందించేందుకు ఇప్పుడు సమయం దొరికిందా..?
[ 23-04-2024]
రాజధాని అమరావతి శంకుస్థాపన ప్రాంతంలో నమూనా గ్యాలరీ ధ్వంసంపై సీఆర్డీఏ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. -
‘మంగళగిరి రూపురేఖలు మారుస్తాం’
[ 23-04-2024]
ముఖ్యమంత్రి జగన్ మాదిరిగా తాము శవ రాజకీయాలు చేయమని యువనేత, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ అన్నారు. -
ప్రత్తిపాడును అగ్రగామిగా నిలుపుతా: బూర్ల
[ 23-04-2024]
నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలుపుతానని ప్రత్తిపాడు కూటమి అభ్యర్థి డాక్టరు బూర్ల రామాంజనేయులు హామీ ఇచ్చారు. సోమవారం ఆయన నామినేషన్ దాఖలు కార్యక్రమం విజయోత్సవాన్ని తలపించింది. -
మేలు సంగతి తర్వాత.. ముందు నీళ్లివ్వండి
[ 23-04-2024]
‘మేం అధికారంలోకి రాగానే ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి చిరునామాగా మారుస్తాం. సకల సౌకర్యాలు కల్పించి ప్రజల కష్టాలు తీరుస్తాం.’ ఇవీ వైకాపా నేతలు సమయం చిక్కినప్పుడల్లా ప్రజలకు ఇచ్చిన హామీలు.‘ -
పదిలో పెరిగిన ఉత్తీర్ణత
[ 23-04-2024]
పదోతరగతి పరీక్షల్లో పల్నాడు జిల్లా విద్యార్థులు నిరుటి కంటే 16 శాతం అదనంగా ఉత్తీర్ణత సాధించారు. కాగా రాష్ట్రస్థాయిలో జిల్లా 18వ స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 24959 మందికి గాను 21477 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. -
వివాదాల అగ్గిరాజేస్తున్న వైకాపా
[ 23-04-2024]
‘అగ్గి’రాజేస్తూ వివాదాలకు వైకాపా నాయకులు కాలుదువ్వుతున్నారు. మాచర్ల, గురజాలను మించిపోయేలా పెదకూరపాడులో ఇటీవల వరుస ఘటనలు భయకంపితులను చేస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా