దారి కాచి.. దోచేస్తున్నారు
యడ్లపాడు మండలంలో వరుస దారి దోపిడీలతో జనం భయాందోళన చెందుతున్నారు. సోమవారం రాత్రి బోయపాలెం- లింగారావుపాలెం మార్గంలో రెండు ద్విచక్ర వాహనాలపై వెళుతున్న దంపతులపై దారి కాచి దాడి చేసి నగదు, ఆభరణాలు దోచుకున్నారు.
యడ్లపాడులో ఆందోళన కలిగిస్తున్న వరుస సంఘటనలు
యడ్లపాడు, న్యూస్టుడే: యడ్లపాడు మండలంలో వరుస దారి దోపిడీలతో జనం భయాందోళన చెందుతున్నారు. సోమవారం రాత్రి బోయపాలెం- లింగారావుపాలెం మార్గంలో రెండు ద్విచక్ర వాహనాలపై వెళుతున్న దంపతులపై దారి కాచి దాడి చేసి నగదు, ఆభరణాలు దోచుకున్నారు. మంగళవారం కూడా అదే తరహాలో చెంఘీజ్ఖాన్- కొత్తసొలస మార్గంలో ద్విచక్ర వాహనాలపై వెళుతున్న తల్లీకుమారుడు, అత్తా అల్లుడిపై దాడి చేసి నగదు, ఆభరణాలు దోచుకున్నారు. కొత్తసొలసకు చెందిన సాగి నాగలక్షి, ఆమె కుమారుడు ధనుష్ మంగళవారం గ్రామ సమీపంలోని తమ కోళ్లఫారం వద్దకు వెళ్లి పనులు ముగించుకుని రాత్రి 9 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. కొద్దిదూరం రాగానే మాస్కులు, టోపీలు ధరించిన ఆరుగులు యువకులు కర్రలు చూపించి అడ్డగించారు. ద్విచక్ర వాహనంతో సహా బాధితులను ముందుగానే పక్కనున్న పత్తిచేలోకి బలవంతంగా తీసుకువెళ్లి తీవ్రంగా కొట్టారు. నాగలక్ష్మి మెడలోని 3.75 సవర్ల బంగారు గొలుసు, చెవిపోగులు, వెండి పట్టీలు, ఉంగరం లాక్కున్నారు. కొద్దిసేపటికి ఆ మార్గంలో అదే గ్రామానికి చెందిన పొనుగుబాటి వీరాంజనేయులు ఫిరంగిపురం సమీపంలోని తాళ్లూరులో ఉన్న తన అత్త గోరంట్ల అంజమ్మను ద్విచక్ర వాహనంపై ఎక్కించుని ఇంటికి వస్తున్నాడు. రోడ్డు పక్కనే తన పొలంలో ఉన్న పత్తిబస్తాను ద్విచక్ర వాహనంపై పెట్టుకోవటానికి వాహనాన్ని ఆపాడు. దుండగులు అక్కడికి వచ్చి వాహనంతో సహా ఇద్దరిని పొలాల్లోకి తీసుకెళ్లారు. అనంతరం వారిని తీవ్రంగా కొట్టి అంజమ్మ వద్ద ఉన్న చెవి కమ్మలు, ముక్కు పుడక, సెల్ఫోన్, రూ.1500 నగదు లాక్కున్నారు. వారి వద్ద ఉన్న తినుబండారాలను సైతం లాక్కున్నారు. సమాచారం అందుకున్న పోలీసులతో పాటు గ్రామస్థులు సంఘటనా స్థలానికి వెళ్లేసరికి దుండగులు జాడ కనిపించలేదు. సంఘటనా స్థలాన్ని నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కరరావు, చిలకలూరిపేట గ్రామీణ సీఐ సుబ్బారావు, యడ్లపాడు ఎస్సై రాంబాబు సందర్శించారు. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్టీం వచ్చి సాక్ష్యాధారాలను సేకరించింది. నిందితులను పట్టుకోవటానికి ప్రత్యేక పోలీసులను ఏర్పాటు చేశారు.
అరిస్తే చంపేస్తామని బెదిరింపు
సాగి నాగలక్షి, ధనుష్ కోళ్లఫారం నుంచి ఇంటికి బయలుదేరిన అనంతరం ధనుష్ బాబాయి శివరామ్ కూడా అదేమార్గంలో కోళ్లఫారం నుంచి ఇంటికి వచ్చి చూడగా ధనుష్, నాగలక్ష్మి కనిపించలేదు. అనుమానించిన అతను తిరిగి కోళ్ల ఫారం వైపు వెళుతుండగా దుండగుల వద్ద బందీగా ఉన్న వారు గమనించి కేకలు వేయడానికి ప్రయత్నించగా, అరిస్తే చంపేస్తామని దుండగులు ఆయుధాలు చూపి బెదిరించారు. దుండగులు బాధితులతో శ్రీకాకుళం జిల్లా యాసలో మాట్లాడి బెదిరించారు. వారు వేరే భాషలో మాట్లాడుకున్నట్లు బాధితులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంగళగిరిలో నారా లోకేశ్ నామినేషన్.. తెదేపా శ్రేణుల భారీ ర్యాలీ
[ 18-04-2024]
గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ స్థానానికి తెదేపా అభ్యర్థిగా నారా లోకేశ్ నామినేషన్ దాఖలు చేశారు. -
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైకాపా నేతలు
[ 18-04-2024]
భీమిలి, జీడీ నెల్లూరు నియోజకవర్గాలకు చెందిన పలువురు వైకాపా నేతలు తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో గురువారం ఆ పార్టీలో చేరారు. -
నీరివ్వలేని నీరో!
[ 18-04-2024]
సీఎం జగన్... పేదల పక్షపాతినంటారు.. ఎన్నికల్లో వారే తన స్టార్ క్యాంపెయినర్లంటారు.. వారి జీవితాలను బాగు చేసేది తనొక్కడేనంటూ గొప్పలకు పోతుంటారు.. కానీ.. తన నివాసానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళగిరి ఎయిమ్స్లోని నిరుపేద రోగుల గొంతు తడపలేకపోతున్నారు. -
నారీ గళంతో జగన్ వెన్నులో వణుకు
[ 18-04-2024]
నారీ గళంతో జగన్ వెన్నులో వణుకు పుట్టాలని తెదేపా గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ అభ్యర్థి గళ్లా మాధవి, తెలుగు మహిళ నాయకురాలు మాగంటి రూప, తెలంగాణ తెదేపా నాయకులు నన్నూరి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. -
కీలక ఘట్టానికి వేళాయె
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం నేటి నుంచి ఆరంభం కాబోతోంది. గురువారం నుంచి అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయనున్నారు. జిల్లాలో నామినేషన్ల స్వీకరణకు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -
నాడు ఆశల కేంద్రం.. నేడు విధ్వంసానికి నిలయం
[ 18-04-2024]
రాష్ట్ర విభజన తర్వాత తుళ్లూరు మండలంలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. గత తెదేపా ప్రభుత్వంలో రాత్రీ పగలు తేడా లేకుండా వేల మంది కార్మికులతో కళకళలాడిన అమరావతి వైకాపా పాలనలో విధ్వంసానికి చిరునామాగా మారింది. -
జీతాలకూ ఎదురుచూపులే..
[ 18-04-2024]
జిల్లాలోని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ఫిబ్రవరి, మార్చి జీతాలు రాలేదు. ఏప్రిల్ నెల జీతంతో కలిపి రెండు నెలల బకాయిలు విడులవుతాయన్న నమ్మకం లేదు. -
గుంటూరువాసికి క్రికెట్ సైట్ స్క్రీన్పై పేటెంట్
[ 18-04-2024]
జోసెల్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, జేకేసీ కళాశాల కార్యదర్శి, గుంటూరు జిల్లా మెన్, ఉమెన్ క్రికెట్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షుడు, ఏసీఏ ఉమెన్స్ అకాడమీ పూర్వ ఛైర్మన్ జాగర్లమూడి మురళీమోహన్ నూతన ఆవిష్కరణకు పేటెంట్ లభించింది. -
శిరోముండనం కేసులో శిక్ష విధించడం హర్షణీయం
[ 18-04-2024]
శిరోముండనం కేసుల్లో నిందితులకు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు జైలుశిక్ష, జరిమానా విధించడం హర్షణీయమని భీమ్ భారత్ రాష్ట్ర అధ్యక్షుడు పాగళ్ల ప్రకాష్ అన్నారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 18-04-2024]
స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి నీట మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. -
సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహిద్దాం
[ 18-04-2024]
పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు హింస, రీపోలింగ్ లేకుండా విజయవంతం చేసేందుకు అధికారులు, సిబ్బంది సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శివశంకర్ కోరారు. -
విశ్రాంతిలోనూ.. మనశ్శాంతి లేదయ్యా!
[ 18-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి ప్రసాద్కు గతంలో ఒకటో తేదీనే పింఛన్ సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ అయ్యేది. బీపీ, మధుమేహం సమస్యతో బాధపడుతున్న ఆయన నెల రోజులకు సరిపడా ఒకేసారి ఔషధాలు తెచ్చుకునేవారు. -
అయిదేళ్లుగా చోద్యం చూశారు!
[ 18-04-2024]
ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన వంతెన ఇది. శిథిలావస్థకు చేరి అడుగు భాగం దిమ్మెలు పగుళ్లిచ్చాయి. ఇనుప రాడ్ల ఆధారంగా నిలబడింది. భారీ వాహనాలు ప్రయాణిస్తే దిమ్మెలు కదులుతున్నాయి. -
పోలీసు.. వైకాపాకు వత్తాసు
[ 18-04-2024]
సాధారణంగా ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసే తనిఖీ కేంద్రాలు(చెక్పోస్టులు) వద్ద ప్రత్యేకంగా సిబ్బందికి విధులు కేటాయిస్తారు. కానీ జిల్లాలో పోలీసుస్టేషన్లలో ఉండాల్సిన సీఐ, ఎస్సైలకు చెక్పోస్టు డ్యూటీలకు పంపడం చర్చనీయాంశమవుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
-
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
-
రుణం కోసం ‘చావు తెలివి’.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!