logo

కమనీయం.. గోదారంగనాథుల కల్యాణం

చెరుకుపల్లిలోని శ్రీరుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి, శ్రీప్రసన్నాంజనేయ స్వామి దేవాలయాల్లో గురువారం అత్యంత వైభవంగా శ్రీగోదారంగనాథుల కల్యాణం నిర్వహించారు. కమనీయంగా సాగిన ఈ వేడుకల్లో పలువురు దంపతులు స్వామివార్లకు తలంబ్రాలు

Published : 15 Jan 2022 00:57 IST


చెరుకుపల్లి శ్రీప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో
పిల్లలకు భోగిపండ్లు పోస్తున్న ప్రధానార్చకుడు

చెరుకుపల్లి, న్యూస్‌టుడే : చెరుకుపల్లిలోని శ్రీరుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి, శ్రీప్రసన్నాంజనేయ స్వామి దేవాలయాల్లో గురువారం అత్యంత వైభవంగా శ్రీగోదారంగనాథుల కల్యాణం నిర్వహించారు. కమనీయంగా సాగిన ఈ వేడుకల్లో పలువురు దంపతులు స్వామివార్లకు తలంబ్రాలు సమర్పించి భక్తితో పూజలు జరిపించారు. భోగి పండగ సందర్భంగా ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ ప్రధానార్చకుడు సుబ్బారావుశర్మ పిల్లలకు భోగిపండ్లు పోసి ఆశీర్వచనాలు అందించారు. నెలరోజులపాటు సాగిన ధనుర్మాస కార్యక్రమాల్లో ఆలయాల ప్రధానార్చకులు శ్రీధర్‌ దేశిక అయ్యంగార్, మురళీధర్, సుబ్బారావు శర్మ పూజాకార్యక్రమాలు నిర్వహించగా, పాలకమండలి సభ్యులు బైసాని హరినారాయణ, తూనుగుంట్ల శ్రీను పర్యవేక్షించారు.
అమ్మవార్లకు ప్రత్యేక పూజలు..
పిట్టలవానిపాలెం : అల్లూరు, అలకాపురం, ఖాజీపాలెం శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాలు, ఖాజీపాలెం కోదండ రామస్వామి, పిట్టలవానిపాలెం సీతారామాలయాల్లో నిర్వహిస్తున్న ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం గోదాదేవి అమ్మవారి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. అల్లూరు నరసింహస్వామి దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు.


వేడుకలో పాల్గొన్న దంపతులు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని