కరోనా కమ్మేoస్తోది
జిల్లాలో కరోనా వైరస్ కేసులు గడిచిన నాలుగు రోజుల్లోనే 1307 కేసులు వచ్చాయి. కేసులు నానాటికి ఎగబాకుతున్నాయి. మూడు రోజుల నుంచి సగటున రోజుకు 300కు పైగా కేసులు నమోదు కావడమే జిల్లాలో వైరస్ తీవ్రతను తెలియజేస్తోంది. గడిచిన 24 గంటల్లో 368 కేసులు బయటపడ్డాయి. అత్యధికంగా గుంటూరు
4 రోజులు... 1307 కేసులు
వైరస్బారిన పీజీలు, హౌస్సర్జన్లు
ఈనాడు, అమరావతి జిల్లాలో కరోనా వైరస్ కేసులు గడిచిన నాలుగు రోజుల్లోనే 1307 కేసులు వచ్చాయి. కేసులు నానాటికి ఎగబాకుతున్నాయి. మూడు రోజుల నుంచి సగటున రోజుకు 300కు పైగా కేసులు నమోదు కావడమే జిల్లాలో వైరస్ తీవ్రతను తెలియజేస్తోంది. గడిచిన 24 గంటల్లో 368 కేసులు బయటపడ్డాయి. అత్యధికంగా గుంటూరు నగరంలో 185 రాగా ఆ తర్వాత మంగళగిరి 33, నరసరావుపేట 26, తెనాలి 22, తాడేపల్లిలో 20 చొప్పున కేసులు వచ్చాయి. గ్రామీణంలో కన్నా పట్టణాల్లోనే కేసులు ఎక్కువగా వస్తున్నాయి. జనాల రాకపోకలు అధికంగా ఉండడం, సామాజిక దూరం పాటింపు వంటివి విస్మరించడం వల్లే పట్టణాల్లో అధిక కేసులు రావడానికి కారణమవుతోందని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖవర్గాలు భావిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల ద్వారా రచ్చబండ్లపై కూర్చోవద్దని విస్తృత ప్రచారం కల్పించారు. చాలా వరకు మాస్కుధారణ తప్పనిసరి అని చెప్పటంతో దాన్ని పాటిస్తున్నారు. ఇలాంటి జాగ్రత్తలతోనే గ్రామీణంలో వైరస్ కేసులు అదుపులో ఉండటానికి కారణమవుతోంది. పట్టణాల్లో పర్యవేక్షణ కొరవడటం, మాస్కులు లేకుండానే రాకపోకలు సాగిస్తున్నారు. అనుమానిత లక్షణాలు కలిగిన వారు యధేచ్ఛగా తిరుగుతున్నారు. ఎవరైనా అనుమానించి పరీక్షలు చేయించుకోమని సూచించే వరకు అప్రమత్తం కావడం లేదని వైద్యులు అంటున్నారు. ప్రస్తుతం 1893 క్రియాశీల కేసులు ఉన్నాయి. ప్రైవేటుతో పోలిస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేసులు చాలా స్వల్పంగా ఉన్నాయి.
పీపీఈ కిట్లు ధరించాలని: వైద్యుల బృందం మెల్లగా వైరస్బారిన పడుతోంది. మూడు రోజులుగా పరిశీలిస్తే గుంటూరు ప్రభుత్వ బోధనాసుపత్రిలో ఐదుగురు పీజీ వైద్యులు, మరో ముగ్గురు హౌస్ సర్జన్లకు వైరస్ నిర్ధారణ అయింది. దీంతో ఒక్కసారిగా ఆసుపత్రి వైద్యులు ఆందోళన చెందారు. ఇకమీదట పీపీఈ కిట్లు ధరించాకే వార్డుల్లో కేసుల పరిశీలనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కీలకమైన పీజీలు, హౌస్ సర్జన్లే దీని బారిన పడితే మున్ముందు వైరస్తో పోరాటం చేయడానికి వైద్యులు ఉండరని, దాన్ని దృష్టిలో పెట్టుకుని కచ్చితంగా పీపీఈ కిట్లు ధరించాలని ఆయా విభాగాధిపతులు సూచించారు. పారామెడికల్ సిబ్బంది మరో ఐదారుగురు పాజిటవయ్యారని, అందరూ ఇళ్ల వద్దే చికిత్సలు పొందుతున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
వార్డుల్లో బయటపడుతున్న కేసులు
ఇతర వ్యాధులతో చికిత్సలు పొందటానికి ఇన్ పేషెంట్లుగా ఉంటున్న వారిలోనూ కరోనా లక్షణాలు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. మూడు రోజుల క్రితం ఒకరు ఎముకలు-కీళ్లకు సంబంధించిన శస్త్రచికిత్స కోసం, మరొకరు జనరల్ సర్జరీ కోసం శస్త్రచికిత్స మందిరాలకు వచ్చారు. వారు దగ్గు, జలుబు వంటి లక్షణాలు కలిగి ఉండడంతో తొలుత వారికి వైరస్ పరీక్షలు చేయాలని పంపారు. వారిద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వారికి శస్త్రచికిత్సలు వాయిదా వేశారు. ఇలా పలు విభాగాల్లో అనుమానిత కేసులకు పరీక్షలు చేయిస్తుంటే పాజిటివ్ వస్తోందని వైద్యులు తెలిపారు. ఈసారి జలుబు అనేది చలి వల్ల వస్తుందా లేక కరోనా లక్షణమా అనేది అర్థం కాకుండా ఉందని వైద్యాధికారి ఒకరు తెలిపారు. సాధారణంగా చలికి జలుబు చేస్తుంది. అలాంటిది కరోనా కేసుల్లోనూ జలుబు ఒక లక్షణం కావడంతో అది ప్లూనా లేక కరోనా అనేది నిర్ధారించుకోవటానికి పరీక్షలు చేయించాల్సి వస్తోందని, ఈ క్రమంలోనూ గడిచిన వారం రోజుల్లో ఒక్క జీజీహెచ్లోనే నాలుగు కేసులు వచ్చినట్లు తెలిపారు. మొత్తంగా కేసులు పెరుగుతున్నా ఎవరికీ ఇబ్బంది కలగటం లేదు. వైరస్ నిర్ధారణ అయిన ఐదు రోజుల్లోపే తిరిగి నెగెటివ్ వచ్చేస్తోందని జీజీహెచ్లో కరోనా కేసులు పరిశీలిస్తున్న వైద్యాధికారి ఒకరు వివరించారు. గతంలో దగ్గు అనేది ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపేది. ప్రస్తుతం వస్తున్న కరోనా కేసులను చూస్తుంటే ఊపిరితిత్తులపై ప్రభావం ఏ మాత్రం కనిపించటం లేదు. ఇది శుభపరిణామమన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ డీజీపీని బదిలీచేయండి: ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు
[ 25-04-2024]
డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిని బదిలీ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో భాజపా నేతలు మరోమారు ఫిర్యాదు చేశారు. -
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: సినీ నటుడు నిఖిల్
[ 25-04-2024]
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి ఎం.ఎం కొండయ్య గురువారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. -
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?