logo

వైభవంగా నరసింహుని తెప్పోత్సవం

అల్లూరు శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి తెప్పోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. దేవస్థానం నుంచి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా రెడ్లపాలెం తీసుకొచ్చారు. అక్కడ నిజాంపట్నం ఛానల్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు

Published : 17 Jan 2022 02:33 IST


నిజాంపట్నం కాల్వలో ఉత్సవం

అల్లూరు(పిట్టలవానిపాలెం), న్యూస్‌టుడే : అల్లూరు శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి తెప్పోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. దేవస్థానం నుంచి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా రెడ్లపాలెం తీసుకొచ్చారు. అక్కడ నిజాంపట్నం ఛానల్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెప్పపై స్వామివార్లను ఉంచారు. అల్లూరు నుంచి జలమార్గంలో గోకర్ణమఠం తీసుకొచ్చి గ్రామోత్సవం జరిపారు. ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని