logo

ఇక అమ్మకుఆధారం ఏదీ?

ఒక్కగానొక్క కుమారుడు.. తండ్రి లేని లోటు లేకుండా పెంచిన తల్లి.. నేడో రేపో పెళ్లి చేసి ఒక ఇంటివాన్ని చేద్దామనుకున్న ఆమె కల నెరవేరకుండానే అతను నీటిపాలయ్యాడు. తమిళనాడులోని భవాని వద్ద కాల్వ నీటిలో శుక్రవారం గల్లంతైన పొట్టి రామారావు (25) మృతితో కన్నతల్లి కన్నీటి పర్యంతమైంది. మృతుని

Published : 17 Jan 2022 02:33 IST


రామారావు (పాతచిత్రం)

వినుకొండ, న్యూస్‌టుడే : ఒక్కగానొక్క కుమారుడు.. తండ్రి లేని లోటు లేకుండా పెంచిన తల్లి.. నేడో రేపో పెళ్లి చేసి ఒక ఇంటివాన్ని చేద్దామనుకున్న ఆమె కల నెరవేరకుండానే అతను నీటిపాలయ్యాడు. తమిళనాడులోని భవాని వద్ద కాల్వ నీటిలో శుక్రవారం గల్లంతైన పొట్టి రామారావు (25) మృతితో కన్నతల్లి కన్నీటి పర్యంతమైంది. మృతుని అంత్యక్రియలు వినుకొండలో అదివారం నిర్వహించారు. పట్టణంలోని బోసుబొమ్మ సెంటర్‌కు చెందిన ఫార్మసీ వ్యాపారం చేస్తున్న రామారావు మరికొంతమంది మిత్రులతో కలిసి శబరిమలై ఈనెల 13న కారులో బయలుదేరి మరుసటి రోజు మార్గమధ్యలో స్నానం కోసం కాల్వలో దిగగా కాలు జారి రామారావు నీళ్లలో కొట్టుకు పోయాడు. సుమారు 7 కి.మీ. దూరంలో అతని మృతదేహం శనివారం బయటపడింది. తండ్రి శంకర్రావు చిన్నప్పుడే చనిపోవడంతో అమ్మ, కుమారుడు ఇద్దరే ఉండేవారు. ఫార్మసీ దుకాణంలో గుమస్తాగా ఉంటూ రామారావు రెండేళ్ల నుంచి స్నేహితుల సహకారంతో సొంతంగా వ్యాపారం చేస్తూ తన కాళ్లమీద తాను నిలబడ్డాడు. ఈలోపే మృత్యువు కబళించింది. మంచి మిత్రుడ్ని కోల్పోయామని స్నేహితులు ఆవేదన చెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని