logo

కనీస పరిజ్ఞానం లేకుండా రైతుకు సేవలెలా?

ధాన్యం సేకరణ, తేమ శాతం పరీక్షలు, వివరాల నమోదుపై కనీస పరిజ్ఞానం కూడా లేకుండా రైతులకు సేవలెలా అందిస్తారని రైతుభరోసా కేంద్రం సిబ్బందిపై రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఎండీ వీరపాండ్యన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం చెరుకుపల్లి మండలం రాంభొట్లపాలెంలోని ఆర్బీకే,

Published : 21 Jan 2022 05:47 IST

ఆర్బీకే సిబ్బందిపై పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండ్యన్‌ ఆగ్రహం


రైతుభరోసా కేంద్రంలో ధాన్యం తేమ పరిశీలిస్తున్న వీరపాండ్యన్‌, చిత్రంలో దినేష్‌కుమార్‌ తదితరులు

రాంభొట్లపాలెం (చెరుకుపల్లి గ్రామీణ), కర్లపాలెం, న్యూస్‌టుడే : ధాన్యం సేకరణ, తేమ శాతం పరీక్షలు, వివరాల నమోదుపై కనీస పరిజ్ఞానం కూడా లేకుండా రైతులకు సేవలెలా అందిస్తారని రైతుభరోసా కేంద్రం సిబ్బందిపై రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఎండీ వీరపాండ్యన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం చెరుకుపల్లి మండలం రాంభొట్లపాలెంలోని ఆర్బీకే, కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం సమీపంలోని ఎఫ్‌సీఐ గోదామును ఆయన తనిఖీ చేశారు. రైతులకు అందించే సేవలపై రాంభొట్లపాలెంలో సిబ్బందిని ప్రశ్నించగా, సరైన సమాధానం రాలేదు. పనితీరు మెరుగుపరచుకోవాలని, తాను మరోసారి వచ్చే సరికి మార్పు కనిపించాలని వీరపాండ్యన్‌ ఆదేశించారు.

మద్దతు ధర సద్వినియోగం చేసుకోవాలి..

రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని, దీనిలో భాగంగానే ఆర్‌బీకేల ద్వారా ధాన్యం కొని లబ్ధి చేకూరుస్తోందని వీరపాండ్యన్‌ పేర్కొన్నారు. గ్రేడ్‌ ‘ఎ’ రకం ధాన్యానికి క్వింటాకు రూ.1960, సాధారణ రకానికి రూ.1440 చెల్లిస్తున్నట్లు చెప్పారు. దీనికన్నా ఎక్కువ ధర బయట వస్తే రైతులు విక్రయించుకోవచ్చన్నారు. తక్కువకు విక్రయించి నష్టపోవద్దని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ధర సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 753 మంది రైతుల నుంచి రూ.10.16 కోట్ల విలువైన 5 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించామని తెలిపారు. ధాన్యం విక్రయించిన 21 రోజుల్లో రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేస్తుందని వివరించారు. పర్యటనలో జేసీ దినేష్‌కుమార్‌, పౌర సరఫరాల శాఖ డీఎం శివరాంప్రసాద్‌, మార్కెటింగ్‌ శాఖ జిల్లా మేనేజర్‌ హరగోపాల్‌, ఏడీఏలు ఉషారాణి, లక్ష్మి, తహశీల్దార్లు సీహెచ్‌ సుధారాణి, మోహన్‌రావు, కర్లపాలెం ఎంపీడీవో శ్రీనివాసరావు, ఏవో అరవిందకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని