logo

గాలిపటం.. తీసిన ప్రాణం

గాలిపటం ఓ బాలుడి ప్రాణాలు బలిగొన్న సంఘటన చిలకలూరిపేట పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. పట్టణంలోని గుర్రాలచావిడి వద్ద మూడంతస్తుల డాబాలో బిలాల్‌ అనే వ్యక్తి అద్దెకు ఉంటున్నాడు. అతనికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు అర్షద్‌(10) స్థానిక ప్రసన్నలక్ష్మి విద్యాలయంలో

Published : 21 Jan 2022 05:47 IST

మూడంతస్తుల భవనంపై నుంచి పడి బాలుడి మృతి


అర్షద్‌ (పాతచిత్రం)

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే: గాలిపటం ఓ బాలుడి ప్రాణాలు బలిగొన్న సంఘటన చిలకలూరిపేట పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. పట్టణంలోని గుర్రాలచావిడి వద్ద మూడంతస్తుల డాబాలో బిలాల్‌ అనే వ్యక్తి అద్దెకు ఉంటున్నాడు. అతనికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు అర్షద్‌(10) స్థానిక ప్రసన్నలక్ష్మి విద్యాలయంలో 4వ తరగతి చదువుతున్నాడు. గురువారం అర్షద్‌ డాబాపై గాలిపటం ఎగురవేస్తూ ప్రమాదవశాత్తూ కిందపడి తీవ్రంగా గాయపడగా స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యుల సూచనల మేరకు మెరుగైన చికిత్సకు గుంటూరు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. కుమారుని మృతితో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని