logo

రెండు వర్గాల మధ్య ఘర్షణ: ఏడుగురికి గాయాలు

ద్విచక్ర వాహనం ఢీకొట్టబోయిన సంఘటనలో రెండు వర్గాలు తలపడటంతో బొల్లాపల్లి మండలం గుమ్మనంపాడులో బుధవారం ఘర్షణ జరిగి ఏడుగురికి స్వల్పగాయాలయ్యాయి. వైకాపా మద్ధతుదారుడు ద్విచక్ర వాహనంపై వెళ్తూ తెదేపాకు చెందిన యువకున్ని ఢీకొట్టబోవడంతో ఒకరిపై

Published : 21 Jan 2022 05:47 IST


తలకు గాయమైన యువకుడు

బొల్లాపల్లి (వినుకొండ), న్యూస్‌టుడే : ద్విచక్ర వాహనం ఢీకొట్టబోయిన సంఘటనలో రెండు వర్గాలు తలపడటంతో బొల్లాపల్లి మండలం గుమ్మనంపాడులో బుధవారం ఘర్షణ జరిగి ఏడుగురికి స్వల్పగాయాలయ్యాయి. వైకాపా మద్ధతుదారుడు ద్విచక్ర వాహనంపై వెళ్తూ తెదేపాకు చెందిన యువకున్ని ఢీకొట్టబోవడంతో ఒకరిపై మరొకరు కేకలేసుకున్నారు. తర్వాత వారికి మద్ధతుగా వచ్చిన రెండు వర్గాల వారు దాడులకు దిగడంతో గాయపడ్డ నలుగురు తెదేపా వర్గీయులు ఈపూరు ప్రభుత్వాసుపత్రిలో చేరగా, ప్రత్యర్థి వర్గానికి చెందిన ముగ్గురు వినుకొండలో చికిత్స పొందుతున్నారు. వ్యక్తిగత తగాదాలతో గొడవ పడ్డారని, ఇరువైపులా పెద్దమనుషులు రాజీ చేస్తున్నారని బండ్లమోటు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని