logo

శుభకార్యానికి వెళ్లి వస్తూ.. కానరాని లోకాలకు!

అప్పటివరకు అంతా సంతోషంగా ఉన్నారు.. వేడుక విశేషాలు చర్చించుకొని సరదాగా గడిపారు. ఇంతలో టైరు పగిలిన పెద్ద శబ్దం రావడం, కారు రోడ్డు డివైడర్‌కు ఢీకొనడం రెప్పపాటులో జరిగిపోయాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఆమె స్పృహ కోల్పోయారు.

Published : 22 Jan 2022 02:12 IST

కారు టైరు పగిలిపోవడంతో ప్రమాదం.. మహిళ మృతి

పెదకాకాని, న్యూస్‌టుడే: అప్పటివరకు అంతా సంతోషంగా ఉన్నారు.. వేడుక విశేషాలు చర్చించుకొని సరదాగా గడిపారు. ఇంతలో టైరు పగిలిన పెద్ద శబ్దం రావడం, కారు రోడ్డు డివైడర్‌కు ఢీకొనడం రెప్పపాటులో జరిగిపోయాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఆమె స్పృహ కోల్పోయారు. పరికించి చూడగా.. తలకు తీవ్ర గాయమై రక్తం కారుతోంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా అక్కడ ఆమె మృతిచెందారు. పెదకాకాని సీఐ సురేష్‌బాబు కథనం ప్రకారం.. చుండూరు మండలం మోదుకూరుకు చెందిన దంపతులు మత్తె శామ్యేల్‌, అనితకుమారి(36)లు తమ బంధువులతో కలిసి గురువారం కృష్ణా జిల్లా కొండపల్లిలో జరిగిన శుభకార్యానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు పెదకాకాని మండలంలోని కల్వరి టెంపుల్‌ వద్దకు చేరుకోగా, వారు ప్రయాణిస్తున్న కారు టైరు పగిలిపోయింది. ఒక్కసారిగా వాహనం అదుపు తప్పి, డివైడర్‌ను ఢీకొనడంతో అనితకుమారి తలకి తీవ్ర గాయమవగా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ఆమె మృతిచెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని