వామ్మో.. శావల్యాపురం స్టేషన్
మండల కేంద్రం శావల్యాపురం పరిధిలో 15 పంచాయతీలు, ఎనిమిది శివారు గ్రామాలున్నాయి. అన్నీ 10 కి.మీ దూరానికి మించి లేవు. రాజకీయ చైతన్యం మెండుగా ఉన్న ఇక్కడ పోలీసులు ఏ మాత్రం పొరపాట్లకు తావిచ్చినా, ఏమరుపాటుగా ఉన్నా మూల్యం చెల్లించక తప్పదు. 2014 ఎన్నికల్లో
పోలీసు అధికారులకు అర్ధాంతర బదిలీలు
వినుకొండ, శావల్యాపురం, న్యూస్టుడే మండల కేంద్రం శావల్యాపురం పరిధిలో 15 పంచాయతీలు, ఎనిమిది శివారు గ్రామాలున్నాయి. అన్నీ 10 కి.మీ దూరానికి మించి లేవు. రాజకీయ చైతన్యం మెండుగా ఉన్న ఇక్కడ పోలీసులు ఏ మాత్రం పొరపాట్లకు తావిచ్చినా, ఏమరుపాటుగా ఉన్నా మూల్యం చెల్లించక తప్పదు. 2014 ఎన్నికల్లో అప్పటి ఎస్ఐ గల్లా రవికృష్ణ వేల్పూరులో తెదేపా కార్యకర్తలతో వివాదం చోటుచేసుకుంది. దాని పర్యవసనంగా ఫలితాలు వచ్చిన వెంటనే ఆయనను వీఆర్కు పంపించారు. ఆ తర్వాత వచ్చిన ఎస్ఐ ఓ కేసు విషయంలో వ్యవహరించిన తీరుపై కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఉన్నతాధికారులు పక్కన పెట్టారు. తదుపరి పని చేసిన ఎస్ఐ 12 నెలల్లో స్టేషన్ అభివృద్ధి పేరుతో వసూళ్లు చేశారన్న ఆరోపణలపై ఆయనను అక్కడ నుంచి వెనక్కి పిలిచారు. ఆయన స్థానంలో వచ్చిన ఎస్ఐ ప్రత్యర్థుల ఎదుట అవమానించారని మతుకుమల్లికి చెందిన దంపతులిద్దరూ మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించడంతో ఆయన్నీ వీఆర్కు పంపించారు. ఆ తర్వాత వచ్చిన ఎస్ఐ మన్మథరావు రెండు, మూడు నెలలకే బదిలీపై వెళ్లారు. 2019 ఎన్నిక వేళ బాధ్యతలు స్వీకరించిన చెన్నకేశవులు ఆ ప్రక్రియ పూర్తికాగానే మరోచోటుకు వెళ్లగా, ఆయన స్థానంలో వచ్చిన కత్తి స్వర్ణలత ఏడాదిన్నర కాలం పని చేశారు. ఆమె స్థానంలో వచ్చిన దాసరి శివనాగరాజు ఏడాదిలోనే బదిలీకాగా, ప్రస్తుతం పని చేస్తున్న లోకేశ్వరరావు జడ్పీటీసీ ఎన్నికల తర్వాత పది రోజులు సెలవుపై వెళ్లారు. ఈలోపు ఇన్ఛార్జిగా బండ్లమోటు ఎస్ఐ రవీంద్రారెడ్డి ఉండగా రైతు నరేంద్రపై హత్యాయత్నం కేసు నమోదు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశ కావడంతో సెలవులో ఉన్న ఎస్ఐ తిరిగి విధుల్లో చేరడం గమనార్హం.
జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా తమకు సహకరించలేదని అధికార పార్టీ ఆగ్రహనికి గురైన నలుగురు పోలీస్ సిబ్బందిని కొంత కాలం ఇతర ప్రాంతాల్లో విధులకు పంపించారు. కొద్దిరోజుల తర్వాత తిరిగి వచ్చిన వారిలో ముగ్గురు సొంతంగా బదిలీ చేయించుకొని వెళ్లగా, ప్రస్తుతం స్టేషన్ సిబ్బంది కొరత ఎదుర్కొంటుంది. అవసరమైనప్పుడు ఇతర స్టేషన్ల నుంచి పిలిపిస్తున్నారు. ఇవన్నీ అవలోకం చేసుకున్న అధికారులు వాస్తు దోషమేమోనన్న అనుమానంతో రెండు రోజుల నుంచి స్టేషన్లో మార్పులు చేస్తున్నారు. ప్రధాన గేటుకు ఎదురుగా మరో ఒక చిన్న గేటు, స్టేషన్ గ్రిల్కు మరో కిటికీ ఏర్పాటు చేశారు. పోలీసులైనా ఇబ్బందులెదురైనప్పుడు ఇటువంటివి చేయక తప్పదు మరీ.
జిల్లాకు మారుమూలగానున్న శావల్యాపురం స్టేషన్లో విధులంటే పోలీసు అధికారులు హడలిపోతున్నారు. తొమ్మిదేళ్ల వ్యవధిలో పూర్తికాలం రెండేళ్ల పాటు ఉద్యోగం చేసినవారు లేరంటే అతిశయోక్తికాదు. రాజకీయ ఒత్తిళ్లతో కొందరు, స్వీయ తప్పిదాలతో మరికొందరు అర్ధంతరంగా బదిలీపై వెళ్లినవారు ఎక్కువ మంది ఉన్నారు. తాజాగా ఈ స్టేషన్ పరిధిలోనే రైతుపై హత్యాయత్నం కేసు నమోదు, అరెస్టు నేపథ్యంలో సీఐ అశోక్కుమార్ సస్పెన్షన్కు గురికావడం చర్చనీయాంశమైంది. శావల్యాపురం స్టేషన్ అంటే పోలీసు అధికారులే వామ్మో అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: సినీ నటుడు నిఖిల్
[ 25-04-2024]
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి ఎం.ఎం కొండయ్య గురువారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. -
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!