logo

విజేతలకు బహుమతుల ప్రదానం

స్వాతి షాపింగ్‌ మాల్‌ పండగల సందర్భంగా ప్రకటించిన ఏడు వారాలు, ఏడు నగల డ్రా, బహుమతుల ప్రదానం మాల్‌లో శనివారం జరిగింది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌ విజేతలకు నగలు అందజేశారు. క్రిస్మస్‌, నూతన సంవత్సరం, సంక్రాంతి పండగలను పురస్కరించుకుని

Published : 23 Jan 2022 01:41 IST


స్వాతి షాపింగ్‌ మాల్‌ లక్కీ డ్రా విజేతకు బంగారు ఆభరణం అందజేస్తున్న ఎమ్మెల్యే గిరిధర్‌

పట్టాభిపురం, న్యూస్‌టుడే: స్వాతి షాపింగ్‌ మాల్‌ పండగల సందర్భంగా ప్రకటించిన ఏడు వారాలు, ఏడు నగల డ్రా, బహుమతుల ప్రదానం మాల్‌లో శనివారం జరిగింది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌ విజేతలకు నగలు అందజేశారు. క్రిస్మస్‌, నూతన సంవత్సరం, సంక్రాంతి పండగలను పురస్కరించుకుని గుంటూరు, చీరాల, నరసరావుపేటల్లోని స్వాతి షాపింగ్‌ మాల్స్‌లో నవంబర్‌ 20 నుంచి జనవరి 22 వరకు ప్రతి రూ.1000 కొనుగోలుపై గిఫ్ట్‌ కూపన్‌ అందించి డ్రా తీశారు. ప్రతి వారం విజేతలకు రూ.50 వేల విలువ చేసే బంగారు ఆభరణాన్ని బహుమతిగా అందజేసినట్లు షాపింగ్‌మాల్‌ అధినేత రమణ తెలిపారు. గుంటూరు నగరంలో జరిగిన డ్రాలో 21 మంది విజేతలకు ఎమ్మెల్యే గిరిధర్‌ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అత్యాధునిక డిజైన్లు అందుబాటు ధరల్లో మారుతున్న వినియోగదారుల అభిరుచి మేరకు లేటెస్ట్‌ వెరైటీలను అందించడం వల్ల ప్రజల అభిమానాన్ని పొందగలిగామని రమణ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని