భాషించి..స్నేహించి
తెలుగు మాధ్యమంలో చదువుతున్న విద్యార్థులకు ఇంగ్లిష్ అంటే సహజంగానే భయం ఉంటుంది. ఎవరితోనైనా మాట్లాడాలంటే వామ్మో తమవల్ల కాదంటారు. కానీ, నగరం మండలం పెద్దవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎనిమిది దేశాల విద్యార్థులతో సంభాషిస్తున్నారు.
విదేశీ విద్యార్థులతో పెద్దవరం విద్యార్థుల మిత్రబంధం
ఆంగ్లంపై భయం పోగొట్టేందుకు ఉపాధ్యాయుని కృషి
పెద్దవరం విద్యార్థులతో మాట్లాడుతున్న రష్యా విద్యార్థులు
పెద్దవరం (నగరం), న్యూస్టుడే తెలుగు మాధ్యమంలో చదువుతున్న విద్యార్థులకు ఇంగ్లిష్ అంటే సహజంగానే భయం ఉంటుంది. ఎవరితోనైనా మాట్లాడాలంటే వామ్మో తమవల్ల కాదంటారు. కానీ, నగరం మండలం పెద్దవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎనిమిది దేశాల విద్యార్థులతో సంభాషిస్తున్నారు. సాంకేతికత సద్వినియోగం చేసుకొంటూ వారితో స్నేహం చేస్తున్నారు. ఆంగ్ల ఉపాధ్యాయుడు ఉల్లంగుంట వెంకటేశ్వరరావు కృషితో వియత్నాం, ఆస్ట్రేలియా, స్పెయిన్, రష్యా, ఇంగ్లాండ్, గ్రీస్, పోర్చుగల్ తదితర ఎనిమిది దేశాలకు చెందిన విద్యార్థులతో తరచూ మాట్లాడుతున్నారు. స్కైప్ మాధ్యమం ద్వారా విదేశీ ఉపాధ్యాయులతో సైతం పలు అంశాలపై ముఖాముఖిగా చర్చిస్తున్నారు. అక్కడి ఉపాధ్యాయులు, విద్యార్థులు డాక్యుమెంటరీ వీడియో ద్వారా ఆయా దేశాల్లోని విద్యావిధానం, ఉద్యోగ అవకాశాలు, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పరిశ్రమలు, చారిత్రక ప్రదేశాలు, ముఖ్యమైన పట్టణాలు, నదులతో పాటు ముఖ్యమైన వ్యక్తులను చూపిస్తున్నారు. అలాగే, భారత విద్యా విధానం, ఇక్కడి పాఠశాలల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, క్రీడలు, తెలుగు పండగలు, సంస్కృతి సంప్రదాయాల ప్రాముఖ్యాన్ని విదేశీ విద్యార్థులకు వీడియోల ద్వారా వివరిస్తున్నారు.. మన విద్యార్థులు.
ఆసక్తి గమనించి..: ఆంగ్లంపై విద్యార్థుల ఆసక్తి గమనించిన ఉపాధ్యాయుడు వెంకటేశ్వరరావు విదేశీ విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడిద్దామని యోచన చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా విదేశీయులను సంప్రదించారు. 8 దేశాల నుంచి స్కైప్ ద్వారా మాట్లాడేందుకు ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. గ్రామాల్లో అంతర్జాల సౌకర్యాలు లేక మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రధానోపాధ్యాయుడు విచారపు శ్రీనివాసరావు చొరవ తీసుకొని సమస్య పరిష్కరించారు. దీంతో రష్యా, స్పెయిన్, వియత్నాం, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశ విద్యార్థులతో ముఖాముఖిగా సంభాషించారు. విదేశీ ఉపాధ్యాయులు, విద్యార్థులతో సంభాషించిన విద్యార్థులు తమ అభిప్రాయాలు ‘న్యూస్టుడే’తో పంచుకున్నారు.
అర్థమయ్యేలా వివరించారు
ఆంగ్లంలో మాట్లాడాలంటే మొదట్లో భయమేసింది. అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయిని, విద్యార్థులు మాట్లాడుతుంటే అలా చూస్తూ ఉండిపోయాను. ఇంగ్లిషు మాట్లాడే విధానం ఇబ్బందిగా ఉన్నా ఒకట్రెండు పర్యాయాలు అర్థమయ్యేలా వివరించారు. వారితో మాట్లాడం చాలా సరదా అనిపించింది.
- బండి రూపశ్రీ, 8వ తరగతి
ఎన్నో విషయాలు చెప్పారు
మనకు ఆరు సబ్జెక్టులు ఉంటే వారికి మొత్తం పది సబ్జెక్టులు ఉంటాయంట. సంగీతం, నాట్యం, క్రీడలు ఇవి కూడా వారికి సబ్జెక్టులేనని చెప్పారు. విదేశీ విద్యార్థులతో సంభాషించాలంటే ఏదోలా అనిపించింది. ఒకరిని ఒకరు చూసుకుంటూ మాట్లాడుకోవడం వల్ల బిడియం పోయింది. ఆ దేశంలోని తరగతి గదులు, విద్యావిధానం విద్యార్థుల మాటల్లో తెలుసుకోవడం చాలా ఆసక్తి అనిపించింది. - వీరంకి యుగంధరి, 9వ తరగతి
పట్టు పెంచాలని..
విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ (భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు) అభివృద్ధి చేసేందుకు నా వంతు కృషి చేస్తున్నాను. ఉన్నత చదువులు, ఉద్యోగాలు సాధించాలంటే విద్యార్థులకు ఆంగ్ల భాషపై పట్టు ఉండి తీరాలి. విదేశీ విద్యార్థులతో సంభాషించే ప్రయత్నంలో మన విద్యార్థులు స్వయంగా ఆంగ్లంలో ప్రశ్నలు తయారు చేసుకోవడం, వారితో ఏమేం సంభాషించాలో ముందుగా సంసిద్ధులు కావడం నాకెంతో సంతృప్తినిచ్చింది. - ఉల్లంగుంట వెంకటేశ్వరరావు, ఆంగ్ల ఉపాధ్యాయుడు
స్పెయిన్ ఉపాధ్యాయిని పిలార్ గ్రేసియాతో సంభాషణ..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుంటూరు జిల్లాలో ప్రబలిన డయేరియా.. 100 మందికి పైగా అస్వస్థత
[ 19-04-2024]
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాలలో డయేరియా ప్రబలింది. వాంతులు, విరేచనాలతో గ్రామంలో 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. -
దశ‘దిశ’లా.. ఆక్రందనలే..!
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వ పదవీకాలం ముగుస్తున్నా ఇప్పటికీ ఆ చట్టానికి కోరలు లేవు. దాన్ని పార్లమెంట్ ఆమోదించలేదు. ఉనికిలో లేని చట్టం గురించి పదేపదే ప్రచారం చేసుకోవడం జగన్ సర్కార్ తీరుగా మారింది. -
జీవితాన్ని కలరా‘జే’సింది..
[ 19-04-2024]
రేపల్లెకు చెందిన మధు ప్రభుత్వ మద్యం తాగి పక్షవాతానికి గురై మంచానికి పరిమితమయ్యాడు. చేతివృత్తి చేసుకుంటూ భార్య ఇద్దరు పిల్లలను పోషించుకునే అతను మద్యం తాగేవాడు. -
సమస్యలు విలీనమై.. బడికి దూరమై..
[ 19-04-2024]
పాఠశాలల విలీనం వల్ల లాభం లేకపోగా టీచర్లకు, పిల్లలకు బాగా అన్యాయం జరిగింది. కొందరు టీచర్లు దూరాన ఉన్న ఉన్నత పాఠశాలలకు వెళ్లలేక పదోన్నతులు వదులుకోవడంతో నష్టపోయారు. అదేవిధంగా పిల్లల పరంగా చూస్తే సర్కారీ బడులకు దూరమయ్యారు. -
ఆరోగ్యం చిదిమేసి.. బతుకుల్ని బుగ్గి‘జే’సి..
[ 19-04-2024]
మద్యపాన నిషేధం చేస్తామని జగన్మోహన్రెడ్డి ఓట్లు దండుకుని తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారు. స్వయంగా ప్రభుత్వమే మద్యం వ్యాపారానికి తెరతీసింది. నాసిరకం మద్యం పోసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. -
అండ నేనన్నావు.. గుదిబండలా మార్చావు..
[ 19-04-2024]
జిల్లాలో వైకాపా ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్నవి చాలా వరకు మూతపడ్డాయి. పత్తి ఆధారిత పరిశ్రమలైన జిన్నింగ్ పూర్తిగా ఎత్తేయగా.. స్పిన్నింగ్ మిల్లులు అదే దిశగా నడుస్తున్నాయి. -
యువనేతపై ఉప్పొంగిన అభిమానం
[ 19-04-2024]
లోకేశ్ తరఫున నామినేషన్ పత్రాల సమర్పణ సందర్భంగా గురువారం మంగళగిరిలో జనసేన, భాజపా, తెదేపా, ఎమ్మార్పీఎస్ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వినియోగానికి ఆటంకాలు
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇదే అదనుగా పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు అందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోకుండా వ్యూహాత్మకంగా ఉన్నతాధికారులు ఆటంకాలు కలిగిస్తున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. -
కోన ఆస్తుల విలువ రూ.24.20 కోట్లు
[ 19-04-2024]
బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి తన కుటుంబ ఆస్తుల విలువను రూ.24.20 కోట్లుగా గురువారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్నారు. -
నలిగిపోతున్న నాలుగో సింహం
[ 19-04-2024]
ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీసులు పగలు, రాత్రి కష్టపడుతుంటారు. శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో సంఘ విద్రోహశక్తుల చేతిలో ప్రాణత్యాగాలకు సైతం వెనకాడరు. -
కర్షకుల కష్టాలు కనిపించవా..?
[ 19-04-2024]
పెదవడ్లపూడి ఉన్నత వాహినిపై ఎత్తిపోతల పథకం పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆర్కే హామీ ఇచ్చారు. కానీ అమలు చేయడం మర్చిపోయారు. -
వైకాపా ప్రభుత్వ నిర్ణయ లోపం.. విద్యార్థులకు శాపం
[ 19-04-2024]
‘మీ పిల్లలు బడిలో భోజనం చేయకపోతే మీకు వస్తున్న ప్రభుత్వ పథకాలు నిలిచేపోయే అవకాశం ఉంది’అని తల్లిదండ్రుల సమావేశాల్లో ఉపాధ్యాయులు చెబుతున్నా.. నాణ్యత లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు -
‘అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం’
[ 19-04-2024]
అసమర్థ, అవినీతి పాలనకు చరమగీతం పాడుదామని గుంటూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కొల్లిపరలో గురువారం సాయంత్రం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడుతూ వైకాపా పాలకులకు పోలవరం పట్టలేదు, -
ఎప్పటికి తొలగిస్తారో!
[ 19-04-2024]
పట్టణ పరిధి జీబీసీ రహదారిలో విద్యుత్తు స్తంభానికి సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే రోశయ్య, వైకాపా నేతల ఫొటోలతో కూడిన బోర్డు ఉంది. -
మొదలైన నామినేషన్ల పర్వం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ క్రమంలో నెల రోజులుగా పలు విధాలుగా ప్రచార కార్యక్రమాలు చేపట్టిన పార్టీలు ఇప్పటికే నామినేషన్ పత్రాలు పూర్తి చేసి మంచి ముహూర్తం కోసం వేచి ఉన్నారు. -
ఫోన్పే చేయమన్నాడు.. అదృశ్యమయ్యాడు!
[ 19-04-2024]
అద్దంకి పురపాలక కార్యాలయం వద్ద మంచినీటి కుళాయి రుసుం చెల్లించేందుకు వచ్చిన వృద్ధుడ్ని ఓ ఘరానా దొంగ మోసగించాడు. ఈ సంఘటన గురువారం ఉదయం పురపాలక పన్నుల విభాగం వద్ద జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?