logo

కత్తితో పొడుచుకుని మహిళ బలవన్మరణం

మానసిక ఆందోళనతో ఓ మహిళ కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పట్టణంలోని అంబేడ్కర్‌ కాలనీకి చెందిన తానచింతల జానకమ్మ(70)కు ఇద్దరు కుమారులున్నారు. కుమారుల వద్ద చెరొక నెల ఉంటోంది.

Published : 25 Jan 2022 01:40 IST

వినుకొండ: మానసిక ఆందోళనతో ఓ మహిళ కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పట్టణంలోని అంబేడ్కర్‌ కాలనీకి చెందిన తానచింతల జానకమ్మ(70)కు ఇద్దరు కుమారులున్నారు. కుమారుల వద్ద చెరొక నెల ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల ఒకటో తేదీన అద్దె ఇంట్లో ఉంటున్న పెద్ద కుమారుడు లక్ష్మయ్య వద్దకు వచ్చింది. జనవరి 22న కుటుంబ సభ్యులు కూలి పనులకు వెళ్లిన తర్వాత జానకమ్మ కత్తితో పొడుచుకుందని ఇంటి యజమాని సురేష్‌ ఫోన్‌ చేయగా పెద్ద కుమారుడు వచ్చాడు. బాధితురాలిని గుంటూరు జిల్లా సమగ్ర ఆసుపత్రికి తీసికెళ్లగా చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని