ఓటీఎస్కు ఉద్యోగుల సమ్మె దెబ్బ!
ప్రభుత్వ రుణంతో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు జగనన్న శాశ్వత గృహ హక్కు పథకంలో వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్)ని వినియోగించుకోవడం ద్వారా గృహాలు సొంతం చేసుకోవచ్చని ప్రభుత్వం చెపుతోంది.
జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్టుడే: ప్రభుత్వ రుణంతో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు జగనన్న శాశ్వత గృహ హక్కు పథకంలో వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్)ని వినియోగించుకోవడం ద్వారా గృహాలు సొంతం చేసుకోవచ్చని ప్రభుత్వం చెపుతోంది. దీని కోసం లబ్ధిదారులకు అవగాహన కల్పించి నిర్ణయించిన మేరకు నగదు చెల్లించాలని అధికారులు, సిబ్బందికి లక్ష్యాలను నిర్ణయించి నగదు వసూళ్లు చేపట్టింది. జిల్లాలో మొత్తం 3,57.905 మంది లబ్ధిదారుల నుంచి రూ.390.65 కోట్లను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికి 99,389 మంది రూ.25 కోట్లను చెల్లించారు. వీరి పేరిట ఇళ్లు బదిలీ చేస్తూ గృహ హక్కు పత్రాలను గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. మరో 2,58,516 మంది నుంచి ఓటీఎస్ వసూళ్ల కోసం జిల్లా గృహనిర్మాణ సంస్థ అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లకు రోజు వారీ, వారం చొప్పున లక్ష్యాన్ని నిర్ణయించి పంపుతున్నారు. ఓటీఎస్ స్వచ్ఛందమేనని ప్రభుత్వం ప్రకటించినా ఆచరణలో మాత్రం అధికారులు, ఉద్యోగులను లబ్ధిదారుల వద్దకు పంపించి నగదు చెల్లించేలా ఒత్తిళ్లు చేస్తున్నారు.
25 నుంచి ఆందోళనల నేపథ్యంలో..
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 11వ పీఆర్సీలో తమకు అన్యాయం జరిగిందని, వేతనాలు తగ్గనున్నాయని ఉద్యోగ సంఘాలు ఆందోళనకు పిలుపు ఇచ్చాయి. ఈనెల 25 నుంచి సెలవులు పెట్టి నిరసన కార్యక్రమాల్లో ఉద్యోగులు పాల్గొననున్నారు. దీంతో ఓటీఎస్కు రాంరాం అనే పరిస్థితి నెలకొంది. ఫిబ్రవరి 7 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళతామని ప్రకటించిన దృష్ట్యా ఓటీఎస్ కూడా తాత్కాలికంగా నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సంఘాలు సమ్మెకు మద్దతు ప్రకటించాయి. జిల్లా గృహనిర్మాణ సంస్థకు ఇంజినీరింగ్ అసిస్టెంట్లు 408 మందిని డిప్యుటేషన్పై నియమించారు. వీరు జిల్లాలో వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో నిరుపేదలకు మంజూరు చేసిన గృహాలను లబ్ధిదారులతో నిర్మాణాలు చేయించడంలో సహకారం అందజేస్తున్నారు. ఇప్పుడు వీరు కూడా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటే నిర్మాణాల పనులు కూడా తాత్కాలికంగా ఆగిపోనున్నాయి. జిల్లా గృహనిర్మాణ సంస్థ అధికారులు ఉద్యోగులను బలవంతంగా విధుల్లోకి హాజరుకావాలని చెప్పే పరిస్థితి లేదు. మంగళవారం వ్యక్తిగతంగా సెలవులు పెట్టి ఆందోళనలో పాల్గొనేందుకు ఉద్యోగులు సిద్ధమయ్యారు. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య చర్చలు జరిగి ఈ సమస్యకు పరిష్కారం లభించే వరకు ఓటీఎస్, గృహాల నిర్మాణాలు నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అ‘తీగ’తిలేని ‘మార్గం’
[ 20-04-2024]
ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఏదైనా తెదేపా ప్రభుత్వం ప్రారంభించినది అయితే పూర్తి చేయం. అవసరమైతే పనికిరాకుండా చేస్తాం ఇది జగన్ సర్కారు ఐదేళ్లుగా అవలంభిస్తున్న తీరు. -
కూలేదాకా.. కళ్లప్పగిస్తారా!
[ 20-04-2024]
బీటలు వారిన స్తంభాలు.. పడిపోయిన రెయిలింగ్లు.. కూలిన పిట్టగోడలు.. తుప్పుపట్టి బయటకు కనిపిస్తున్న ఇనుప చువ్వలు, వంతెనలపైనే గోతులు.. ఇలా శిథిలావస్థకు చేరిన వారథులు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రమాదాలకు కారణమవుతున్నాయి -
ఉడకని జీడిపప్పు
[ 20-04-2024]
వేటపాలెం అంటేనే జీడిపప్పు పరిశ్రమకు పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో వ్యాపారులు ఒకప్పుడు స్థానికంగా దొరికే జీడిపిక్కలను కొనుగోలు చేసి వాటిని కాల్చి పప్పుగా తయారు చేసి విక్రయించేవారు. -
నేరచరిత్ర లేని సచ్ఛీలుడు తెన్నేటి
[ 20-04-2024]
బాపట్ల లోక్సభ స్థానం తెదేపా ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ తనకు రూ.15.93 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు శుక్రవారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో ప్రకటించారు -
మందులో ముంచేసి.. పీల్చి పిప్పి చేసి..
[ 20-04-2024]
రాష్ట్రంలో దశల వారీగా మద్యపాన నిషేధం విధిస్తాం. మూడు విడతల్లో మద్యం దుకాణాలు తగ్గించుకుంటూ వెళ్లి పూర్తిగా ఎత్తేస్తాం. మందు ముట్టుకోవాలంటేనే షాక్ కొట్టేలా ధరలు పెంచుతాం. మద్యపాన నిషేధం చేశాకే 2024లో ఓట్లు అడగడానికి వస్తాను. -
ఎంపీ 1, ఎమ్మెల్యేకు 19 నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. రెండో రోజున గుంటూరు పార్లమెంట్ స్థానానికి కిలారి వెంకటరోశయ్య వైకాపా తరఫున నామినేషన్ను దాఖలు చేశారు -
కొనసాగుతున్న ఒత్తిళ్లతో వాలంటీర్ల రాజీనామా
[ 20-04-2024]
ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమానులో 20 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు పంచాయతీ కార్యదర్శి పూర్ణచంద్రరావు తెలిపారు. -
అట్టహాసంగా శ్రావణ్కుమార్ నామినేషన్
[ 20-04-2024]
తాడికొండ నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ శుక్రవారం తాడికొండ ఆర్వో గంగరాజుకు నామినేషన్ పత్రాలు అందజేశారు -
ఎన్నికల వేళా.. ఆగని దోపిడీ
[ 20-04-2024]
అధికారం అండగా ఉందని ఏం చేసినా అడ్డుకునేవారు లేరని వైకాపా నేతలు బరితెగించారు. కృష్ణానదిలో రాత్రివేళ అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేస్తూ తరలించి జేబులు నింపుకొంటున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా వారికి అడ్డంకి లేకుండా పోయింది. -
ఏళ్లుగా ఉద్యోగులకు శిక్షే
[ 20-04-2024]
అనేక సంస్కరణలు తీసుకొచ్చామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే సీఎం జగన్ మాటలు ఎండమావులుగానే మిగిలిపోతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు సమగ్ర శిక్షాలో పని చేస్తున్న ఉద్యోగులకు ఎంటీఎస్, హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తామని.. పలు హామీలు ఇచ్చి వాటిని గాలికొదిలేశారు. -
తాగునీరివ్వకపోతే బతికేదెలా..?
[ 20-04-2024]
తమకు తాగునీటిని కుళాయిల ద్వారా సరఫరా చేయడం లేదని ప్రత్తిపాడులోని మహబూబ్ నగర్ కాలనీ వాసులు శుక్రవారం గుంటూరు- పర్చూరు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. -
విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంతో జేఎల్ఎం మృతి
[ 20-04-2024]
విద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా జేఎల్ఎం (జూనియర్ లైన్మెన్) మృతి చెందిన ఘటన ఇది. విద్యుత్తు శాఖ ఉద్యోగులు, బాధితుల కథనం ప్రకారం... పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురానికి చెందిన అడుసుమల్లి సుబ్రహ్మణ్యం, చిలకమ్మ దంపతుల పెద్దకుమారుడు రాజేశ్ (27) ఇదే గ్రామంలో జేఎల్ఎంగా పనిచేస్తున్నారు. -
కలగా మినీ రైతుబజార్లు
[ 20-04-2024]
నాడు అలా...గత ప్రభుత్వంలో వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన కూరగాయలు అందించేందుకు 2018లో పొన్నూరు పట్టణం నిడుబ్రోలు రైల్వేస్టేషన్కు వెళ్లే మార్గంలో రైతుబజార్ను అందుబాటులోకి తెచ్చారు. ఆ రైతుబజార్లో 22 దుకాణాలను ఏర్పాటు చేశారు. -
ఓటు హక్కు వినియోగానికి కార్మికులకు సెలవు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో మే 13న జరగనున్న పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి కార్మికులకు సెలవు ప్రకటించినట్లు మూడో జోన్ కార్మిక శాఖ ఇన్ఛార్జి సంయుక్త కమిషనర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు -
మద్యం మత్తు.. కుటుంబాలు చిత్తు
[ 20-04-2024]
గత నెల 18వ తేదీన తెనాలి మున్సిపల్ కార్యాలయం చెంతనే నిర్మాణంలో ఉన్న మార్కెట్ భవంతిలో రవికిరణ్ (37) అనే వ్యక్తి సజీవ దహనమయ్యాడు. కారణం మద్యం మత్తు. మద్యం తాగి చెంతనే దోమల కాయిల్ వెలిగించుకుని నిద్రపోయిన అభాగ్యుడు కాయిల్ దుప్పటికి తగిలి మంటలు చెలరేగినా మత్తు వల్ల లేవలేక కాలిపోయాడు
తాజా వార్తలు (Latest News)
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు