తెరపైకి3 జిల్లాలు
గుంటూరు జిల్లా పరిధిలో ప్రస్తుతం ఉన్న గుంటూరు, తెనాలి కేంద్రంగా రెవెన్యూ డివిజన్లు కొనసాగిస్తారు. అయితే ఆయా డివిజన్ల పరిధిలో ఉన్న మండలాలు తగ్గనున్నాయి. రెండు డివిజన్లను 18 మండలాలతో ఏర్పాటు చేయనున్నారు. 2443 చదరపు కిలోమీటర్లతో ఏర్పడనుంది. ఇందులో 2011 జనాభా లెక్కల ప్రకారం
పల్నాడు, బాపట్ల, గుంటూరు ఏర్పాటుకు ప్రతిపాదనలు
ఈనాడు, గుంటూరు గుంటూరు జిల్లా పరిధిలో ప్రస్తుతం ఉన్న గుంటూరు, తెనాలి కేంద్రంగా రెవెన్యూ డివిజన్లు కొనసాగిస్తారు. అయితే ఆయా డివిజన్ల పరిధిలో ఉన్న మండలాలు తగ్గనున్నాయి. రెండు డివిజన్లను 18 మండలాలతో ఏర్పాటు చేయనున్నారు. 2443 చదరపు కిలోమీటర్లతో ఏర్పడనుంది. ఇందులో 2011 జనాభా లెక్కల ప్రకారం 20.91 లక్షల మంది నివసిస్తున్నారు
ప్రస్తుత జిల్లా పరిధిలోని మూడు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో మూడు జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టరుతో రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు సమీక్షించారు. బాపట్ల, నరసరావుపేట, గుంటూరు కేంద్రాలుగా మూడు జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. బాపట్ల జిల్లాలో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లు రానున్నాయి. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న రెవెన్యూ డివిజన్ల పరిధి కుదింపు, పెంచడం జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ప్రతిపాదిత వివరాలు ఇలా ..
బాపట్ల జిల్లా..
గుంటూరు, ప్రకాశం జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 మండలాలతో 3829 చదరపు కిలోమీటర్ల విసీ్తీర్ణంతో 15.87లక్షల జనాభాతో బాపట్ల కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుచేయనున్నారు. బాపట్ల పార్లమెంటు పరిధిలోని సంతనూతలపాడు నియోజకవర్గాన్ని బాపట్ల జిల్లాలో కలపకుండా మినహాయించారు. సంతనూతలపాడు ఒంగోలు పట్టణానికి 20 కిలోమీటర్ల లోపలే ఉండటం, బాపట్లకు 83 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో బాపట్ల నుంచి మినహాయించి ఒంగోలు జిల్లాలో కలపనున్నారు. బాపట్ల పార్లమెంటు పరిధిలో ఒక్క రెవెన్యూ డివిజన్ కూడా ప్రస్తుతం లేనందున బాపట్ల, చీరాల కేంద్రంగా రెండు డివిజన్లు ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదన ఉంది. తెనాలి డివిజన్లో ఉన్న వేమూరు, రేపల్లె, బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గాల మండలాలతో బాపట్ల డివిజన్, పర్చూరు, అద్దంకి, చీరాల అసెంబ్లీ నియోజకవర్గాలను ఒంగోలు నుంచి వేరుచేసి చీరాల డివిజన్ ఏర్పాటుచేసే అవకాశముంది.
పల్నాడు జిల్లా..
నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని 7 ఆసెంబ్లీ నియోజకవర్గాలతో కొత్తగా నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ఏర్పాటుచేయనున్నారు. 28 మండలాల పరిధిలో 7298 చదరపు కిలోమీటర్ల విసీ్తీర్ణంలో 20.42 లక్షల జనాభాతో జిల్లా ఏర్పాటుకానుంది. ఇక్కడ ఉన్న సబ్కలెక్టర్ కార్యాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాల భవనాలు పరిపాలనా కార్యాలయాలకు అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని పెదకూరపాడు, సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రస్తుతం గుంటూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నాయి. పెదకూరపాడులోని అన్ని మండలాలను గురజాల రెవెన్యూ డివిజన్ కిందకు తీసుకువస్తారు. అదే విధంగా గుంటూరు డివిజన్లోని సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్న మూడు మండలాలను నరసరావుపేట రెవెన్యూ డివిజన్లో కలుపుతారు.
నరసరావుపేట రెవెన్యూ డివిజన్
మొత్తం మండలాలు : 14
విసీ్తీర్ణం : 3427 చదరపు కిలోమీటర్లు
జనాభా (2011 లెక్కల ప్రకారం) : 11.43 లక్షలు
మండలాలు : ప్రస్తుతం డివిజన్లో ఉన్న 11 మండలాలతోపాటు సత్తెనపల్లి, రాజుపాలెం, ముప్పాళ్ల మండలాలను గుంటూరు డివిజన్ నుంచి నరసరావుపేట డివిజన్లో కలపనున్నారు.
గురజాల రెవెన్యూ డివిజన్
మొత్తం మండలాలు : 14
విసీ్తీర్ణం : 3871 చదరపు కిలోమీటర్లు
జనాభా( 2011 లెక్కల ప్రకారం) : 8.99 లక్షలు
మండలాలు : ప్రస్తుతం ఉన్న 9 మండలాలతోపాటు బెల్లంకొండ, అచ్చంపేట, క్రోసూరు, అమరావతి, పెదకూరపాడు మండలాలు గుంటూరు డివిజన్ నుంచి గురజాల డివిజన్లోకి కలపనున్నారు.
బాపట్ల రెవెన్యూ డివిజన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వంతెనలు కూలుతున్నా.. ప్రాణాలు పోతున్నా.. కళ్లకు గంతలేనా..
[ 20-04-2024]
బీటలు వారిన పిల్లర్లు.. పడిపోయిన రెయిలింగ్లు.. కూలిన పిట్టగోడలు.. తుప్పుపట్టి బయటకు కనిపిస్తున్న ఇనుప చువ్వలు, వంతెనలపైనే గోతులు.. ఇలా శిథిలావస్థకు చేరిన వారధులు జిల్లాలో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కీలకమైన వంతెనల జీవితకాలం ముగిసినా నిధుల కొరతతో కొత్తవి నిర్మించడం లేదు. -
అ‘తీగ’తిలేని ‘మార్గం’
[ 20-04-2024]
ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఏదైనా తెదేపా ప్రభుత్వం ప్రారంభించినది అయితే పూర్తి చేయం. అవసరమైతే పనికిరాకుండా చేస్తాం ఇది జగన్ సర్కారు ఐదేళ్లుగా అవలంభిస్తున్న తీరు. -
కూలేదాకా.. కళ్లప్పగిస్తారా!
[ 20-04-2024]
బీటలు వారిన స్తంభాలు.. పడిపోయిన రెయిలింగ్లు.. కూలిన పిట్టగోడలు.. తుప్పుపట్టి బయటకు కనిపిస్తున్న ఇనుప చువ్వలు, వంతెనలపైనే గోతులు.. ఇలా శిథిలావస్థకు చేరిన వారథులు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రమాదాలకు కారణమవుతున్నాయి -
ఉడకని జీడిపప్పు
[ 20-04-2024]
వేటపాలెం అంటేనే జీడిపప్పు పరిశ్రమకు పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో వ్యాపారులు ఒకప్పుడు స్థానికంగా దొరికే జీడిపిక్కలను కొనుగోలు చేసి వాటిని కాల్చి పప్పుగా తయారు చేసి విక్రయించేవారు. -
నేరచరిత్ర లేని సచ్ఛీలుడు తెన్నేటి
[ 20-04-2024]
బాపట్ల లోక్సభ స్థానం తెదేపా ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ తనకు రూ.15.93 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు శుక్రవారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో ప్రకటించారు -
మందులో ముంచేసి.. పీల్చి పిప్పి చేసి..
[ 20-04-2024]
రాష్ట్రంలో దశల వారీగా మద్యపాన నిషేధం విధిస్తాం. మూడు విడతల్లో మద్యం దుకాణాలు తగ్గించుకుంటూ వెళ్లి పూర్తిగా ఎత్తేస్తాం. మందు ముట్టుకోవాలంటేనే షాక్ కొట్టేలా ధరలు పెంచుతాం. మద్యపాన నిషేధం చేశాకే 2024లో ఓట్లు అడగడానికి వస్తాను. -
ఎంపీ 1, ఎమ్మెల్యేకు 19 నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. రెండో రోజున గుంటూరు పార్లమెంట్ స్థానానికి కిలారి వెంకటరోశయ్య వైకాపా తరఫున నామినేషన్ను దాఖలు చేశారు -
కొనసాగుతున్న ఒత్తిళ్లతో వాలంటీర్ల రాజీనామా
[ 20-04-2024]
ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమానులో 20 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు పంచాయతీ కార్యదర్శి పూర్ణచంద్రరావు తెలిపారు. -
అట్టహాసంగా శ్రావణ్కుమార్ నామినేషన్
[ 20-04-2024]
తాడికొండ నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ శుక్రవారం తాడికొండ ఆర్వో గంగరాజుకు నామినేషన్ పత్రాలు అందజేశారు -
ఎన్నికల వేళా.. ఆగని దోపిడీ
[ 20-04-2024]
అధికారం అండగా ఉందని ఏం చేసినా అడ్డుకునేవారు లేరని వైకాపా నేతలు బరితెగించారు. కృష్ణానదిలో రాత్రివేళ అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేస్తూ తరలించి జేబులు నింపుకొంటున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా వారికి అడ్డంకి లేకుండా పోయింది. -
ఏళ్లుగా ఉద్యోగులకు శిక్షే
[ 20-04-2024]
అనేక సంస్కరణలు తీసుకొచ్చామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే సీఎం జగన్ మాటలు ఎండమావులుగానే మిగిలిపోతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు సమగ్ర శిక్షాలో పని చేస్తున్న ఉద్యోగులకు ఎంటీఎస్, హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తామని.. పలు హామీలు ఇచ్చి వాటిని గాలికొదిలేశారు. -
తాగునీరివ్వకపోతే బతికేదెలా..?
[ 20-04-2024]
తమకు తాగునీటిని కుళాయిల ద్వారా సరఫరా చేయడం లేదని ప్రత్తిపాడులోని మహబూబ్ నగర్ కాలనీ వాసులు శుక్రవారం గుంటూరు- పర్చూరు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. -
విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంతో జేఎల్ఎం మృతి
[ 20-04-2024]
విద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా జేఎల్ఎం (జూనియర్ లైన్మెన్) మృతి చెందిన ఘటన ఇది. విద్యుత్తు శాఖ ఉద్యోగులు, బాధితుల కథనం ప్రకారం... పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురానికి చెందిన అడుసుమల్లి సుబ్రహ్మణ్యం, చిలకమ్మ దంపతుల పెద్దకుమారుడు రాజేశ్ (27) ఇదే గ్రామంలో జేఎల్ఎంగా పనిచేస్తున్నారు. -
కలగా మినీ రైతుబజార్లు
[ 20-04-2024]
నాడు అలా...గత ప్రభుత్వంలో వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన కూరగాయలు అందించేందుకు 2018లో పొన్నూరు పట్టణం నిడుబ్రోలు రైల్వేస్టేషన్కు వెళ్లే మార్గంలో రైతుబజార్ను అందుబాటులోకి తెచ్చారు. ఆ రైతుబజార్లో 22 దుకాణాలను ఏర్పాటు చేశారు. -
ఓటు హక్కు వినియోగానికి కార్మికులకు సెలవు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో మే 13న జరగనున్న పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి కార్మికులకు సెలవు ప్రకటించినట్లు మూడో జోన్ కార్మిక శాఖ ఇన్ఛార్జి సంయుక్త కమిషనర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు -
మద్యం మత్తు.. కుటుంబాలు చిత్తు
[ 20-04-2024]
గత నెల 18వ తేదీన తెనాలి మున్సిపల్ కార్యాలయం చెంతనే నిర్మాణంలో ఉన్న మార్కెట్ భవంతిలో రవికిరణ్ (37) అనే వ్యక్తి సజీవ దహనమయ్యాడు. కారణం మద్యం మత్తు. మద్యం తాగి చెంతనే దోమల కాయిల్ వెలిగించుకుని నిద్రపోయిన అభాగ్యుడు కాయిల్ దుప్పటికి తగిలి మంటలు చెలరేగినా మత్తు వల్ల లేవలేక కాలిపోయాడు