logo

గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటు చేయాలి

కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాలను గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లాగా ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. పల్నాడుకి అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు.

Published : 27 Jan 2022 02:27 IST

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే : కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాలను గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లాగా ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. పల్నాడుకి అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. పల్నాడు ప్రాంతం పారిశ్రామికంగా, ఆర్థికంగా, వ్యవసాయపరంగా ముందుందని పేర్కొన్నారు. అపారమైన ఖనిజసంపద, సిమెంటు ఫ్యాక్టరీలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాంతానికి జాతీయ రైల్వేమార్గం, రాష్ట్ర, జాతీయ రహదారులు సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. గురజాల కేంద్రంగా జిల్లాని ఏర్పాటు చేయాలని లేకపోతే పార్టీలకు అతీతంగా ప్రజలతో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని