శిక్షణ ఇస్తూ..భవితకు భరోసా పెంచుతూ..
సాంకేతిక రంగంలో అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయి. కొవిడ్ అన్ని రంగాలను దెబ్బతీసినా సాఫ్ట్వేర్ రంగం మాత్రం యువతకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు తమకు కావాల్సిన విధంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఆయా సంస్థలు కృషి చేస్తున్నాయి.
మైక్రోసాప్ట్లో యువతకు ఇంటర్న్షిప్లు
ప్రయోగశాలలో ప్రాజెక్టు చేస్తున్న యశ్వంత్రెడ్డి
న్యూస్టుడే, నరసరావుపేట అర్బన్, యడ్లపాడు సాంకేతిక రంగంలో అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయి. కొవిడ్ అన్ని రంగాలను దెబ్బతీసినా సాఫ్ట్వేర్ రంగం మాత్రం యువతకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు తమకు కావాల్సిన విధంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఆయా సంస్థలు కృషి చేస్తున్నాయి. అదే కోవలో మైక్రోసాప్ట్ సాంకేతిక రంగ విద్యార్థులకు మైక్రోసాప్ట్ వర్చువల్ ఇంటర్న్షిప్ ప్రోగాం-ఫ్యూచర్ రెడీ ట్యాలెంట్ కార్యక్రమాన్ని తీసుకుంది. ఇందులో రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులకు శిక్షణతో పాటు ప్రాజెక్టులు చేసేందుకు అవకాశాలు కల్పిస్తోంది. ఈ ఏడాది లక్ష మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకుంటే వారిలో వెయ్యి మంది విజయవంతంగా ప్రాజెక్టులను పూర్తి చేశారు. వారికి భవిష్యత్తులో మైక్రోసాప్ట్ లేదా అనుబంధ సంస్థల్లో ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఉండనుంది.
ఆరునెలలు ఆన్లైన్ శిక్షణ
మైక్రోసాఫ్ట్ చేపట్టిన కార్యక్రమంలో రిజిస్టర్ అయిన విద్యార్థులకు ఆరు నెలల పాటు ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇస్తారు. యజుర్ డాట్నెట్కు అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించడమే లక్ష్యంగా కోర్సులు ఉంటాయి. క్లౌడ్ కంప్యూటింగ్కు సంబంధించి బ్యాకింగ్, ఆటోమొబైల్, విద్య హెల్త్కేర్ తదితర రంగాల్లో నాణ్యమైన సేవలందించేందుకు నిపుణులను తయారు చేసేలా శిక్షణ తరగతులు ఉంటాయి, వీటితో పాటు మరో ఎనిమిది సెల్ఫ్లెర్నింగ్ మాడ్యూల్స్ అందుబాటులో ఉంటాయి. వీటిని పూర్తి చేసిన విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ ప్రణాళికలకు అనుగుణంగా ప్రాజెక్టులు చేసేందుకు అవకాశం ఇస్తారు. నిర్ణీత గడువు, బడ్జెట్ లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా లక్ష మంది విద్యార్థులు రిజిస్టర్ అయితే వారిలో కేవలం వెయ్యిమంది మాత్రమే పూర్తి చేశారు. ఇందులో నరసరావుపేట ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన కిక్కురు పృథ్వీ యశ్వంత్రెడ్డి విజయం సాధించాడు, మైక్రోసాప్ట్ సంస్థ అతనికి ధ్రువపత్రం జారీ చేసింది.
విద్యార్థిని అభినందిస్తున్న కళాశాల ప్రతినిధులు
రైతుకు ఉపయుక్తంగా ప్రాజెక్టు
ఫిరంగిపురానికి చెందిన యశ్వంత్ రెడ్డి ఎన్ఈసీలో మెకానికల్ విభాగంలో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి బాలశౌరిరెడ్డి ధాన్యం వ్యాపారి, మైక్రోసాఫ్ట్ వర్చువల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో పేర్లు నమోదు చేసుకుని ఆన్లైన్ తరగతులకు హాజరయ్యాడు. తర్వాత సంస్థ 100 డాలర్ల విలువైన ప్రాజెక్టును విద్యార్థికి ఇచ్చింది. సంస్థ ఇచ్చిన కిట్ ఆధారంగా వ్యవసాయం, విద్య, జీవనశైలి, హెల్త్కేర్ రంగాల్లో నచ్చిన అంశంపై ప్రాజెక్టు చేయాలని సూచించింది. విద్యార్థి వ్యవసాయరంగాన్ని ఎంచుకుని మైక్రోసాఫ్ట్ యజుర్లోని కృత్రిమ మేధస్సు, మిషన్లెర్నింగ్ తదితర సాఫ్ట్వేర్లను ఉపయోగించి ప్రాజెక్టు 80 డాలర్ల బడ్జెట్తో పూర్తి చేశాడు. విత్తనం మెలకెత్తిన నాటి నుంచి పంట రైతు చేతికి వచ్చే వరకూ అన్ని సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కారం సూచించేందుకు దోహదపడేలా ప్రాజెక్టు చేశాడు. దీంతో సంస్థ గుర్తించిన నిపుణుల్లో ఒకరుగా మారారు. భవిష్యత్తు డేవాబ్స్ ఇంజినీర్గా ఎదగాలన్న లక్ష్యాన్ని విధించుకున్నట్లు యశ్వంత్రెడ్డి తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుంటూరు జిల్లాలో ప్రబలిన డయేరియా.. 100 మందికి పైగా అస్వస్థత
[ 19-04-2024]
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాలలో డయేరియా ప్రబలింది. వాంతులు, విరేచనాలతో గ్రామంలో 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. -
దశ‘దిశ’లా.. ఆక్రందనలే..!
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వ పదవీకాలం ముగుస్తున్నా ఇప్పటికీ ఆ చట్టానికి కోరలు లేవు. దాన్ని పార్లమెంట్ ఆమోదించలేదు. ఉనికిలో లేని చట్టం గురించి పదేపదే ప్రచారం చేసుకోవడం జగన్ సర్కార్ తీరుగా మారింది. -
జీవితాన్ని కలరా‘జే’సింది..
[ 19-04-2024]
రేపల్లెకు చెందిన మధు ప్రభుత్వ మద్యం తాగి పక్షవాతానికి గురై మంచానికి పరిమితమయ్యాడు. చేతివృత్తి చేసుకుంటూ భార్య ఇద్దరు పిల్లలను పోషించుకునే అతను మద్యం తాగేవాడు. -
సమస్యలు విలీనమై.. బడికి దూరమై..
[ 19-04-2024]
పాఠశాలల విలీనం వల్ల లాభం లేకపోగా టీచర్లకు, పిల్లలకు బాగా అన్యాయం జరిగింది. కొందరు టీచర్లు దూరాన ఉన్న ఉన్నత పాఠశాలలకు వెళ్లలేక పదోన్నతులు వదులుకోవడంతో నష్టపోయారు. అదేవిధంగా పిల్లల పరంగా చూస్తే సర్కారీ బడులకు దూరమయ్యారు. -
ఆరోగ్యం చిదిమేసి.. బతుకుల్ని బుగ్గి‘జే’సి..
[ 19-04-2024]
మద్యపాన నిషేధం చేస్తామని జగన్మోహన్రెడ్డి ఓట్లు దండుకుని తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారు. స్వయంగా ప్రభుత్వమే మద్యం వ్యాపారానికి తెరతీసింది. నాసిరకం మద్యం పోసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. -
అండ నేనన్నావు.. గుదిబండలా మార్చావు..
[ 19-04-2024]
జిల్లాలో వైకాపా ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్నవి చాలా వరకు మూతపడ్డాయి. పత్తి ఆధారిత పరిశ్రమలైన జిన్నింగ్ పూర్తిగా ఎత్తేయగా.. స్పిన్నింగ్ మిల్లులు అదే దిశగా నడుస్తున్నాయి. -
యువనేతపై ఉప్పొంగిన అభిమానం
[ 19-04-2024]
లోకేశ్ తరఫున నామినేషన్ పత్రాల సమర్పణ సందర్భంగా గురువారం మంగళగిరిలో జనసేన, భాజపా, తెదేపా, ఎమ్మార్పీఎస్ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వినియోగానికి ఆటంకాలు
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇదే అదనుగా పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు అందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోకుండా వ్యూహాత్మకంగా ఉన్నతాధికారులు ఆటంకాలు కలిగిస్తున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. -
కోన ఆస్తుల విలువ రూ.24.20 కోట్లు
[ 19-04-2024]
బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి తన కుటుంబ ఆస్తుల విలువను రూ.24.20 కోట్లుగా గురువారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్నారు. -
నలిగిపోతున్న నాలుగో సింహం
[ 19-04-2024]
ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీసులు పగలు, రాత్రి కష్టపడుతుంటారు. శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో సంఘ విద్రోహశక్తుల చేతిలో ప్రాణత్యాగాలకు సైతం వెనకాడరు. -
కర్షకుల కష్టాలు కనిపించవా..?
[ 19-04-2024]
పెదవడ్లపూడి ఉన్నత వాహినిపై ఎత్తిపోతల పథకం పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆర్కే హామీ ఇచ్చారు. కానీ అమలు చేయడం మర్చిపోయారు. -
వైకాపా ప్రభుత్వ నిర్ణయ లోపం.. విద్యార్థులకు శాపం
[ 19-04-2024]
‘మీ పిల్లలు బడిలో భోజనం చేయకపోతే మీకు వస్తున్న ప్రభుత్వ పథకాలు నిలిచేపోయే అవకాశం ఉంది’అని తల్లిదండ్రుల సమావేశాల్లో ఉపాధ్యాయులు చెబుతున్నా.. నాణ్యత లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు -
‘అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం’
[ 19-04-2024]
అసమర్థ, అవినీతి పాలనకు చరమగీతం పాడుదామని గుంటూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కొల్లిపరలో గురువారం సాయంత్రం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడుతూ వైకాపా పాలకులకు పోలవరం పట్టలేదు, -
ఎప్పటికి తొలగిస్తారో!
[ 19-04-2024]
పట్టణ పరిధి జీబీసీ రహదారిలో విద్యుత్తు స్తంభానికి సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే రోశయ్య, వైకాపా నేతల ఫొటోలతో కూడిన బోర్డు ఉంది. -
మొదలైన నామినేషన్ల పర్వం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ క్రమంలో నెల రోజులుగా పలు విధాలుగా ప్రచార కార్యక్రమాలు చేపట్టిన పార్టీలు ఇప్పటికే నామినేషన్ పత్రాలు పూర్తి చేసి మంచి ముహూర్తం కోసం వేచి ఉన్నారు. -
ఫోన్పే చేయమన్నాడు.. అదృశ్యమయ్యాడు!
[ 19-04-2024]
అద్దంకి పురపాలక కార్యాలయం వద్ద మంచినీటి కుళాయి రుసుం చెల్లించేందుకు వచ్చిన వృద్ధుడ్ని ఓ ఘరానా దొంగ మోసగించాడు. ఈ సంఘటన గురువారం ఉదయం పురపాలక పన్నుల విభాగం వద్ద జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్