logo

కొవిడ్‌ మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం

బాపట్ల నియోజకవర్గంలో ఆర్య వైశ్య కుటుంబాల్లో పేదరికంతో ఉన్న వారిలో ఎవరైనా కొవిడ్‌తో మృతి చెందితే వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించడానికి ఆ సామాజిక వర్గానికి చెందిన ఎన్‌.సుధారాణి, ఎన్‌.హనుమాన్‌

Published : 27 Jan 2022 02:27 IST

బాపట్ల పట్టణం, న్యూస్‌టుడే : బాపట్ల నియోజకవర్గంలో ఆర్య వైశ్య కుటుంబాల్లో పేదరికంతో ఉన్న వారిలో ఎవరైనా కొవిడ్‌తో మృతి చెందితే వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించడానికి ఆ సామాజిక వర్గానికి చెందిన ఎన్‌.సుధారాణి, ఎన్‌.హనుమాన్‌ (యూఎస్‌ఏ) దంపతులు ముందుకు వచ్చారు. బాపట్లకు చెందిన గుర్రం పద్మనాభరావు కుమార్తె, అల్లుడు యూఎస్‌ఏలో ఉంటున్నారు. పేద ఆర్యవైశ్య కుటుంబంలో ఎవరైనా కొవిడ్‌తో చనిపోతే వారి కుటుంబ సభ్యులకు రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని ఇవ్వడానికి నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. వారి పూర్తి వివరాలను అంబేడ్కర్‌ విగ్రహం కూడలిలోని పద్మ జనరల్‌ స్టోర్స్‌లో తెలపాలని దుకాణం యజమాని గుర్రం పద్మనాభరావు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని