logo

రోడ్డు ప్రమాదంలో వృద్ధుని మృతి

రేపల్లెలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. నగరం మండలం మంత్రిపాలేనికి చెందిన చేమలమూడి శివప్రసాద్‌ (62) ద్విచక్ర వాహనంపై రేపల్లె పాత పట్టణం

Published : 27 Jan 2022 02:27 IST

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే : రేపల్లెలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. నగరం మండలం మంత్రిపాలేనికి చెందిన చేమలమూడి శివప్రసాద్‌ (62) ద్విచక్ర వాహనంపై రేపల్లె పాత పట్టణం వైపు వెళుతుండగా.. స్థానిక పండ్ల మార్కెట్‌ సమీపంలో వెనుక నుంచి వస్తున్న లారీ ఢీ కొంది. ఇది గమనించిన స్థానికులు వృద్ధున్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ వృద్ధుడు మరణించాడు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సీఐ సూర్యనారాయణ  తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని