ఆనంద క్షణాన.. అంతులేని విషాదం
కుమారున్ని ఉన్నత చదువులు చదివించేందుకు విమానం ఎక్కించి పంపుతున్నామన్న ఆనందం.. కొద్ది గంటలు కూడా నిలవలేదు. కష్టపడి.. కుమారులను ప్రయోజకులను చేశాననుకున్న ఆ తండ్రి ఆనందంలో ఉండగానే.. విధి వక్రీకరించి.. అతనితో పాటు పెద్ద కుమారున్ని
ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. పేట వాసుల మృతి
భర్త, పెద్ద కుమారుని మృతితో భార్య దిగ్భ్రాంతి
సోదా వెంకట్రావు (పాతచిత్రం) ప్రసన్నకుమార్ (పాతచిత్రం)
చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్టుడే : కుమారున్ని ఉన్నత చదువులు చదివించేందుకు విమానం ఎక్కించి పంపుతున్నామన్న ఆనందం.. కొద్ది గంటలు కూడా నిలవలేదు. కష్టపడి.. కుమారులను ప్రయోజకులను చేశాననుకున్న ఆ తండ్రి ఆనందంలో ఉండగానే.. విధి వక్రీకరించి.. అతనితో పాటు పెద్ద కుమారున్ని ఈ లోకానికి దూరం చేసింది. చిలకలూరిపేట పట్టణం పండరీపురం నీళ్ల ట్యాంకుల సమీపంలో నివాసం ఉంటున్న కుటుంబం ఈ విషాదం బారిన పడింది. కుటుంబ సభ్యులు, బంధువుల వివరాల మేరకు.. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం రుద్రగ్రామం నుంచి చాలా ఏళ్ల క్రితం మూడు కుటుంబాలు చిలకలూరిపేట పట్టణానికి వచ్చాయి. వారిలో మూడోవాడైన సోదా వెంకట్రావు పండరీపురం నీళ్ల ట్యాంకుల ఎదురుగా ఇల్లు కట్టుకుని అక్కడే ఉంటూ ఇంటి ముందు చిల్లర దుకాణం పెట్టుకున్నాడు. వెంకట్రావుకు భార్య కళావతి, కుమారుడు ప్రసన్నకుమార్, భాస్కర్ ఉన్నారు. ఇద్దరు పిల్లలను కష్టపడి చదివించాడు. పెద్ద కుమారుడు ప్రసన్నకుమార్ బి.టెక్ పూర్తిచేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా బెంగళూరులో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఇంటి నుంచి విధులు నిర్వహిస్తున్నాడు.
చిన్న కుమారున్ని ఉన్నత చదువులకు పంపాలని..
రెండు దశాబ్దాలుగా చిల్లర దుకాణం నిర్వహిస్తున్న వెంకట్రావు జీవితంలో కాస్తంత స్థిరపడటంతో పాటు పెద్ద కుమారునికి ఉద్యోగం కూడా రావడంతో చిన్న కుమారుడు భాస్కర్ను ఉన్నత చదువులు చదివించాలని నిర్ణయించుకున్నాడు. దానికి సంబంధించి అమెరికాలోని న్యూయార్క్కు పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. హైదరాబాద్లో ఉన్న భాస్కర్ నేరుగా చెన్నై చేరుకున్నాడు. చిలకలూరిపేట నుంచి వెంకట్రావు, భార్య కళావతి, పెద్దకుమారుడు ప్రసన్నకుమార్ ప్రైవేటు ట్రావెల్స్ కారు మాట్లాడుకుని బుధవారం ఉదయం 11 గంటలకు బయలుదేరి చెన్నై వెళ్లారు. రాత్రికి కుమారున్ని ఆనందంగా విమానం ఎక్కించి వీడ్కోలు పలికారు. అనంతరం కారులో తిరిగి చిలకలూరిపేటకు బయలుదేరారు. గురువారం తెల్లవారుజామున చెన్నై- కోల్కతా జాతీయ రహదారిలో ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం రేణంగివరం సమీపంలోని వంతెనపై కట్టెల ట్రాక్టర్ను వీరి వాహనం ఢీకొనడంతో వెంకట్రావు (55), ప్రసన్నకుమార్ (26) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కళ్లముందే భర్త, పెద్ద కుమారుడు మృతితో కళావతి అపస్మారకస్థితిలోకి వెళ్లింది. డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.
వెనుదిరిగిన కుమారుడు...
భాస్కర్ ఎక్కిన విమానం అబుదబి చేరగానే ప్రమాద వివరాలు తెలియడంతో దుఃఖసాగరంలో మునిగిపోయాడు. ప్రయాణం నుంచి వెనుదిరిగాడు. ఉన్నత విద్య పూర్తిచేసి మంచి ఉద్యోగం సాధించి తండ్రి ముందు గర్వంగా నిలబడాలని భావించిన భాస్కర్కు అక్కడకు వెళ్లకుండానే తండ్రి, అన్నకు తలకొరివి పెట్టాల్సి రావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కంటతడి పెడుతున్నారు.
చిలకలూరిపేటలోని ఇంటి వద్ద విషాదంలో కుటుంబ సభ్యులు...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ డీజీపీని బదిలీచేయండి: ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు
[ 25-04-2024]
డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిని బదిలీ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో భాజపా నేతలు మరోమారు ఫిర్యాదు చేశారు. -
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: సినీ నటుడు నిఖిల్
[ 25-04-2024]
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి ఎం.ఎం కొండయ్య గురువారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. -
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట