‘మహిళలపై దాడులు అరికట్టడంలో ప్రభుత్వం విఫలం’
మహిళలు, బాలికలపై అత్యాచారాలు, దాడులు నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, గుంటూరులో బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను ఎన్కౌంటర్ చేయాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే
జీజీహెచ్ వద్ద నిరసన తెలిపిన మాజీ ఎమ్మెల్యే మస్తాన్వలి
తెలుగు మహిళ, జనసేన నాయకుల ధర్నా
ఆందోళన చేస్తున్న తెలుగుదేశం మహిళా నాయకులు
నగరంపాలెం, న్యూస్టుడే: మహిళలు, బాలికలపై అత్యాచారాలు, దాడులు నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, గుంటూరులో బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను ఎన్కౌంటర్ చేయాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే మస్తాన్వలి డిమాండ్ చేశారు. అత్యాచారానికి గురై గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించేందుకు మాజీ ఎమ్మెల్యేలు మస్తాన్వలి, లింగంశెట్టి ఈశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు గురువారం జీజీహెచ్కు వచ్చారు. పోలీసులు అనుమతించకపోవడంతో గేటు వద్ద బైఠాయించి నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా మస్తాన్వలి మాట్లాడుతూ అత్యాచారానికి గురైన బాలికను పరామర్శించేందుకు వస్తే పోలీసులు అనుమతించకపోవడం మానవత్వానికి మాయనిమచ్చన్నారు. బాధితురాలికి ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులను గుంటూరు తూర్పు డీఎస్పీ సీతారామయ్య, సిబ్బంది అరెస్ట్ చేసి పోలీసుస్టేషన్కు తరలించారు.
‘మహిళలకు రక్షణ కల్పించలేని సీఎం రాజీనామా చేయాలి’
రాష్ట్రంలో ప్రతిరోజూ మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, వాటిని నిలువరించలేని సీఎం జగన్, హోంమంత్రి వనితలు వెంటనే రాజీనామా చేయాలని తెలుగు మహిళా నాయకులు దాసరి జ్యోతి, వనజాక్షి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలు, బాలికలపై అత్యాచారాలు అధికమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధితురాలికి ప్రభుత్వం రూ.25లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం జీజీహెచ్ ప్రధాన రహదారిపై నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో తెలుగు మహిళా నాయకులు వాణి, వందన, కార్యకర్తలు పాల్గొన్నారు. బాలికపై అత్యాచారం చేసిన నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీ మహిళా నాయకురాలు పార్వతీనాయుడు డిమాండ్ చేశారు. అత్యాచారానికి గురైన బాలికను పరామర్శించేందుకు జీజీహెచ్కు వచ్చిన జనసేన పార్టీ మహిళా నాయకులను పోలీసులు అనుమతించకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు బిట్రగుంట మల్లిక, హైమావతి, కార్పొరేటర్లు లక్ష్మీదుర్గ, పద్మావతి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, అధికార ప్రతినిధి ఆళ్లహరి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంగళగిరిలో నారా లోకేశ్ నామినేషన్.. తెదేపా శ్రేణుల భారీ ర్యాలీ
[ 18-04-2024]
గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ స్థానానికి తెదేపా అభ్యర్థిగా నారా లోకేశ్ నామినేషన్ దాఖలు చేశారు. -
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైకాపా నేతలు
[ 18-04-2024]
భీమిలి, జీడీ నెల్లూరు నియోజకవర్గాలకు చెందిన పలువురు వైకాపా నేతలు తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో గురువారం ఆ పార్టీలో చేరారు. -
నీరివ్వలేని నీరో!
[ 18-04-2024]
సీఎం జగన్... పేదల పక్షపాతినంటారు.. ఎన్నికల్లో వారే తన స్టార్ క్యాంపెయినర్లంటారు.. వారి జీవితాలను బాగు చేసేది తనొక్కడేనంటూ గొప్పలకు పోతుంటారు.. కానీ.. తన నివాసానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళగిరి ఎయిమ్స్లోని నిరుపేద రోగుల గొంతు తడపలేకపోతున్నారు. -
నారీ గళంతో జగన్ వెన్నులో వణుకు
[ 18-04-2024]
నారీ గళంతో జగన్ వెన్నులో వణుకు పుట్టాలని తెదేపా గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ అభ్యర్థి గళ్లా మాధవి, తెలుగు మహిళ నాయకురాలు మాగంటి రూప, తెలంగాణ తెదేపా నాయకులు నన్నూరి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. -
కీలక ఘట్టానికి వేళాయె
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం నేటి నుంచి ఆరంభం కాబోతోంది. గురువారం నుంచి అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయనున్నారు. జిల్లాలో నామినేషన్ల స్వీకరణకు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -
నాడు ఆశల కేంద్రం.. నేడు విధ్వంసానికి నిలయం
[ 18-04-2024]
రాష్ట్ర విభజన తర్వాత తుళ్లూరు మండలంలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. గత తెదేపా ప్రభుత్వంలో రాత్రీ పగలు తేడా లేకుండా వేల మంది కార్మికులతో కళకళలాడిన అమరావతి వైకాపా పాలనలో విధ్వంసానికి చిరునామాగా మారింది. -
జీతాలకూ ఎదురుచూపులే..
[ 18-04-2024]
జిల్లాలోని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ఫిబ్రవరి, మార్చి జీతాలు రాలేదు. ఏప్రిల్ నెల జీతంతో కలిపి రెండు నెలల బకాయిలు విడులవుతాయన్న నమ్మకం లేదు. -
గుంటూరువాసికి క్రికెట్ సైట్ స్క్రీన్పై పేటెంట్
[ 18-04-2024]
జోసెల్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, జేకేసీ కళాశాల కార్యదర్శి, గుంటూరు జిల్లా మెన్, ఉమెన్ క్రికెట్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షుడు, ఏసీఏ ఉమెన్స్ అకాడమీ పూర్వ ఛైర్మన్ జాగర్లమూడి మురళీమోహన్ నూతన ఆవిష్కరణకు పేటెంట్ లభించింది. -
శిరోముండనం కేసులో శిక్ష విధించడం హర్షణీయం
[ 18-04-2024]
శిరోముండనం కేసుల్లో నిందితులకు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు జైలుశిక్ష, జరిమానా విధించడం హర్షణీయమని భీమ్ భారత్ రాష్ట్ర అధ్యక్షుడు పాగళ్ల ప్రకాష్ అన్నారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 18-04-2024]
స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి నీట మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. -
సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహిద్దాం
[ 18-04-2024]
పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు హింస, రీపోలింగ్ లేకుండా విజయవంతం చేసేందుకు అధికారులు, సిబ్బంది సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శివశంకర్ కోరారు. -
విశ్రాంతిలోనూ.. మనశ్శాంతి లేదయ్యా!
[ 18-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి ప్రసాద్కు గతంలో ఒకటో తేదీనే పింఛన్ సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ అయ్యేది. బీపీ, మధుమేహం సమస్యతో బాధపడుతున్న ఆయన నెల రోజులకు సరిపడా ఒకేసారి ఔషధాలు తెచ్చుకునేవారు. -
అయిదేళ్లుగా చోద్యం చూశారు!
[ 18-04-2024]
ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన వంతెన ఇది. శిథిలావస్థకు చేరి అడుగు భాగం దిమ్మెలు పగుళ్లిచ్చాయి. ఇనుప రాడ్ల ఆధారంగా నిలబడింది. భారీ వాహనాలు ప్రయాణిస్తే దిమ్మెలు కదులుతున్నాయి. -
పోలీసు.. వైకాపాకు వత్తాసు
[ 18-04-2024]
సాధారణంగా ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసే తనిఖీ కేంద్రాలు(చెక్పోస్టులు) వద్ద ప్రత్యేకంగా సిబ్బందికి విధులు కేటాయిస్తారు. కానీ జిల్లాలో పోలీసుస్టేషన్లలో ఉండాల్సిన సీఐ, ఎస్సైలకు చెక్పోస్టు డ్యూటీలకు పంపడం చర్చనీయాంశమవుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మ చనిపోయారు.. పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
-
లోక్సభ ఎన్నికలు.. ద్రవిడనాట ‘భాజపా’ బోణీ కొట్టేనా?
-
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోంది: వైఎస్ షర్మిల
-
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
-
భారీ బంగారం కంటెయినర్ మాయం కేసు.. నిందితుల్లో భారత సంతతి వ్యక్తులు