logo

హత్యకేసులో నిందితులకు రిమాండ్‌

రొంపిచర్ల మండలం మర్రిచెట్టుపాలెంలో జరిగిన హత్య కేసులో నిందితులు చెల్లిజోజి, సెల్వరాజ్‌కు న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు. మే 10న తాపీ పని చేయగా వచ్చిన డబ్బు పంచుకునే విషయంలో ఏర్పడిన

Published : 20 May 2022 04:15 IST

నరసరావుపేట అర్బన్‌, న్యూస్‌టుడే : రొంపిచర్ల మండలం మర్రిచెట్టుపాలెంలో జరిగిన హత్య కేసులో నిందితులు చెల్లిజోజి, సెల్వరాజ్‌కు న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు. మే 10న తాపీ పని చేయగా వచ్చిన డబ్బు పంచుకునే విషయంలో ఏర్పడిన వివాదంలో జిడుగు శ్రీనివాసరావును హత్య చేసినట్లు కేసు నమోదైంది. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు నిందితులను కోర్టులో హాజరు పరచారు. న్యాయమూర్తి జె.అంజయ్య నిందితులకు రిమాండ్‌ విధించారు.

హత్యాయత్నం కేసులో
రొంపిచర్ల మండలం కొత్తపల్లిలో జరిగిన ఘటన కేసులో నిందితులు సయ్యద్‌ కాశీ, షేక్‌ నాగార్జున, షేక్‌ సైదా, బత్తుల మహేష్‌కు న్యాయమూర్తి జె.అంజయ్య రిమాండ్‌ విధించారు. నరసరావుపేట పట్టణానికి చెందిన నిందితులు ఏప్రిల్‌ 12న సయ్యద్‌ బాజీ ఇంట్లోకి ప్రవేశించి అతన్ని కొట్టి రూ.5 వేలు, సెల్‌ఫోన్‌ దోచుకున్నారు. తర్వాత గ్రామంలో ధనవంతుల వివరాలు చెప్పాలంటూ కత్తులతో పొడిచి బెదిరించి వెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని