హత్యకేసులో నిందితులకు రిమాండ్
రొంపిచర్ల మండలం మర్రిచెట్టుపాలెంలో జరిగిన హత్య కేసులో నిందితులు చెల్లిజోజి, సెల్వరాజ్కు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. మే 10న తాపీ పని చేయగా వచ్చిన డబ్బు పంచుకునే విషయంలో ఏర్పడిన
నరసరావుపేట అర్బన్, న్యూస్టుడే : రొంపిచర్ల మండలం మర్రిచెట్టుపాలెంలో జరిగిన హత్య కేసులో నిందితులు చెల్లిజోజి, సెల్వరాజ్కు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. మే 10న తాపీ పని చేయగా వచ్చిన డబ్బు పంచుకునే విషయంలో ఏర్పడిన వివాదంలో జిడుగు శ్రీనివాసరావును హత్య చేసినట్లు కేసు నమోదైంది. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు నిందితులను కోర్టులో హాజరు పరచారు. న్యాయమూర్తి జె.అంజయ్య నిందితులకు రిమాండ్ విధించారు.
హత్యాయత్నం కేసులో
రొంపిచర్ల మండలం కొత్తపల్లిలో జరిగిన ఘటన కేసులో నిందితులు సయ్యద్ కాశీ, షేక్ నాగార్జున, షేక్ సైదా, బత్తుల మహేష్కు న్యాయమూర్తి జె.అంజయ్య రిమాండ్ విధించారు. నరసరావుపేట పట్టణానికి చెందిన నిందితులు ఏప్రిల్ 12న సయ్యద్ బాజీ ఇంట్లోకి ప్రవేశించి అతన్ని కొట్టి రూ.5 వేలు, సెల్ఫోన్ దోచుకున్నారు. తర్వాత గ్రామంలో ధనవంతుల వివరాలు చెప్పాలంటూ కత్తులతో పొడిచి బెదిరించి వెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.