విత్తు ఘనం.. పూత ఘోరం
ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో లక్ష హెక్టార్లల్లో మిర్చి సాగవుతోంది. ఇందులో సంకర విత్తనాలు(హైబ్రీడ్) సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. మిర్చి విత్తన కంపెనీలన్నీ కర్ణాటక కేంద్రంగా విత్తన మిర్చి
ఆకర్షణీయ సంచులతో ఆకట్టుకుంటున్న కంపెనీలు
ఈనాడు, అమరావతి: ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో లక్ష హెక్టార్లల్లో మిర్చి సాగవుతోంది. ఇందులో సంకర విత్తనాలు(హైబ్రీడ్) సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. మిర్చి విత్తన కంపెనీలన్నీ కర్ణాటక కేంద్రంగా విత్తన మిర్చి సాగుతోపాటు ప్యాకింగ్ చేసి ఇక్కడ సరఫరా చేస్తున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కంపెనీలు సైతం గుంటూరు కేంద్రంగా విత్తనాలు విక్రయిస్తున్నాయి. కొన్ని కంపెనీలు మాత్రం వ్యవసాయశాఖ అనుమతి లేకుండా ఆకర్షణీయ సంచులతో రైతులకు అంటగడుతున్నాయి. కొందరు విత్తన ఉత్పత్తిదారుల నుంచి బల్క్గా విత్తనాలు కొనుగోలు చేసి ప్రాసెస్ చేసి సొంత బ్రాండ్లతో విక్రయిస్తున్నారు. పూత, కాయ దశలో నాణ్యత లేని విత్తనాలను గుర్తించినా పంట తొలగించలేక దిగుబడులు తగ్గి రైతులు నష్టపోతున్నారు. అయితే కొన్ని కంపెనీలు అరకొరగా పరిహారం ఇచ్చి సమస్యను సద్దుమణిగేలా చేస్తున్నాయి. గతేడాది క్రోసూరు, పెదకూరపాడు ప్రాంతాల్లో ఒక ప్రముఖ కంపెనీని పోలిన విత్తనాలను గుర్తించారు. వ్యవసాయశాఖ రంగంలోకి దిగి ఆరా తీస్తే అమ్మిన, కొనుగోలు చేసిన రైతులు బంధువులు కావడంతో ఎక్కడి నుంచి తీసుకువచ్చారన్న విషయం ఇప్పటికీ తెలియలేదు. వ్యవసాయశాఖ యంత్రాంగం వెళ్లేటప్పటికీ ఆనవాళ్లు లేకుండా నారు దున్నేయడం, విత్తన సంచులు దాచేయడం గమనార్హం. నాలుగేళ్ల కిందట నరసరావుపేట, నకరికల్లు మండలాల్లోనూ నాణ్యత లేని విత్తనాలతో రైతులు నష్టపోయారు. గతేడాది బొబ్బర తెగులు, తామర పురుగుతో మిర్చి పంట దెబ్బతింది. ఈనేపథ్యంలో కొందరు వ్యాపారులు వైరస్ను తట్టుకునే రకాలు అంటూ రైతులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. రూ.లక్షల పెట్టుబడితో సాగు చేస్తున్న రైతులకు మిర్చి దిగుబడులు తగ్గితే ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగులుతోంది.
అప్రమత్తతతోనే అడ్డుకట్ట
మిర్చి విత్తనాలతోపాటు రైతులు నర్సరీల నుంచి నారు కొనుగోలు చేసి సాగు చేస్తారు. ప్రధాన కంపెనీల విత్తనాలు కిలో రూ.25వేల నుంచి రూ.లక్ష వరకు ధర పలుకుతున్నాయి. కర్ణాటక రాష్ట్రం రాణిబెన్నూరు పరిసర ప్రాంతాలు మిర్చి విత్తన ఉత్పత్తికి కేంద్రాలు. ఇక్కడే ప్రముఖ కంపెనీల నుంచి చిన్న కంపెనీలు విత్తనోత్పత్తి చేస్తాయి. నర్సరీ నిర్వాహకులు కొందరు రాణిబెన్నూర్ తదితర ప్రాంతాలకు వెళ్లి విత్తన ఉత్పత్తి కేంద్రాల నుంచి కొనుగోలు చేసి తెస్తున్నారు. వీటికి పరీక్షలు నిర్వహించకుండా నేరుగా నారు పోసి ప్రధాన కంపెనీల విత్తనాలతో పెంచిన మొక్కలనీ రైతులకు అంటగడుతున్నారు. వీటిని సాగుచేసిన రైతులు నష్టపోతున్నారు. నర్సరీ నిర్వాహకుల అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ఉద్యానశాఖ నర్సరీ చట్టాన్ని అమలు చేస్తోంది. నర్సరీ నిర్వాహకులు ఉద్యానశాఖ నుంచి అనుమతులు తీసుకోవడంతోపాటు విత్తనాలు ఎక్కడి నుంచి, ఎంత పరిమాణంలో కొన్నారు? ఏరకాలకు చెందిన విత్తనాలతో నారు పెంచారు? విత్తన కొనుగోలుకు సంబంధించిన బిల్లులు, రైతులకు నారు విక్రయించినట్లు రికార్డుల్లో నమోదు వంటివి పక్కాగా అమలు చేయాలి. నర్సరీ నిర్వాహకులకు రైతులు విత్తనాలు ఇచ్చి నారు పెంచమని చెబితే ఆ వివరాలు రికార్డుల్లో స్పష్టంగా నమోదు చేయాలి. రైతులు ప్రధానంగా తాము పెంచుకున్న నారు సరిపోనప్పుడు, పడి మొక్కల కోసం ఎక్కువగా నర్సరీలను ఆశ్రయిస్తారు. ఈ సమయంలో నర్సరీ నిర్వాహకుల వద్ద బిల్లులు, విత్తన ఖాళీ సంచులు తదితర వివరాలు చూసుకుని బిల్లులతో కొనుగోలు చేయాలి. ఏదైనా అనుమానం వస్తే వెంటనే ఉద్యాన, వ్యవసాయశాఖకు సమాచారం ఇవ్వాలి. సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో నర్సరీ నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి పకడ్బందీగా చట్టాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని ఉద్యానశాఖ జిల్లా అధికారి సుజాత ‘ఈనాడు’కు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ డీజీపీని బదిలీచేయండి: ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు
[ 25-04-2024]
డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిని బదిలీ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో భాజపా నేతలు మరోమారు ఫిర్యాదు చేశారు. -
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: సినీ నటుడు నిఖిల్
[ 25-04-2024]
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి ఎం.ఎం కొండయ్య గురువారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. -
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?