తెనాలిలో క్రికెట్ బుకీ అరెస్టు
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ పోటీల నేపథ్యంలో పెద్దఎత్తున బెట్టింగు నిర్వహిస్తున్న ఓ బుకీని గుంటూరు జిల్లా, తెనాలి వన్టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్స్టేషన్లో ..
బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు
తెనాలి టౌన్, న్యూస్టుడే: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ పోటీల నేపథ్యంలో పెద్దఎత్తున బెట్టింగు నిర్వహిస్తున్న ఓ బుకీని గుంటూరు జిల్లా, తెనాలి వన్టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్స్టేషన్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటుచేసిన సమావేశంలో డీఎస్పీ డాక్టర్ కె.స్రవంతిరాయ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని ఉప్పుబజార్లో ఉన్న ఓ ఇంటిలో బెట్టింగ్ జరుగుతోందన్న సమాచారంతో గురువారం అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా బెట్టింగ్ నమోదుల ప్రధాన బుకీ జి.వెంకట్, అతని సహాయకుడు వెంకటేష్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ఒక ల్యాప్ట్యాప్, 8 స్మార్ట్ఫోన్లు, 9 కీప్యాడ్ ఫోన్లను కలిగి ఉన్న లైన్ బాక్స్, రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడైన వెంకట్ గతంలోనూ ఈ తరహా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. చరవాణులు, ఇతర సాంకేతిక పరికరాల విశ్లేషణ తర్వాత ఇందులో ఎంత మంది పాల్గొన్నారు? వారు ఎవరు? ఏమేరకు ఆర్థిక లావాదేవీలు జరిగాయి.. తదితర సమాచారాన్ని సేకరించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ చెప్పారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న వన్టౌన్ పోలీసులను ఆమె అభినందించారు. సమావేశంలో సీఐ చంద్రశేఖర్, ఎస్సైలు ఉమామహేశ్వరరావు, చాణక్య ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కాగా ప్రధాన నిందితుడు వెంకట్ బెంగళూరు కేంద్రంగా బెట్టింగ్ నిర్వహిస్తుంటాడని, ఉభయ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లోనూ అతని సిబ్బంది ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు పక్కా సాక్ష్యాధారాలు సేకరించే పనిలో వారు నిమగ్నమై ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.