logo

చౌక బియ్యం పట్టివేత

తెనాలి నుంచి కాకినాడ పోర్టుకు అక్రమంగా తరలిస్తున్న రూ.4.32 లక్షలు విలువైన 240 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని భీమడోలు పోలీసులు జాతీయరహదారిపై సూరప్పగూడెం వద్ద శుక్రవారం

Published : 21 May 2022 04:24 IST

భీమడోలు(ఏలూరుజిల్లా), న్యూస్‌టుడే: తెనాలి నుంచి కాకినాడ పోర్టుకు అక్రమంగా తరలిస్తున్న రూ.4.32 లక్షలు విలువైన 240 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని భీమడోలు పోలీసులు జాతీయరహదారిపై సూరప్పగూడెం వద్ద శుక్రవారం పట్టుకున్నారు. . బియ్యంతోపాటు లారీని కూడా సీజ్‌ చేసినట్లు భీమడోలు మండల సీఎస్‌ డీటీ ఎ.మాధవరావు తెలిపారు. తెనాలికి చెందిన వేముల ట్రేడర్స్‌ యజమాని వెంకటరత్నకిషోర్, పొన్నూరుకు చెందిన షేక్‌ సిరాజుద్దీన్‌బాబావలీ, వెలగ మోహనకృష్ణ, చింతా ప్రదీప్‌లపై 6ఏ కేసు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని