logo

‘అరాచక శక్తులకు అడ్డాగా ఆంధ్రప్రదేశ్‌’

వైకాపా అధికారంలోకి వచ్చిన్నప్పటి నుంచి రాష్ట్రం అరాచక శక్తులకు అడ్డాగా మారిందని, నలుదిక్కుల రాక్షస మూకలు చేరి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరాకు చేశాయని జనసేన పార్టీ కృష్ణా-పెన్నా ప్రాంతీయ

Published : 21 May 2022 04:25 IST

బ్రాడీపేట, న్యూస్‌టుడే : వైకాపా అధికారంలోకి వచ్చిన్నప్పటి నుంచి రాష్ట్రం అరాచక శక్తులకు అడ్డాగా మారిందని, నలుదిక్కుల రాక్షస మూకలు చేరి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరాకు చేశాయని జనసేన పార్టీ కృష్ణా-పెన్నా ప్రాంతీయ కో-ఆర్టినేటర్‌ పార్వతీ నాయుడు పేర్కొన్నారు. వైకాపా రాక్షస పాలన అంతానికి మహిళలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక బ్రాడీపేటలోని హోటల్‌ గ్రాండ్‌ నాగార్జునలో జనసేన వీర మహిళల సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పార్వతీనాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని, ఆడబిడ్డలని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మహిళా శక్తి ఏమిటో రానున్న ఎన్నికల్లో వైకాపాకు చూపించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో వరుసగా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా సీఎంకి కనిపించడం లేదని, మహిళ ఆర్తనాదాలు వినపడటం లేదని విమర్శించారు. కృషా ్ణజిల్లా ప్రాంతీయ కన్వీనర్‌ విజయలక్ష్మి, మహిళా నాయకురాలు రావి సౌజన్య మాట్లాడారు. అనంతరం పలువురు ప్రజాప్రతినిధులను సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్లు వీరమహిళలు బిట్రగుంట మల్లిక, దుర్గాకుమారి, కమతం విజయకుమారి, కోమలి, కార్పోరేటర్లు పద్మావతి, లక్ష్మీదుర్గ, పార్టీ రాష్ట్రకార్యదర్శి నాయబ్‌ కమాల్, చిల్లంపల్లి శ్రీనివాస్, నేరేళ్ల సురేష్, ఆళ్ల హరి తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని